రోజుల నుంచి గంటల కౌంట్ డౌన్ లోకి భగవంత్ కేసరి వెళ్ళిపోయాడు. అదే రోజు లియో నుంచి పోటీ ఊహించిందే అయినా అది మరీ తీవ్రంగా ఉండబోతోందని అడ్వాన్స్ బుకింగ్స్ స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా బాలయ్య మాస్ కన్నా లోకేష్ అండ్ విజయ్ క్లాస్ వైపే యూత్ మొగ్గు చూపుతున్నట్టుగా టికెట్ల అమ్మకాలు చెబుతున్నాయి. అనూహ్యంగా బిసి సెంటర్లలోనూ లియోకి ప్రీ రిలీజ్ ట్రెండ్ సానుకూలంగా ఉండటం గమనించాల్సిన విషయం. ఇక భగవంత్ కేసరి విషయానికి వస్తే బిజినెస్ కోణంలో రీజనబుల్ గానే థియేట్రికల్ రైట్స్ అమ్మినట్టు ట్రేడ్ టాక్.
దీనికి సంబంధించిన వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు భగవంత్ కేసరి హక్కులను వరల్డ్ వైడ్ సుమారు 68 కోట్లకు డీల్ చేసుకున్నారు. అంటే గ్రాస్ కనీసం నూటా పది కోట్లను దాటేయాలి. బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఇదేమి అసాధ్యం కాదు. వీరసింహారెడ్డి సైతం తీవ్రమైన కాంపిటీషన్ లో సులభంగా లాభాలు తెచ్చి పెట్టింది. ఇప్పుడూ అదే పరిస్థితి ఉంది. అయితే ఈసారి ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎక్కువ ఆకట్టుకునేలా సెంటిమెంట్, ఎమోషన్ కూడా జోడించడంతో వీకెండ్ నుంచే కుటుంబ ప్రేక్షకులను వస్తారనే అంచనాలు బయ్యర్లలో బలంగా ఉన్నాయి.
టైగర్ నాగేశ్వరరావు కూడా ఉన్నప్పటికీ బాలయ్య సినిమాలో ఉన్న కమర్షియల్ కోటింగ్ మాస్ రాజా మూవీలో తక్కువగా అనిపిస్తోంది. అది పీరియాడికల్ డ్రామా కాబట్టి ముందస్తుగా ఎలాంటి అంచనాకు రాలేం. అక్టోబర్ 25 దాకా స్కూళ్ళు, కాలేజీలకు సెలవులు ఉన్న నేపథ్యంలో ఏకధాటిగా వారం రోజుల పాటు వసూళ్లకు ఢోకా ఉండదు. ఎటొచ్చి విజయ్, రవితేజల కన్నా బెటర్ ఛాయస్ గా భగవంత్ కేసరి పేరు తెచ్చుకోవాలి. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ కం ఫ్యామిలీ డ్రామాకు తమన్ సంగీతం, అర్జున్ రాంపాల్ విలనీ, శ్రీలీల పాత్ర అదనపు ఆకర్షణలుగా నిలుస్తున్నాయి.
This post was last modified on October 17, 2023 9:00 pm
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష(ప్రధాన కాదు) నాయకుడు, వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో అన్యాయంగా…