సౌత్లో పెద్ద హిట్టయిన మాస్ సినిమాలను పట్టుకెళ్లి హిందీలో రీమేక్ చేసి హిట్టు కొట్టడంలో రోహిత్ శెట్టి సిద్ధహస్తుడు. అతను తీసే స్ట్రెయిట్ సినిమాలు సైతం సౌత్ సినిమాలను తలపించేలాగే ఉంటాయి. ఐతే మాస్ మెచ్చేలా మంచి మసాలా దట్టించి సినిమాలు తీస్తాడని పేరుంది. అందుకే బాలీవుడ్లో అత్యధిక వంద కోట్ల సినిమాలు తీసిన దర్శకుడిగా అతను రికార్డు సృష్టించాడు.
ఐతే అప్పుడప్పుడు రోహిత్కు బాక్సాఫీస్ దగ్గర గట్టి ఎదురు దెబ్బలు తగిలిన దాఖలాలు కూడా లేకపోలేదు. రోహిత్ చివరి చిత్రం ‘సర్కస్’ దారుణమైన డిజాస్టర్గా నిలిచింది. ఈ స్థితి నుంచి రోహిత్ ఎలా పుంజుకుంటాడా అని అందరూ ఎదురు చూస్తున్నారు. అతను ‘లేడీ సింగం’తో రాబోతున్నాడు. ఇందులో దీపికా పదుకొనే లీడ్ రోల్ చేస్తోంది. ఈ రోజే ఆ సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. కానీ ఈ లుక్కు ఆశించిన రెస్పాన్స్ రావట్లేదు.
ఖాకీ డ్రెస్ వేసి తుపాకీ పట్టుకుని నవ్వుతున్న దీపిక లుక్ను టీం రిలీజ్ చేసింది. ఐతే ‘సింగం’ సిరీస్ అంటే లీడ్ రోల్ చేసిన వాళ్లు ఫెరోషియస్గా ఉండాలని ఆశిస్తారు ప్రేక్షకులు. కానీ దీపికకు అసలు పోలీస్ లుక్ సెట్ అయినట్లుగా లేదు. ఆమె నవ్వుతున్న లుక్ మరీ సాధారణంగా ఉండి సినిమా మీదే అంచనాలు తగ్గించేసేలా ఉంది. ఇదేదో స్పూఫ్ మూవీలా అనిపిస్తోంది జనాలకు.
అసలే రోహిత్ సినిమాలు మరీ ఔట్ డేటెడ్గా తయారవుతున్నాయనే అభిప్రాయాలు పెరిగిపోతున్నాయి. ఒక మూసలో సినిమాలు తీస్తే నడిచే పరిస్థితి లేదు ఇప్పుడు. అలాంటిది దీపికను పెట్టి ‘లేడీ సింగం’ అనేసరికి ఏదో తేడా కొడుతోంది జనాలకు. హీరోయిన్ని పోలీస్గా పెట్టి యాక్షన్ పండించడం అంటే అంత ఈజీ కాదు. ‘సింగం’ ఫ్రాంఛైజీని మరీ ఎక్కువ పిండేసి, కాసులు రాల్చుకునే ప్రయత్నంలా కనిపిస్తోందిది. సినిమా నుంచి ఒక మంచి టీజర్ వస్తే తప్ప ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెంచడం కష్టమే.
This post was last modified on October 15, 2023 8:22 pm
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…