రోజుల నుంచి గంటల కౌంట్ డౌన్ లోకి భగవంత్ కేసరి వెళ్ళిపోయాడు. అదే రోజు లియో నుంచి పోటీ ఊహించిందే అయినా అది మరీ తీవ్రంగా ఉండబోతోందని అడ్వాన్స్ బుకింగ్స్ స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా బాలయ్య మాస్ కన్నా లోకేష్ అండ్ విజయ్ క్లాస్ వైపే యూత్ మొగ్గు చూపుతున్నట్టుగా టికెట్ల అమ్మకాలు చెబుతున్నాయి. అనూహ్యంగా బిసి సెంటర్లలోనూ లియోకి ప్రీ రిలీజ్ ట్రెండ్ సానుకూలంగా ఉండటం గమనించాల్సిన విషయం. ఇక భగవంత్ కేసరి విషయానికి వస్తే బిజినెస్ కోణంలో రీజనబుల్ గానే థియేట్రికల్ రైట్స్ అమ్మినట్టు ట్రేడ్ టాక్.
దీనికి సంబంధించిన వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు భగవంత్ కేసరి హక్కులను వరల్డ్ వైడ్ సుమారు 68 కోట్లకు డీల్ చేసుకున్నారు. అంటే గ్రాస్ కనీసం నూటా పది కోట్లను దాటేయాలి. బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఇదేమి అసాధ్యం కాదు. వీరసింహారెడ్డి సైతం తీవ్రమైన కాంపిటీషన్ లో సులభంగా లాభాలు తెచ్చి పెట్టింది. ఇప్పుడూ అదే పరిస్థితి ఉంది. అయితే ఈసారి ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎక్కువ ఆకట్టుకునేలా సెంటిమెంట్, ఎమోషన్ కూడా జోడించడంతో వీకెండ్ నుంచే కుటుంబ ప్రేక్షకులను వస్తారనే అంచనాలు బయ్యర్లలో బలంగా ఉన్నాయి.
టైగర్ నాగేశ్వరరావు కూడా ఉన్నప్పటికీ బాలయ్య సినిమాలో ఉన్న కమర్షియల్ కోటింగ్ మాస్ రాజా మూవీలో తక్కువగా అనిపిస్తోంది. అది పీరియాడికల్ డ్రామా కాబట్టి ముందస్తుగా ఎలాంటి అంచనాకు రాలేం. అక్టోబర్ 25 దాకా స్కూళ్ళు, కాలేజీలకు సెలవులు ఉన్న నేపథ్యంలో ఏకధాటిగా వారం రోజుల పాటు వసూళ్లకు ఢోకా ఉండదు. ఎటొచ్చి విజయ్, రవితేజల కన్నా బెటర్ ఛాయస్ గా భగవంత్ కేసరి పేరు తెచ్చుకోవాలి. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ కం ఫ్యామిలీ డ్రామాకు తమన్ సంగీతం, అర్జున్ రాంపాల్ విలనీ, శ్రీలీల పాత్ర అదనపు ఆకర్షణలుగా నిలుస్తున్నాయి.
This post was last modified on October 17, 2023 9:00 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…