Movie News

విడిపోతున్నాం.. శిల్పా శెట్టి భర్త పోస్ట్

ఆల్రెడీ పెళ్లయిన వ్యక్తిని పెళ్లాడి చాలా ఏళ్ల కిందట వార్తల్లో వ్యక్తిగా మారింది శిల్పా శెట్టి. ఆమె వరించిన వ్యక్తి పేరు.. రాజ్ కుంద్రా. అతను వ్యాపారవేత్త. కెరీర్ అయిపోయిందనుకున్న దశలో ‘బిగ్ బ్రదర్’ షోలో పాల్గొని అనూహ్యమైన పాపులారిటీ సంపాదించిన శిల్పా.. ఆ తర్వాత రాజ్ కుంద్రాను పెళ్లాడటం.. వీళ్లిద్దరూ కలిసి ఐపీఎల్‌ టీం రాజస్థాన్ రాయల్స్‌లో వాటాదారులుగా మారడం.. తర్వాతి కాలంలో వందల కోట్లు ఆర్జించడం తెలిసిందే.

ఐతే కొన్నేళ్లు వీరి వైవాహిక జీవితం సవ్యంగానే సాగింది. శిల్పా రాజ్‌తో ఒక బిడ్డను కూడా కంది. కానీ రాజ్ కుంద్రా ఐపీఎల్‌లో బెట్టింగ్ వ్యవహారాల్లో భాగమై అన్‌పాపులర్ అవడమే కాక వేరే కేసుల్లో కూడా చిక్కుకోవడంతో వీరి మధ్య విభేదాలు తలెత్తాయి. ఒక దశలో ఇద్దరూ విడిపోతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. కానీ తర్వాత ఏమైందో ఏమో తెలియదు. వీరి బంధం గురించి క్లారిటీ లేకపోయింది.

ఐతే రాజ్ కుంద్రా ఇప్పుడు సోషల్ మీడియాలో ‘‘మేం విడిపోతున్నాం. కష్ట కాలంలో మాకు అండగా నిలవండి, అంతా మంచే జరగాలని కోరుకోండి’’ అంటూ ఒక పోస్ట్ పెట్టి సంచలనం రేపాడు. ఈ పోస్ట్‌.. శిల్పా నుంచి అధికారికంగా విడాకులు తీసుకోవడం గురించే అయ్యుంటుందని భావిస్తున్నారు. కానీ శిల్పా నుంచి మాత్రం ఎలాంటి అప్‌డేట్ లేదు. ఇద్దరూ మ్యూచువల్ అండర్‌స్టాండింగ్‌తో విడిపోతున్నట్లయితే ఉమ్మడిగా ప్రకటన చేయొచ్చు.

లేదంటే విడి విడిగా ఒకేసారి విడాకుల గురించి అనౌన్స్ చేయొచ్చు. కానీ రాజ్ మాత్రమే ఈ పోస్ట్ ఎందుకు పెట్టాడన్నది అర్థం కావడం లేదు. ఐతే రాజ్ ఇటీవలే ‘యూటీ 69’ పేరుతో ఒక సినిమా చేశాడు. అది అతడి జీవిత కథ ఆధారంగానే తెరకెక్కింది. తనే లీడ్ రోల్ చేశాడు. ఆ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఏదైనా గిమ్మిక్ చేస్తున్నాడా.. అందుకోసమే ఈ పోస్ట్ పెట్టాడా అనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి.

This post was last modified on October 20, 2023 10:43 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రీమియర్ రేట్లు నిర్ణయించుకున్న పెద్ది ?

జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…

48 minutes ago

త‌మిళ రాజ‌కీయాల్లో పుష్ప సోఫా రచ్చ

గ‌త ప‌ది రోజులుగా త‌మిళనాడు రాజ‌కీయాలు దేశ‌వ్యాప్తంగా ఎంత చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…

1 hour ago

చిరంజీవి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది

ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…

3 hours ago

పెద్దిని వద్దనుకుంటే ఎవరికి నష్టం

నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…

3 hours ago

“రాహుల్-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు!“

కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌లు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీల‌కు కేర‌ళలో తీవ్ర‌నిర‌స‌న సెగ త‌గులుతోంది. రాహుల్‌-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు.…

4 hours ago

పవన్ చెప్తే చేస్తాడండోయ్

నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…

5 hours ago