సాయి పల్లవితో కలిసి చేసిన ‘ఎంసిఏ’ చిత్రంతో నాని తన కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్ సాధించాడు. అప్పట్లో సాయి పల్లవికి వున్న ‘ప్రేమమ్’ క్రేజ్ ఆ చిత్రం ఓపెనింగ్స్ కి ప్లస్ అయింది. మళ్లీ వీళ్లిద్దరూ కలిసి ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రంలో నటించబోతున్నారు.
ఈ పాత్ర కోసం పలువురు బాలీవుడ్ హీరోయిన్లను సంప్రదించి చివరకు సాయి పల్లవిని ఖాయం చేసుకున్నారు. ఇది రెగ్యులర్ హీరోయిన్ రోల్ కాదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో సాయి పల్లవి నెగెటివ్ షేడ్స్ వున్న విలన్ తరహా క్యారెక్టర్లో కనిపిస్తుందట. నాని, సాయి పల్లవి మధ్య హోరాహోరీ సన్నివేశాలుంటాయనే గాసిప్స్ మీడియాలో దర్శనమిస్తున్నాయి.
అయితే దీనిపై ఇంకా నాని లేదా చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ స్పందించలేదు. ఇకపోతే ఇందులో నాని ద్విపాత్రాభినయం చేస్తున్నాడని, ఇది సైన్స్ ఫిక్షన్తో కూడిన డిఫరెంట్ సబ్జెక్ట్ అని కూడా లీక్స్ వచ్చాయి. ఈ చిత్రానికి బడ్జెట్ ఎక్కువ కనుక ప్రస్తుత పరిస్థితులలో వాయిదా వేస్తారనే ప్రచారం జరిగింది కానీ ‘టక్ జగదీష్’ తర్వాత నాని ఈ చిత్రమే చేయాలని ఫిక్స్ అయ్యాడట. ఈ చిత్రం షూటింగ్ వచ్చే ఏడాదిలో మొదలవుతుంది. ఇది 2021 దసరా సీజన్లో విడుదలయ్యే అవకాశాలున్నాయి.
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…