చాలా గ్యాప్ తర్వాత హాస్య నటుడు సంపూర్ణేష్ బాబు హీరోగా ఓ సినిమా వస్తోంది. గత పది రోజులుగా కొన్ని ఎంపిక చేసిన ఊళ్లలో ప్రీమియర్లు కూడా వేసుకున్న మార్టిన్ లూథర్ కింగ్ జనాలకు మెల్లగా రీచ్ అవుతోంది. అక్టోబర్ 27 థియేటర్లలో అడుగు పెట్టబోతున్న ఈ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ తమిళ సూపర్ హిట్ మండేలాకు అఫీషియల్ రీమేక్. ఒరిజినల్ వెర్షన్ చూసిన వాళ్లకు ఇదెంత మంచి చిత్రమో అవగాహన ఉంటుంది. అక్కడ యోగిబాబు చేసిన పాత్ర ఇక్కడ సంపూ పోషించాడు. ఇవాళ రిలీజ్ చేసిన ట్రైలర్ తో కథా కమామీషు ఏంటో వివరంగా చెప్పే ప్రయత్నం చేశారు.
ఊరి బయట కుట్టుమిషన్ పెట్టుకుని బ్రతుకీడుస్తున్న స్మైలీ(సంపూర్ణేష్ బాబు) అనాథ. అసలు పేరు కూడా తెలియదు. ఇతని అమాయకత్వం చూసిన ఓ ప్రభుత్వ ఉద్యోగి(శరణ్య ప్రదీప్) మార్టిన్ లూథర్ కింగ్ అని నామకరణం చేస్తుంది. సర్పంచ్ పదవి కోసం స్థానిక కుల నాయకులు(నరేష్ – వెంకటేష్ మహా)ఇద్దరు పోటీ పడుతూ ఓటర్లను ఆకర్షించడం కోసం డబ్బులు, కానుకలు పంచుతారు. తీరా ఒక్క ఓటు గెలుపుని శాశిస్తుందని గుర్తించి అది మార్టిన్ దేనేని అతని వెంటపడి ప్రసన్నం చేసుకోవడం మొదలుపెడతారు. ముందు ప్రలోభ పడి తర్వాత తప్పు తెలుసుకుంటాడు కింగ్.
పూజా కొల్లూరు దర్శకత్వంలో రూపొందిన ఈ విలేజ్ డ్రామాకు స్క్రీన్ ప్లే, మాటలు వెంకటేష్ మహా సమకూర్చారు. తక్కువ బడ్జెట్ లో మొత్తం పల్లెటూరి వాతావరణంలో ఇప్పటి రాజకీయ పోకడలను ఎండగట్టే విధంగా సాగింది. స్మరన్ సాయి సంగీతం సమకూర్చగా, దీపక్ ఛాయాగ్రహణం బాధ్యతలు నిర్వర్తించారు. కామెడీ,సెటైర్లు, ఎమోషన్లు, సెంటిమెంట్లు అన్ని ఉన్నట్టే కనిపిస్తున్నాయి. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ లో కాకుండా నిజాయితీగా తీసుకున్న పాయింట్ తో రూపొందిన మార్టిన్ లూథర్ కింగ్ దసరా బాక్సాఫీస్ సందడి ముగిశాక వస్తోంది. చిన్న సినిమాగా పెద్ద వండర్ ఏమైనా చేస్తుందేమో చూడాలి
This post was last modified on October 18, 2023 7:08 pm
ఓ ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చిన దొంగ ఆ ఇంట్లో వస్తువులు దొంగిలించడం…ఆకలేయడంతో ఆ ఇంట్లోనే తినేసి నిద్రలోకి జారుకోవడం…తీరా…
పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం, శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్పై హత్యాయత్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం…
రాజ్యసభలో విపక్షనేత, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హల్ద్వానిలోని రాంలీలా మైదానంలో నిర్వహించిన ర్యాలీ ప్రదేశాన్ని శ్రీరామ్…
ఒకప్పుడు షకీలాకు సౌత్ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది. వరుస సినిమాలు, భారీ గుర్తింపు, తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్తో…
ఏఐ రంగప్రవేశం తర్వాత తమ ఫొటోలు, వీడియోలను ఇష్టానుసారం వాడేస్తున్న నేపథ్యంలో పర్సనాలిటీ రైట్స్ కోసం ఫిలిం సెలబ్రెటీలను న్యాయస్థానాలను…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాధమిక ప్రాజెక్టులుగా భావిస్తున్న సీడ్ యాక్సెస్ రోడ్డు, స్టీల్ బ్రిడ్జిలను సీఎం చంద్రబాబు తాజాగా…