భోళా శంకర్ తర్వాత జరిగిన అనూహ్య పరిణామాల ప్రభావం వల్ల దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ప్రాజెక్ట్ పక్కకెళ్ళిపోయి దాని స్థానంలో వసిష్ఠ ప్యాన్ ఇండియా మూవీ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. నిన్న అధికారికరంగా ప్రకటించేశారు. ఇది యువి క్రియేషన్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో రూపొందనుంది. కీరవాణి సంగీతం సమకూరుస్తుండగా చోటా కె నాయుడు ఛాయాగ్రహణ బాధ్యతలు తీసుకున్నారు. అయితే కూతురు సుష్మిత కొణిదెల నిర్మాతగా చేయాల్సిన సినిమాని అనుకోకుండా పక్కకు తప్పించారని అందరూ అనుకున్నారు కానీ డైరెక్టర్ కాంబో మారి మెగా 157గా రెడీ కానుంది.
విశాల్ అభిమన్యుడుతో డెబ్యూ రూపంలోనే సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు పీఎస్ మిత్రన్ కి చిరంజీవి ఓకే చెప్పడం హఠాత్తుగా జరిగిన ఘట్టం కాదు. దీని వెనుక చిన్న కథుంది. కార్తీ సర్దార్ రిలీజయ్యాక మిత్రన్ చిరుని కలిసి ఓ స్టోరీ లైన్ చెప్పాడు. ఇంప్రెస్ అయిన మెగాస్టార్ పూర్తి వెర్షన్ డెవలప్ చేయమని చెప్పారు. అప్పటికింకా ఆచార్య రిలీజ్ కాలేదు. వాల్తేరు వీరయ్య నిర్మాణంలో ఉంది. నిర్మాత ఎవరనేది తర్వాత డిసైడ్ చేయాలనే ఉద్దేశంతో స్క్రిప్ట్ పనులు మొదలుపెట్టారు. మిత్రన్ చెప్పింది సీరియస్ సబ్జెక్టు. సోషల్ ఇష్యూ లేనిదే ఇతను స్టోరీలు రాసుకోడు.
అభిమన్యుడులో ఆన్ లైన్ మోసాలు, శివ కార్తికేయన్ శక్తిలో ఎడ్యుకేషన్ మాఫియా, కార్తీ సర్దార్ లో నీటి పొల్యూషన్ మీద చర్చించాడు. చిరంజీవికి చెప్పిన కథలోనూ ఈ తరహా అంశం ఉందట. అయితే కమర్షియల్ సినిమాల్లోనే తనను ప్రేక్షకులు కోరుకుంటున్నారనే లెక్కలో ఉన్న చిరంజీవి మిత్రన్ ని వెయిటింగ్ లో పెట్టారు. ఒకవేళ భోళా శంకర్ హిట్ అయ్యి కళ్యాణ్ కృష్ణది మొదలుపెట్టి ఉంటే మిత్రన్ ఇంకో ఏడాది వెయిట్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు రూట్ క్లియరయ్యింది. ఇతనికిది నాలుగో సినిమా. ఠాగూర్ తరహాలో కంప్లీట్ యాక్షన్ కం మెసేజ్ ప్యాకేజ్ గా ఉంటుందని సమాచారం.
సోషల్ మీడియాలో హడావిడి తగ్గింది కానీ వీక్ డేస్ లో కూడా మా ఇంటి బంగారంకు మంచి ఆక్యుపెన్సీలు నమోదవుతున్నాయి.…
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రెండు వర్గాలుగా చీలిపోయి ఒక ఊహించని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఏప్రిల్…
కొన్ని డిజాస్టర్లు ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంటాయి. అందులో పనిచేసిన వాళ్లందరినీ జీవిత కాల చేదు జ్ఞాపకాలుగా మారిపోతుంటాయి. ఆ సినిమాల…
మా ఇంటి బంగారం సినిమా విజయంతో సంబరాల్లో ఉన్న సమంత అభిమానులకు మరో శుభవార్త అందింది. సినిమా సక్సెస్ మీట్…
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్ టూర్లో ఊహించని పరిస్థితిని ఎదుర్కోబోతున్నాడు. శుక్రవారం ఐర్లాండ్తో జరిగే టీ20 మ్యాచ్తో…
విజయ్ దేవరకొండ ప్యాన్ ఇండియా మూవీ రణబాలి సెప్టెంబర్ 11 విడుదల తేదీ ఎప్పుడో ఖరారు చేసుకుంది. అధికారిక ప్రకటన…