భారీ హైప్ మధ్య రిలీజవుతున్న ‘లియో’ సినిమాకు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్సే వస్తోంది కానీ.. ఈ సినిమాకు కొన్ని అవాంతరాలు మాత్రం తప్పట్లేదు. ముఖ్యంగా తమిళనాడులో విజయ్ అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేస్తూ తెల్లవారుజామున షోలు క్యాన్సిల్ చేశారు. కనీసం ఉదయం 7 గంటల నుంచి అయినా షోలు మొదలవుతాయని ఆశిస్తే అదీ జరగలేదు. 9 గంటలకు కానీ తొలి షో పడట్లేదు.
తమిళనాడు మినహా చాలా చోట్ల ఒక షో పూర్తయ్యే సమయానికి తమ దగ్గర సినిమా మొదలవుతుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విజయ్ ఫ్యాన్స్. ఇదిలా ఉండగా.. తమిళనాట కొన్ని థియేటర్ల యాజమాన్యాలు ‘లియో’ సినిమాను ప్రదర్శించబోమని బోర్డులు పెట్టేయడం చర్చనీయాంశం అవుతోంది. అందుక్కారణం.. ‘లియో’కు థియేటర్ల నుంచి వచ్చే రెవెన్యూలో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లు ఎక్కువ వాటా అడుగుతుండటమే కారణం.
టికెట్ల అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయంలో 80-85 శాతం మధ్య తమకు ఇవ్వాలని డిస్ట్రిబ్యూటర్లు డిమాండ్ చేస్తున్నారట. ఐతే 70 శాతానికి మించి ఇవ్వమని థియేటర్ల యాజమాన్యాలు అంటున్నట్లు తెలుస్తోంది. వేర్వేరు చోట్ల వేర్వేరు రకాల డీల్స్ జరగ్గా.. కొన్ని థియేటర్లు మాత్రం డిస్ట్రిబ్యూటర్లు కోరుతున్న ఆదాయం ఇవ్వలేమని, అది తమకు ఎంతమాత్రం గిట్టుబాటు కాదని తేల్చేశారు.
తమ థియేటర్లలో ‘లియో’ సినిమాను ప్రదర్శించబోమంటూ బోర్డులు కూడా పెట్టేశారు. చెన్నైలోని ఫేమస్ థియేటర్ ‘రోహిణి’ సహా పలు థియేటర్లు ఈ బాటలో నడిచాయి. ఇదిలా ఉంటే.. ‘లియో’ సినిమాను నెల రోజులకే ఓటీటీలో రిలీజ్ చేస్తుండటంతో.. నార్త్ ఇండియా అంతటా పీవీఆర్ సహా కొన్ని మల్టీప్లెక్సులు ఈ సినిమాను ప్రదర్శించడం లేదు. థియేట్రికల్ రిలీజ్కు, ఓటీటీ రిలీజ్కు 8 వారాల గడువు లేని సినిమాలను తమ స్క్రీన్లలో ప్రదర్శించకుండా మల్టీప్లెక్స్ యాజమాన్యాలు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
This post was last modified on October 19, 2023 10:20 am
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…