టాలీవుడ్ నటుడు నందు రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాడు. అతను బిగ్ బాస్ నాలుగో సీజన్లో పార్టిసిపెంటుగా వెళ్లబోతున్నట్లు కొంత కాలంగా ప్రచారం జరుగుతుండగా.. #BB అనే హ్యాష్ ట్యాగ్ పెట్టి తన కొత్త ప్రాజెక్ట్ అంటూ సంకేతాలు ఇవ్వడంతో అతను బిగ్ బాస్లోకి వెళ్లడం ఖాయం అని అంతా ఓ నిర్ణయానికి వచ్చేశాడు. బిగ్ బాస్ నిబంధనలకు విరుద్ధంగా ఇలా ముందే తన బిగ్ బాస్ ఎంట్రీ గురించి సంకేతాలిచ్చాడేంటి అని అంతా ఆశ్చర్యపోయారు కూడా. కానీ తాను చెప్పింది బిగ్ బాస్ గురించి కాదని.. ఈ #BB వేరని తర్వాత అసలు విషయం చెప్పాడు నందు. అది అతడి కొత్త సినిమా కబురు అన్న సంగతి తాజాగా వెల్లడైంది.
బొమ్మ బ్లాక్బస్టర్ పేరుతో నందు కొత్తగా ఓ సినిమా చేయబోతున్నాడు. రాజ్ విరాట్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి, మనోహర్ రెడ్డి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనున్నారు. ప్రశాంత్ విహారి సంగీత దర్శకుడు. ఇది విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురం ప్రాంత నేపథ్యంలో సాగే సినిమా. ఒక ఆర్ట్ మాదిరి ఉన్న ప్రి లుక్ పోస్టర్ ద్వారా చాలా విషయాలు చెప్పాలని చూశారు. కానీ అందులో స్పష్టత లేకపోయింది. నందుకైతే ఇది స్పెషల్ మూవీనే అనిపిస్తోంది. దీని కోసం గడ్డం పెంచి లుక్ మార్చుకుని కొత్తగా తయారయ్యాడతను. మంచి టైటిల్, టీంతో వస్తున్న నందు.. ఈసారైనా సోలో హీరోగా ఆశించిన విజయాన్నందుకుంటాడేమో చూడాలి. చివరగా అతను హీరోగా నటించిన సవారి ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది.
మా ఇంటి బంగారం కథ ముందుగా సాయిపల్లవి దగ్గరికి వెళ్లిన సంగతి సమంత స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పాక బయటికి వచ్చింది.…
స్టార్ అన్న గుర్తింపు తెచ్చుకోలేకపోయి ఉండొచ్చు కానీ.. తమిళ, తెలుగు భాషల్లో సీనియర్ నటుడు ఆనంద్కు మంచి గుర్తింపే ఉంది.…
ముంబైలో ఇటీవల జరిగిన ఇంటర్నేషనల్ యోగా డే వేడుకల్లో హీరోయిన్ శ్రీలీలకు అవమానం జరిగిందని సోషల్ మీడియాలో ఒక వీడియో…
తప్పు చేసింది కేంద్ర ప్రభుత్వం. తన తప్పును ఏమాత్రం పట్టించుకోని కేంద్రం… విద్యార్థులు చేసిన చిన్నపాటి తప్పులకూ పెద్ద శిక్షలేసింది.…
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ 'మై వాపస్ ఆవుంగా'కు తొలి రోజు రివ్యూలు ఏమంత ఆశాజనకంగా లేవు. పబ్లిక్ టాక్…
సాయిధరమ్ తేజ్ హీరోగా రెండేళ్ల ముందు మొదలైన సినిమా.. సంబరాల యేటిగట్టు. తన మార్కెట్ స్థాయికి మించి పెద్ద బడ్జెట్లో…