ఈసారి దసరా సీజన్లో మూడు క్రేజీ సినిమాలు రిలీజయ్యాయి. వాటిలో రిలీజ్ ముందు హైప్ అంతా అనువాద చిత్రమైన ‘లియో’కే ఉంది. ఓపెనింగ్స్లో కూడా ఆ సినిమానే డామినేట్ చేసింది. డివైడ్ టాక్ను కూడా తట్టుకుని తొలి వీకెండ్లో ఆ సినిమా మంచి వసూళ్లు సాధించింది. కానీ ‘లియో’కు క్రమంగా డివైడ్ టాక్ పెరగడంతో వసూళ్లు తగ్గుతూ వచ్చాయి. వీకెండ్ అయ్యాక సినిమా నిలబడలేకపోయింది. తొలి రెండు రోజుల్లో అంచనాలకు తగ్గట్లు వసూళ్లు రాబట్టని బాలయ్య సినిమా ‘భగవంత్ కేసరి’.. శనివారం నుంచి జోరు పెంచింది.
రోజు రోజుకూ వసూళ్లు పెరిగాయి. దసరా రోజుతో పాటు మరుసటి రోజు కూడా బాక్సాఫీస్ దగ్గర ‘భగవంత్ కేసరి’ డామినేషన్ కనిపించింది. తొలి రోజు తర్వాత అత్యధిక వసూళ్లు వచ్చింది 5, 6 రోజుల్లోనే ఉంటున్నాయి ట్రేడ్ వర్గాలు. అంతిమంగా దసరా విన్నర్ ‘భగవంత్ కేసరి’ అని తేలడం.. దసరా సీజన్లో అన్ని వర్గాల ప్రేక్షకులకూ నచ్చే సినిమా ఇదే కావడంతో వసూళ్లకు ఢోకా లేకపోయింది. నిర్మాత దిల్ రాజు అన్నట్లు ఇది లాంగ్ రన్ ఫిలిం అనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
రెండో వీకెండ్ను కూడా ఈ సినిమా బాగా ఉపయోగించుకునేలా కనిపిస్తోంది. మరోవైపు డివైడ్ టాక్, డల్ ఓపెనింగ్స్తో మొదలైన రవితేజ సినిమా ‘టైగర్ నాగేశ్వరరావు’ వసూళ్లు కూడా నెమ్మదిగా పుంజుకోవడం విశేషం. ‘లియో’ డౌన్ అయిపోవడంతో ‘టైగర్’ ప్రేక్షకులకు సెకండ్ ఆప్షన్గా మారింది. రవితేజ అభిమానులు, మాస్ ప్రేక్షకులు సినిమాను బానే చూస్తున్నట్లు కనిపిస్తోంది. దసరా రోజు, తర్వాతి రోజు సినిమాకు ఉన్నంతలో మంచి వసూళ్లు వచ్చాయి. టాక్ చూసి మరీ భయపడినంత పరిస్థితి అయితే లేదు. ‘లియో’ది మాత్రం ఆరంభ శూరత్వమే అయింది.
This post was last modified on October 25, 2023 3:59 pm
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…