ఊహించని విధంగా అంచనాలకు మించి 2023 బ్లాక్ బస్టర్స్ లో చోటు సంపాదించుకున్న బేబీ సినిమా టీమ్ మరోసారి చేతులు కలిపింది. హీరో హీరోయిన్ కూడా రిపీట్ అవుతున్నారు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా సాయి రాజేష్ కథ, స్క్రీన్ ప్లే, సంభాషణలతో ఈ కలయిక మరోసారి సాధ్యపడుతోంది. అయితే దర్శకుడు మారడం బిగ్ ఛేంజ్. ఆ బాధ్యతను రవి నంబూరికి అప్పగించారు. సంగీతం విజయ్ బుల్గానిన్ అందిస్తుండగా నిర్మాత ఎస్కెఎన్ తో పాటు మరో ముగ్గురు భాగస్వాములు ఉండబోతున్నారు. డైరెక్టర్ కి ఇది డెబ్యూ మూవీ కావడం గమనించాల్సిన విషయం.
బేబీ జోడి రిపీట్ అంటే సహజంగానే బజ్ వచ్చేస్తుంది. ముఖ్యంగా యూత్ లో క్రేజ్ మాములుగా ఉండదు. బేబీ సుమారు వంద కోట్ల దాకా గ్రాస్ సాధించిన విషయం తెలిసిందే. దర్శకుడు సాయి రాజేష్ కి తొలి విజయమే గ్రాండ్ గా దక్కింది. అయితే రెండో సినిమాని డైరెక్ట్ చేయడానికి ముందు తను రాసిన కథనే ప్రొడ్యూసర్లలో ఒకడిగా మారి ప్రాజెక్టుని డిజైన్ చేయడం విశేషం. అయితే ఇది బేబీ లాగా లవ్ ఫెయిల్యూర్, బాధతో ఉండదని ఇన్ సైడ్ టాక్. సముద్రపు ఒడ్డున వైష్ణవికి ఆనంద్ లవ్ ప్రపోజ్ చేస్తూ దగ్గర తీసుకునే సీన్ నే ఫస్ట్ లుక్ పోస్టర్ గా రిలీజ్ చేసి లవ్ స్టోరీ అనే హింట్ ఇచ్చారు.
మొత్తం నాలుగు సినిమాలను ఎస్కెఎన్ ప్లాన్ చేసుకోగా వాటిలో ఇది మొదటిది. మరో మూడు అనౌన్స్ మెంట్స్ త్వరలో రాబోతున్నాయి. కంటెంట్ ఉంటే బడ్జెట్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని బేబీ ఋజువు చేసింది. అంతకు ముందు సాయిరాజేష్ రచన చేసిన కలర్ ఫోటో జాతీయ అవార్డు సాధించిన సంగతి తెలిసిందే. బరువైన ఎమోషన్లతో ప్రేమకథలను సున్నితంగా ఆవిష్కరిస్తారని పేరు తెచ్చుకున్న ఈ బృందం నుంచి మరో ఎమోషనల్ మూవీ ఆశించవచ్చు. 2024 వేసవి విడుదలని ప్రకటించేశారు. సో మొత్తం పక్కా ప్రణాళికతోనే షూటింగ్ గట్రా పూర్తి చేయబోతున్నారు.
This post was last modified on October 20, 2023 10:50 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…