పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ మళ్లీ పెళ్లి చేసుకుందా లేదా అనే విషయంలో అయోమయం నెలకొంది. కొన్నేళ్ల కిందట ఆమె ఒక వ్యక్తితో నిశ్చితార్థం చేసుకోవడం.. ఆ వ్యక్తి ఫొటో బయటపెట్టకుండా, ఈ విషయం మాత్రం అధికారికంగా ప్రకటించడం గుర్తుండే ఉంటుంది. ఐతే నిశ్చితార్థం తర్వాత ఏ అప్డేట్ లేదు. రేణు సైలెంటుగా పెళ్లి చేసుకుందా.. లేక ఆ పెళ్లిని రద్దు చేసుకుందా అన్నది స్పష్టత లేకపోయింది.
రేణు తర్వాత ఎప్పుడూ దీని గురించి మాట్లాడింది లేదు. దీనిపై క్లారిటీ ఇచ్చే వ్యక్తులు కూడా ఎవరూ లేరు. ఐతే ఎట్టకేలకు ఒక ఇంటర్వ్యూలో తన రెండో పెళ్లి గురించి రేణు స్వయంగా క్లారిటీ ఇచ్చింది. ఇంతకుముందు నిశ్చితార్థం చేసుకున్న వ్యక్తితో పెళ్లిని రద్దు చేసుకున్నట్లు ఆమె వెల్లడించింది.
తనకు రెండో పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన ముందు నుంచి ఉందని, ఇప్పటికీ ఉందని.. ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని అనిపించి నిశ్చితార్థం చేసుకున్నానని ఆమె తెలిపింది. కానీ అప్పటికి తన కూతురు ఆద్యకు ఏడేళ్ల వయసేనని.. ఆ సమయంలో తాను పెళ్లి చేసుకుంటే తనకు చాలినంత సమయం కేటాయించలేనని అనిపించిందని.. ఈ విషయంలో మథన పడి తాను రెండో పెళ్లి రద్దు చేసుకున్నానని రేణు తెలిపింది.
ఆద్యకు సరైన వయసు వచ్చినపుడు తాను తోడు గురించి ఆలోచించాలని భావించానని ఆమె చెప్పింది. ఇంకో రెండేళ్ల తర్వాత తాను పెళ్లి చేసుకునే అవకాశాలు ఉన్నట్లు రేణు తెలిపింది. మొత్తానికి కూతురి కోసమే నిశ్చితార్థం తర్వాత రెండో పెళ్లిని క్యాన్సిల్ చేసుకుందంటే రేణు గొప్ప మనిషే. కాగా పవన్ కళ్యాణ్తో విడాకులకు దారితీసిన కారణాల గురించి అడిగితే దానిపై ఆమె మాట్లాడనని తేల్చి చెప్పింది. సెలబ్రెటీల వ్యక్తిగత జీవితాల మీద చెత్త థంబ్ నైల్స్ పెట్టొద్దని ఆమె హితవు పలికింది.
This post was last modified on October 19, 2023 10:16 am
బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…
మహారాష్ట్రలో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండగా, నిమిషాల వ్యవధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇప్పుడు సోషల్…
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోనూ మతమార్పిడులను ప్రోత్సహించారని, హిందువులకు ఆయన చేసిందేమీ లేదని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…
సరిగ్గా ఇంకొక్క నెల రోజుల్లో ప్యారడైజ్ రిలీజ్ ఉంది. నాని అభిమానులు కౌంట్ డౌన్ మొదలుపెట్టుకున్నారు. జూన్ నుంచి వరసగా…
ఎవరో జ్వాలలు రగిలించారు ఎవరో దానికి టార్గెట్ అయ్యారని సామెత చెప్పినట్టు ఇరుముడి బ్లాక్ బస్టర్ విజయం మెగా ఫాన్స్…
పెద్ద పెద్ద వాళ్ళ కుటుంబాల్లోనే సమస్యలు ఉన్నాయి.. ప్రతి ఇంటిలోనూ అందరికీ సమస్యలు ఉంటాయి.. అంటూ మాజీ మంత్రి వైసిపి…