తమిళనాడు బాక్సాఫీస్ వద్ద టాక్ తో సంబంధం లేకుండా వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తున్న లియో దసరా పండగ పూర్తయ్యే వరకు నెమ్మదించే సూచనలు లేవు. తెలుగులో భగవంత్ కేసరితో పెద్ద పోటీ ఉన్నప్పటికీ భారీ కలెక్షన్లు రాబట్టడం విశేషం. అలా అని యునానిమస్ గా బ్లాక్ బస్టర్ టాక్ రాలేదు. అయినా సరే ఇంత స్పందన రావడం మాములు విషయం కాదు. ఇక ఈ సినిమాలో పాత్రలు వాటి మధ్య సంబంధాలు పక్కనపెడితే విజయ్ ఇంట్రో తర్వాత వచ్చే హైనా జంతువు ఎపిసోడ్ మీద విపరీతమైన హైప్ నెలకొంది. దర్శకుడు లోకేష్ కనగరాజ్ మిస్ అవ్వొద్దని పదే పదే చెబుతూ వచ్చాడు.
ఊరి మీద పడి అందరినీ కరుస్తూ ఉంటే విజయ్ దాన్ని కంట్రోల్ చేసి అటవీ అధికారులకు అప్పగిస్తాడు. తర్వాత ఓ రోజు ఫ్యామిలీతో కలిసి చూసేందుకు వెళ్తాడు. దానికో పేరు పెడితే బాగుంటుందని సుబ్రహ్మణ్యం అని నామకరణం చేస్తాడు. అజిత్ ఫ్యాన్స్ ఈ విషయంగానే కోపంగా ఉన్నారట. ఎందుకంటే వాళ్ళ హీరో పూర్తి పేరు అజిత్ కుమార్ సుబ్రమణియన్. ఇద్దరి హీరోల అభిమానుల మధ్య ఎన్నో ఏళ్ళగా పచ్చగడ్డి భగ్గుమంటున్న సంగతి తెలిసిందే. అజిత్ తన ఫ్యాన్స్ అసోసియేషన్లను అధికారికంగా రద్దు చేసినా వాళ్ళు మాత్రం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు.
కావాలనే హైనాకు ఆ పేరు పెట్టారని వాళ్ళ కంప్లయింట్. ఇది కావాలని చేసింది కాకపోవచ్చు. అయినా సరే ఉద్దేశాలు అలా ఆపాదించబడుతున్నాయి. లోకేష్ తనకు ఎప్పటి నుంచో అజిత్ తో సినిమా చేయాలనుందనే కోరిక వెలిబుచ్చాడు. అలాంటప్పుడు అనవసరంగా కవ్వించే పనులు చేయడు. ఆన్ లైన్ లో ఇలా ఆపాదించుకుంటున్నారు తప్ప అందులో అంత మీనింగ్ లేదంటున్నారు కొందరు. ఎంత కాకతాళీయమైనా సరే అజిత్ చివరి పేరుని దానికి పెట్టడం వెనుక ఏదో ప్రత్యేక కారణం ఉందని మరికొందరి వాదన. ఏదేమైనా ఫ్యాన్స్ విశ్లేషణలు బహు విచిత్రంగా ఉంటాయి.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…