ఈసారి దసరా సీజన్లో మూడు క్రేజీ సినిమాలు రిలీజయ్యాయి. వాటిలో రిలీజ్ ముందు హైప్ అంతా అనువాద చిత్రమైన ‘లియో’కే ఉంది. ఓపెనింగ్స్లో కూడా ఆ సినిమానే డామినేట్ చేసింది. డివైడ్ టాక్ను కూడా తట్టుకుని తొలి వీకెండ్లో ఆ సినిమా మంచి వసూళ్లు సాధించింది. కానీ ‘లియో’కు క్రమంగా డివైడ్ టాక్ పెరగడంతో వసూళ్లు తగ్గుతూ వచ్చాయి. వీకెండ్ అయ్యాక సినిమా నిలబడలేకపోయింది. తొలి రెండు రోజుల్లో అంచనాలకు తగ్గట్లు వసూళ్లు రాబట్టని బాలయ్య సినిమా ‘భగవంత్ కేసరి’.. శనివారం నుంచి జోరు పెంచింది.
రోజు రోజుకూ వసూళ్లు పెరిగాయి. దసరా రోజుతో పాటు మరుసటి రోజు కూడా బాక్సాఫీస్ దగ్గర ‘భగవంత్ కేసరి’ డామినేషన్ కనిపించింది. తొలి రోజు తర్వాత అత్యధిక వసూళ్లు వచ్చింది 5, 6 రోజుల్లోనే ఉంటున్నాయి ట్రేడ్ వర్గాలు. అంతిమంగా దసరా విన్నర్ ‘భగవంత్ కేసరి’ అని తేలడం.. దసరా సీజన్లో అన్ని వర్గాల ప్రేక్షకులకూ నచ్చే సినిమా ఇదే కావడంతో వసూళ్లకు ఢోకా లేకపోయింది. నిర్మాత దిల్ రాజు అన్నట్లు ఇది లాంగ్ రన్ ఫిలిం అనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
రెండో వీకెండ్ను కూడా ఈ సినిమా బాగా ఉపయోగించుకునేలా కనిపిస్తోంది. మరోవైపు డివైడ్ టాక్, డల్ ఓపెనింగ్స్తో మొదలైన రవితేజ సినిమా ‘టైగర్ నాగేశ్వరరావు’ వసూళ్లు కూడా నెమ్మదిగా పుంజుకోవడం విశేషం. ‘లియో’ డౌన్ అయిపోవడంతో ‘టైగర్’ ప్రేక్షకులకు సెకండ్ ఆప్షన్గా మారింది. రవితేజ అభిమానులు, మాస్ ప్రేక్షకులు సినిమాను బానే చూస్తున్నట్లు కనిపిస్తోంది. దసరా రోజు, తర్వాతి రోజు సినిమాకు ఉన్నంతలో మంచి వసూళ్లు వచ్చాయి. టాక్ చూసి మరీ భయపడినంత పరిస్థితి అయితే లేదు. ‘లియో’ది మాత్రం ఆరంభ శూరత్వమే అయింది.
This post was last modified on October 25, 2023 3:59 pm
రష్యా సాయుధ బలగాలు జరిపిన దాడిలో కేరళకు చెందిన అఖిల్ జోయన్ అనే 26 ఏళ్ల నావికుడు ప్రాణాలు కోల్పోయాడు.…
1997 వినీత్, సౌందర్య జంటగా ఆరో ప్రాణం అనే సినిమా వచ్చింది. మంచి హిట్. చక్కని పాటలతో పాటు క్లిష్టమైన…
ఇంగ్లాండ్ తో జరిగిన వన్డే సిరీస్ టీమిండియా బౌలింగ్ లోపాలపై ఒక పెద్ద డేంజర్ బెల్ మోగించింది. బ్యాటింగ్ బలంగా…
సినిమాకు హైప్ తీసుకురావడంలో ఒక్కో దర్శకుడిది ఒక్కో స్టైల్. ముఖ్యంగా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకులు తమ…
టీడీపీ ని నిలబెట్టింది కార్యకర్తలు.. వారి అండతోనే పార్టీ విజయం దక్కించుకుంటోంది- అని పార్టీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ…
దేశరాజధాని ఢిల్లీలో సోమవారం చోటు చేసుకున్న పరిణామాలపై సోషల్ మీడియా వేదికగా అనేక వ్యాఖ్యలు వెల్లువెత్తుతున్నాయి. అందరి టార్గెట్ ఒక్కటే..…