పండగ పూట ఉదయం చిరంజీవి దర్శకుడు వశిష్ట కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ తాలూకు కీలక అప్డేట్ ఉంటుందని యూవీ క్రియేషన్స్ తెగ ఊరిస్తూ ట్వీట్ పెట్టింది. ఇంకేముంది ఫ్యాన్స్ ఏవేవో ఊహించుకుని ఎదురు చూడటం మొదలుపెట్టారు. టైం చెప్పకుండా సస్పెన్స్ మైంటైన్ చేస్తూ అభిమానులు పావుగంటకోసారి సోషల్ మీడియా చెక్ చేసుకునేలా ప్రేరేపించింది. ఇంతా చేసి ఇచ్చిందేమయ్యా అంటే ఒక గ్రాఫిక్ తో చేసిన ఆయుధమున్న పోస్టర్ తో పాటు మెగా 157 కాస్తా నెంబర్ మారి 156 అయినట్టు చెప్పేశారు. అంటే భోళా శంకర్ తర్వాత సినిమా ఇదే.
దీని ప్రకారం చాలా స్పష్టంగా కళ్యాణ్ కృష్ణ సినిమాను పక్కపెట్టేసినట్టు క్లారిటీ ఇచ్చేశారు. నెలల తరబడి దాని మీద ఇతనితో పాటు రచయిత బెజవాడ ప్రసన్న కుమార్ స్క్రిప్ట్ సిద్ధం చేశారు. మలయాళం బ్రో డాడీని స్ఫూర్తిగా తీసుకుని కీలక మార్పులతో సిద్ధూ జొన్నలగడ్డ లేదా శర్వానంద్ మరో పాత్రలో తీయబోతున్నారని ప్రచారం జరిగింది. ఈలోగా భోళా శంకర్ డిజాస్టర్ కావడంతో పాటు ఎప్పుడూ లేనన్ని తీవ్ర విమర్శలు మెగాస్టార్ ఎంపిక మీద రావడంతో ఒక్కసారిగా ఆత్మ పరిశీలన చేసుకున్న చిరు ఇక నో రీమేక్స్ నో కామెడీస్ అంటూ ఫాంటసీకి షిఫ్ట్ అయిపోయారు.
ఇదేదో నేరుగా చెప్పేస్తే అయిపోయేది కానీ పండగ పూట ఇంత నాన్చకుండా ఉండాల్సింది. ఇవాళ ఈ మెగా 156 పాట రికార్డింగ్ తో పూజా కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఎంఎం కీరవాణి స్వరపరిచిన ఒక సాంగ్ ని రికార్డు చేసినట్టుగా తెలిసింది. చాలా మంది ఆహ్వానితులే మధ్య ప్రోగ్రాం జరిగిందనే టాక్ వచ్చింది కానీ ఇంకా దాని తాలూకు ఫోటోలు, వీడియో బయటికి వదల్లేదు. ఏ నిమిషమైనా హఠాత్తుగా ఇవ్వొచ్చు. దీన్ని ముందుగా ఇచ్చి ఉంటే మెగా ఫ్యాన్స్ కొంత సంతృప్తి చెందేవాళ్ళు. మెగా 156 పూర్తవ్వడానికి వచ్చే ఏడాది పట్టేలా ఉంది. 2025 సంక్రాంతికి టార్గెట్ చేస్తున్నారనే టాక్ ఉంది ప్రస్తుతానికైతే ఇది ఖరారుగా చెప్పలేం.
This post was last modified on October 24, 2023 9:16 am
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…
ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…
అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…
వైసీపీ అధినేత జగన్ బాబాయి, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి దారుణ హత్య కేసు తీర్పు 4 వారాల్లో రానుంది.…
బీఆర్ఎస్ పార్టీ మాజీ నాయకురాలు, మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత గత రెండు రోజులుగా నిరవధిక…