రోజుల నుంచి గంటల కౌంట్ డౌన్ లోకి భగవంత్ కేసరి వెళ్ళిపోయాడు. అదే రోజు లియో నుంచి పోటీ ఊహించిందే అయినా అది మరీ తీవ్రంగా ఉండబోతోందని అడ్వాన్స్ బుకింగ్స్ స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా బాలయ్య మాస్ కన్నా లోకేష్ అండ్ విజయ్ క్లాస్ వైపే యూత్ మొగ్గు చూపుతున్నట్టుగా టికెట్ల అమ్మకాలు చెబుతున్నాయి. అనూహ్యంగా బిసి సెంటర్లలోనూ లియోకి ప్రీ రిలీజ్ ట్రెండ్ సానుకూలంగా ఉండటం గమనించాల్సిన విషయం. ఇక భగవంత్ కేసరి విషయానికి వస్తే బిజినెస్ కోణంలో రీజనబుల్ గానే థియేట్రికల్ రైట్స్ అమ్మినట్టు ట్రేడ్ టాక్.
దీనికి సంబంధించిన వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు భగవంత్ కేసరి హక్కులను వరల్డ్ వైడ్ సుమారు 68 కోట్లకు డీల్ చేసుకున్నారు. అంటే గ్రాస్ కనీసం నూటా పది కోట్లను దాటేయాలి. బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఇదేమి అసాధ్యం కాదు. వీరసింహారెడ్డి సైతం తీవ్రమైన కాంపిటీషన్ లో సులభంగా లాభాలు తెచ్చి పెట్టింది. ఇప్పుడూ అదే పరిస్థితి ఉంది. అయితే ఈసారి ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎక్కువ ఆకట్టుకునేలా సెంటిమెంట్, ఎమోషన్ కూడా జోడించడంతో వీకెండ్ నుంచే కుటుంబ ప్రేక్షకులను వస్తారనే అంచనాలు బయ్యర్లలో బలంగా ఉన్నాయి.
టైగర్ నాగేశ్వరరావు కూడా ఉన్నప్పటికీ బాలయ్య సినిమాలో ఉన్న కమర్షియల్ కోటింగ్ మాస్ రాజా మూవీలో తక్కువగా అనిపిస్తోంది. అది పీరియాడికల్ డ్రామా కాబట్టి ముందస్తుగా ఎలాంటి అంచనాకు రాలేం. అక్టోబర్ 25 దాకా స్కూళ్ళు, కాలేజీలకు సెలవులు ఉన్న నేపథ్యంలో ఏకధాటిగా వారం రోజుల పాటు వసూళ్లకు ఢోకా ఉండదు. ఎటొచ్చి విజయ్, రవితేజల కన్నా బెటర్ ఛాయస్ గా భగవంత్ కేసరి పేరు తెచ్చుకోవాలి. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ కం ఫ్యామిలీ డ్రామాకు తమన్ సంగీతం, అర్జున్ రాంపాల్ విలనీ, శ్రీలీల పాత్ర అదనపు ఆకర్షణలుగా నిలుస్తున్నాయి.
This post was last modified on October 17, 2023 9:00 pm
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…