సూపర్ స్టార్ రజినీకంత్ బ్లాక్బస్టర్ మూవీకి ఆల్రెడీ తెలుగులో చేసిన సీక్వెల్ ‘నాగవల్లి’ చాలదని కొత్తగా తమిళంలో ‘చంద్రముఖి-2’ పేరుతో మరో సీక్వెల్ తీశాడు సీనియర్ దర్శకుడు పి.వాసు. మళ్లీ దాన్ని తెలుగులో కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమా ప్రోమోలు చూసినపుడే ఇది ఆడటం కష్టమని అర్థమైపోయింది. ఇక రిలీజ్ తర్వాత అంచనాలు ఏమీ మారలేదు. తమిళంలో కూడా సరిగా ఆడని ఈ చిత్రం.. తెలుగులో అయితే కనీస ప్రభావం కూడా చూపలేకపోయింది.
దారుణమైన డిజాస్టర్గా నిలిచింది. ‘చంద్రముఖి’ కథనే నటీనటులను మార్చి తీసినట్లుందే తప్ప.. ఇందులో కొత్తగా ఏమీ అనిపించలేదు. ఇలాంటి సినిమా ఇప్పుడు ఆడుతుందని ఎలా అనుకున్నారో అని ‘చంద్రముఖి-2’ చూసిన వాళ్లు ఆశ్చర్యపోయారు. లారెన్స్ తెలిసి తెలిసీ ఒక డిజాస్టర్ మూవీలో నటించారే అని అతడిపై జాలిపడ్డారు.
లారెన్స్ ఆ సినిమా సంగతి పక్కన పెట్టేసి తన కొత్త చిత్రం ‘జిగర్ తండ డబుల్ఎక్స్’ ప్రమోషన్ల మీద దృష్టిపెట్టాడు. ఈ చిత్రం దీపావళి కానుకగా నవంబరు 10న రిలీజ్ కాబోతోంది. దీన్ని కూడా తెలుగులోకి తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో మీడియా సమావేశానికి హాజరైన లారెన్స్.. చంద్రముఖి-2 ఫ్లాప్ కావడంపై మీడియా వాళ్ల ప్రశ్నలకు సమాధానమిచ్చాడు.
ఈ సినిమా ఎందుకు పోయిందో, రిజల్ట్ మీద స్పందన ఏంటో చెప్పకుండా అతను వేదాంతం మాట్టాడాడు. ‘‘చంద్రముఖి-2 చేసినందుకు నాకు డబ్బులు వచ్చాయి. పైగా నలుగురు హీరోయిన్లతో కలిసి డ్యాన్స్ చేశా. జీవితంలో అన్నీ మనం గెలవాలని లేదు. గ్రూప్ డ్యాన్సర్ నుంచి డ్యాన్స్ మాస్టర్ అయితే చాలు అనుకున్నా. అక్కడి నుంచి దర్శకుడిని అయ్యా. హీరోగా చేస్తున్నా. ఈ గ్లామర్ పెట్టుకుని హీరో అవకాశాలు రావడమే దేవుడు ఇచ్చిన వరం. మళ్లీ అందులో ఫ్లాపులు హిట్లు అని ఆలోచించకూడదు. అవి మన వెనకాలే వస్తాయి’’ అంటూ వేదాంత ధోరణిలో సమాధానం ఇచ్చాడు లారెన్స్.
This post was last modified on October 11, 2023 1:49 pm
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…