చాలా గ్యాప్ తర్వాత హాస్య నటుడు సంపూర్ణేష్ బాబు హీరోగా ఓ సినిమా వస్తోంది. గత పది రోజులుగా కొన్ని ఎంపిక చేసిన ఊళ్లలో ప్రీమియర్లు కూడా వేసుకున్న మార్టిన్ లూథర్ కింగ్ జనాలకు మెల్లగా రీచ్ అవుతోంది. అక్టోబర్ 27 థియేటర్లలో అడుగు పెట్టబోతున్న ఈ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ తమిళ సూపర్ హిట్ మండేలాకు అఫీషియల్ రీమేక్. ఒరిజినల్ వెర్షన్ చూసిన వాళ్లకు ఇదెంత మంచి చిత్రమో అవగాహన ఉంటుంది. అక్కడ యోగిబాబు చేసిన పాత్ర ఇక్కడ సంపూ పోషించాడు. ఇవాళ రిలీజ్ చేసిన ట్రైలర్ తో కథా కమామీషు ఏంటో వివరంగా చెప్పే ప్రయత్నం చేశారు.
ఊరి బయట కుట్టుమిషన్ పెట్టుకుని బ్రతుకీడుస్తున్న స్మైలీ(సంపూర్ణేష్ బాబు) అనాథ. అసలు పేరు కూడా తెలియదు. ఇతని అమాయకత్వం చూసిన ఓ ప్రభుత్వ ఉద్యోగి(శరణ్య ప్రదీప్) మార్టిన్ లూథర్ కింగ్ అని నామకరణం చేస్తుంది. సర్పంచ్ పదవి కోసం స్థానిక కుల నాయకులు(నరేష్ – వెంకటేష్ మహా)ఇద్దరు పోటీ పడుతూ ఓటర్లను ఆకర్షించడం కోసం డబ్బులు, కానుకలు పంచుతారు. తీరా ఒక్క ఓటు గెలుపుని శాశిస్తుందని గుర్తించి అది మార్టిన్ దేనేని అతని వెంటపడి ప్రసన్నం చేసుకోవడం మొదలుపెడతారు. ముందు ప్రలోభ పడి తర్వాత తప్పు తెలుసుకుంటాడు కింగ్.
పూజా కొల్లూరు దర్శకత్వంలో రూపొందిన ఈ విలేజ్ డ్రామాకు స్క్రీన్ ప్లే, మాటలు వెంకటేష్ మహా సమకూర్చారు. తక్కువ బడ్జెట్ లో మొత్తం పల్లెటూరి వాతావరణంలో ఇప్పటి రాజకీయ పోకడలను ఎండగట్టే విధంగా సాగింది. స్మరన్ సాయి సంగీతం సమకూర్చగా, దీపక్ ఛాయాగ్రహణం బాధ్యతలు నిర్వర్తించారు. కామెడీ,సెటైర్లు, ఎమోషన్లు, సెంటిమెంట్లు అన్ని ఉన్నట్టే కనిపిస్తున్నాయి. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ లో కాకుండా నిజాయితీగా తీసుకున్న పాయింట్ తో రూపొందిన మార్టిన్ లూథర్ కింగ్ దసరా బాక్సాఫీస్ సందడి ముగిశాక వస్తోంది. చిన్న సినిమాగా పెద్ద వండర్ ఏమైనా చేస్తుందేమో చూడాలి
This post was last modified on October 18, 2023 7:08 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…