గత వారాంతం అరడజనుకు పైగా సినిమాలు రిలీజయ్యాయి తెలుగులో. ఐతే వాటిలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించి, థియేటర్లలో సందడి చేసిన సినిమాలు చాలా తక్కువ. 800, మంత్ ఆఫ్ మధు, చిన్నా లాంటి చిత్రాలకు ముందే ప్రిమియర్స్ వేసి.. పాజిటివ్ టాక్ స్ప్రెడ్ చేసే ప్రయత్నం జరిగినా పెద్దగా ఫలితం లేకపోయింది. వీటిలో దేనికీ థియేటర్లలో జనాలు లేరు. తొలి రోజే థియేటర్లు వెలవెలబోయి షోలు క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది.
ఇక ‘రూల్స్ రంజన్’, ‘మామా మశ్చీంద్ర’ చిత్రాలకు మార్నింగ్ షోల వరకు కొంచెం సందడి కనిపించినా బ్యాడ్ టాక్తో మధ్యాహ్నానికే వాటి పనైపోయింది. ఒక్క ‘మ్యాడ్’ సినిమా మాత్రం ముందు రోజు ప్రిమియర్స్ నుంచే క్రేజ్ తెచ్చుకుని ఉదయానికి థియేటర్లను కళకళలాడించింది. తొలి రోజు సాయంత్రానికి మరింతగా థియేటర్లలో సందడి కనిపించింది.
తొలి వీకెండ్ వరకు ‘మ్యాడ్’ మంచి వసూళ్లు రాబట్టింది. ఆదివారం నాటికి ఈ చిత్రం రూ.8 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. తొలి రోజు కంటే రెండో రోజు, రెండో రోజు కంటే మూడో రోజు వసూళ్లు ఎక్కువ రావడం విశేషం. ఐతే ఉన్నంతలో వసూళ్లు బాగున్నాయి కానీ.. వచ్చిన పాజిటివ్ టాక్, బాక్సాఫీస్ దగ్గర అనుకూల పరిస్థితుల్లో ఈ చిత్రం మరీ భారీగా ఏమీ వసూళ్లు రాబట్టలేదు. అందరూ ఈ చిత్రాన్ని ‘జాతిరత్నాలు’తో పోల్చి ఆ స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని అనుకున్నారు.
కానీ వీకెండ్ వరకు చూసుకుంటే ఆ సినిమాలో సగం వసూళ్లే సాధించింది ‘మ్యాడ్’. ఇక వీకెండ్ తర్వాత వసూళ్లు కొంచెం తగ్గాయి. కానీ పరిస్థితి ఆశాజనకంగానే ఉంది. ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్న ఏకైక చిత్రం ఇదే. యూత్ బాగానే చూస్తున్నారు. దాదాపుగా అన్ని ఏరియాల్లోనూ సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ఈ వీకెండ్లో చెప్పుకోదగ్గ రిలీజ్లు ఏమీ లేవు కాబట్టి.. అదే విన్నర్ కాబోతోంది. ఫుల్ రన్లో ఈ చిత్రం రూ.10 కోట్ల షేర్ మార్కును అందుకునే అవకాశాలను కొట్టిపారేయలేం.
This post was last modified on October 11, 2023 7:28 pm
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబును తెలంగాణ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు కలుసుకున్నారు. సోమవారం అమరావతికి…
ప్రేమికుల రోజు సందర్భంగా రీ రిలీజ్ చేసిన లవ్ స్టోరీకి ప్రేక్షకుల నుంచి పెద్దగా రెస్పాన్స్ లేకపోవడం ఆశ్చర్యపరిచే విషయమే.…
70 ఏళ్ల వయసులోనూ ఎంతో హుషారుగా సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ముఖ్యంగా ఇటీవల మన శంకర…
తన పాటల కాపీ రైట్స్ విషయంలో నిర్మాతల దగ్గర ముక్కుపిండి మరీ కోర్టుల ద్వారా రాయల్టీ పొందుతున్న ఇళయరాజాకు ఢిల్లీ…
ఏపీ సీఎం చంద్రబాబుతో కలిసి పనిచేయడం తనకు కొత్తకాదని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు తనకు…
పరిశ్రమలో జరిగే కొన్ని సంఘటనలు విచిత్రంగా ఉంటాయి. అలాంటిదే ఇది కూడా. ఇటీవలే విడుదలైన సీత పయనంకు ఆశించిన స్పందన…