తమిళనాడు బాక్సాఫీస్ వద్ద టాక్ తో సంబంధం లేకుండా వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తున్న లియో దసరా పండగ పూర్తయ్యే వరకు నెమ్మదించే సూచనలు లేవు. తెలుగులో భగవంత్ కేసరితో పెద్ద పోటీ ఉన్నప్పటికీ భారీ కలెక్షన్లు రాబట్టడం విశేషం. అలా అని యునానిమస్ గా బ్లాక్ బస్టర్ టాక్ రాలేదు. అయినా సరే ఇంత స్పందన రావడం మాములు విషయం కాదు. ఇక ఈ సినిమాలో పాత్రలు వాటి మధ్య సంబంధాలు పక్కనపెడితే విజయ్ ఇంట్రో తర్వాత వచ్చే హైనా జంతువు ఎపిసోడ్ మీద విపరీతమైన హైప్ నెలకొంది. దర్శకుడు లోకేష్ కనగరాజ్ మిస్ అవ్వొద్దని పదే పదే చెబుతూ వచ్చాడు.
ఊరి మీద పడి అందరినీ కరుస్తూ ఉంటే విజయ్ దాన్ని కంట్రోల్ చేసి అటవీ అధికారులకు అప్పగిస్తాడు. తర్వాత ఓ రోజు ఫ్యామిలీతో కలిసి చూసేందుకు వెళ్తాడు. దానికో పేరు పెడితే బాగుంటుందని సుబ్రహ్మణ్యం అని నామకరణం చేస్తాడు. అజిత్ ఫ్యాన్స్ ఈ విషయంగానే కోపంగా ఉన్నారట. ఎందుకంటే వాళ్ళ హీరో పూర్తి పేరు అజిత్ కుమార్ సుబ్రమణియన్. ఇద్దరి హీరోల అభిమానుల మధ్య ఎన్నో ఏళ్ళగా పచ్చగడ్డి భగ్గుమంటున్న సంగతి తెలిసిందే. అజిత్ తన ఫ్యాన్స్ అసోసియేషన్లను అధికారికంగా రద్దు చేసినా వాళ్ళు మాత్రం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు.
కావాలనే హైనాకు ఆ పేరు పెట్టారని వాళ్ళ కంప్లయింట్. ఇది కావాలని చేసింది కాకపోవచ్చు. అయినా సరే ఉద్దేశాలు అలా ఆపాదించబడుతున్నాయి. లోకేష్ తనకు ఎప్పటి నుంచో అజిత్ తో సినిమా చేయాలనుందనే కోరిక వెలిబుచ్చాడు. అలాంటప్పుడు అనవసరంగా కవ్వించే పనులు చేయడు. ఆన్ లైన్ లో ఇలా ఆపాదించుకుంటున్నారు తప్ప అందులో అంత మీనింగ్ లేదంటున్నారు కొందరు. ఎంత కాకతాళీయమైనా సరే అజిత్ చివరి పేరుని దానికి పెట్టడం వెనుక ఏదో ప్రత్యేక కారణం ఉందని మరికొందరి వాదన. ఏదేమైనా ఫ్యాన్స్ విశ్లేషణలు బహు విచిత్రంగా ఉంటాయి.
This post was last modified on October 22, 2023 2:52 pm
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…
జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…