Movie News

విడిపోతున్నాం.. శిల్పా శెట్టి భర్త పోస్ట్

ఆల్రెడీ పెళ్లయిన వ్యక్తిని పెళ్లాడి చాలా ఏళ్ల కిందట వార్తల్లో వ్యక్తిగా మారింది శిల్పా శెట్టి. ఆమె వరించిన వ్యక్తి పేరు.. రాజ్ కుంద్రా. అతను వ్యాపారవేత్త. కెరీర్ అయిపోయిందనుకున్న దశలో ‘బిగ్ బ్రదర్’ షోలో పాల్గొని అనూహ్యమైన పాపులారిటీ సంపాదించిన శిల్పా.. ఆ తర్వాత రాజ్ కుంద్రాను పెళ్లాడటం.. వీళ్లిద్దరూ కలిసి ఐపీఎల్‌ టీం రాజస్థాన్ రాయల్స్‌లో వాటాదారులుగా మారడం.. తర్వాతి కాలంలో వందల కోట్లు ఆర్జించడం తెలిసిందే.

ఐతే కొన్నేళ్లు వీరి వైవాహిక జీవితం సవ్యంగానే సాగింది. శిల్పా రాజ్‌తో ఒక బిడ్డను కూడా కంది. కానీ రాజ్ కుంద్రా ఐపీఎల్‌లో బెట్టింగ్ వ్యవహారాల్లో భాగమై అన్‌పాపులర్ అవడమే కాక వేరే కేసుల్లో కూడా చిక్కుకోవడంతో వీరి మధ్య విభేదాలు తలెత్తాయి. ఒక దశలో ఇద్దరూ విడిపోతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. కానీ తర్వాత ఏమైందో ఏమో తెలియదు. వీరి బంధం గురించి క్లారిటీ లేకపోయింది.

ఐతే రాజ్ కుంద్రా ఇప్పుడు సోషల్ మీడియాలో ‘‘మేం విడిపోతున్నాం. కష్ట కాలంలో మాకు అండగా నిలవండి, అంతా మంచే జరగాలని కోరుకోండి’’ అంటూ ఒక పోస్ట్ పెట్టి సంచలనం రేపాడు. ఈ పోస్ట్‌.. శిల్పా నుంచి అధికారికంగా విడాకులు తీసుకోవడం గురించే అయ్యుంటుందని భావిస్తున్నారు. కానీ శిల్పా నుంచి మాత్రం ఎలాంటి అప్‌డేట్ లేదు. ఇద్దరూ మ్యూచువల్ అండర్‌స్టాండింగ్‌తో విడిపోతున్నట్లయితే ఉమ్మడిగా ప్రకటన చేయొచ్చు.

లేదంటే విడి విడిగా ఒకేసారి విడాకుల గురించి అనౌన్స్ చేయొచ్చు. కానీ రాజ్ మాత్రమే ఈ పోస్ట్ ఎందుకు పెట్టాడన్నది అర్థం కావడం లేదు. ఐతే రాజ్ ఇటీవలే ‘యూటీ 69’ పేరుతో ఒక సినిమా చేశాడు. అది అతడి జీవిత కథ ఆధారంగానే తెరకెక్కింది. తనే లీడ్ రోల్ చేశాడు. ఆ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఏదైనా గిమ్మిక్ చేస్తున్నాడా.. అందుకోసమే ఈ పోస్ట్ పెట్టాడా అనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి.

Satya

Recent Posts

బాక్సాఫీస్‌కు మంచి రోజులొచ్చాయి

2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ మోతెక్కిపోతుందనే సంకేతాలు కనిపించాయి ఆరంభంలో. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పాటు ‘అనగనగా ఒక రాజు’,…

1 hour ago

థియేట‌ర్లు, షోలు పెంచుకుంటున్న బంగారం

ఈ రోజుల్లో చిన్న‌, మిడ్ రేంజ్ సినిమాల‌కు రిలీజ్రోజు ఇచ్చిన థియేట‌ర్ల‌ను జ‌నంతో నింప‌డ‌మే క‌ష్టమైపోతోంది. జ‌నం థియేట‌ర్ల‌కు రావ‌డం…

2 hours ago

కూట‌మికి రెండేళ్లు ఓకే… చేయవలసినవి ఇంకా ఉన్నాయి

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం రెండేళ్ల పాల‌న‌ను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్ర‌భుత్వం ఏం చేయాల‌న్నా.. మ‌రో…

3 hours ago

ప్రభాస్ ఫోన్ లో ఆ వాల్ పేపర్ ఎందుకుంది?

ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…

9 hours ago

“మ‌రో వందేళ్ల‌యినా… కాంగ్రెస్ ఇంతే”

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ.. ప‌శ్చిమ‌బెంగాల్‌లో శ‌నివారం సాయంత్రం ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న దేశ‌వ్యాప్తంగా అన్న‌దాత‌ల‌కు పీఎం-కిసాన్ నిధుల‌ను…

10 hours ago

‘గొడ్డ‌లి పార్టీ అంత‌కు మించి ఏం చేసింది?’

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. మ‌రోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గ‌త ఐదేళ్ల కాలంలో గొడ్డ‌లి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయ‌డం..…

12 hours ago