ఇంకో అయిదారు నెలల్లో రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కోసం టాలీవుడ్ కూడా సిద్ధమవుతోంది. అదేంటి రాజకీయాలకు పరిశ్రమకు ముడి ఏంటనుకుంటున్నారా. ఎప్పుడూ లేనిది అధికార పార్టీ అజెండా కోసం వరస బెట్టి సినిమాలు రూపొందడమే దానికి కారణం. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ ఏపీ సిఎం జగన్ ని కీర్తించేలా రెండు చిత్రాలు సిద్ధం చేస్తున్నాడు. వాటిలో ఒకటి వ్యూహం నవంబర్ 10న మరొకటి శపథం వచ్చే ఏడాది జనవరి 25 విడుదల కాబోతున్నట్టు ప్రకటించారు. వైఎస్ఆర్ చనిపోయాక జరిగిన పరిణామాలతో మొదలుపెట్టి జగన్ అధికారంలోకి వచ్చే దాకా జరిగే సంఘటనలు వీటిలో ఉంటాయి.
ఇవి వన్ సైడ్ లోనే చెప్పే కథలని మళ్ళీ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అధికారికంగా పదవి లేదనే మాటే తప్పించి అన్ని విషయాల్లోనో వైసిపి స్పోక్స్ పర్సన్ గా ట్విట్టర్ లో వర్మ వ్యవహారిస్తున్న తీరుని అందరూ చూస్తున్నారు. చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ లను పదే పదే టార్గెట్ గా పెట్టుకుని వ్యంగ్యంగా, కొన్నిసార్లు మరీ తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్న వైనం ఈ మధ్య కాలంలో ఊపందుకుంది. అదే తన పార్టీలో ఎవరైనా మాట జారినా తప్పు చేసినా అది తనకు సంబంధం లేని విషయమనే రీతిలో వర్మ ప్రవర్తన గురించి అందరికీ ఎప్పుడో ఒక క్లారిటీ వచ్చింది.
ఈ వ్యూహం, శపథం ఆ తర్వాత ఫిబ్రవరిలో రాబోయే మహి వి రాఘవ్ యాత్ర 2 అన్నీ జగన్ ని ఓ రేంజ్ లో ఎలివేట్ చేయడానికి వాడబోతున్నారు. థియేటర్లలో ఆడినా ఆడకపోయినా వాటిలో ఉన్న విజువల్స్, డైలాగులు, సీన్లు అన్నీ ఆన్ లైన్ ప్రచారానికి బాగా ఉపయోగపడతాయి. గతంలో బాబు, పవన్ ని ఎద్దేవా చేయడానికే లో గ్రేడ్ సినిమాలు తీసిన వర్మ ఇప్పుడు అంతకన్నా బెటర్ గా తీస్తారని కాదు కానీ రూలింగ్ పార్టీ అండ ఉంది కాబట్టి క్వాలిటీ కాస్త మెరుగుపడొచ్చు కానీ ప్రెజెంటేషన్ లో మాత్రం పెద్దగా మార్పు ఉండదు. జనానికి వీటి మీద ఆసక్తి ఉండటమూ అనుమానమే.
ఇటీవలే విడుదలైన లెనిన్ పైరసీ మూడు రోజల వరకు రాకపోవడం మూవీ లవర్స్ ని ఆశ్చర్యపరచడమే కాదు ఇండస్ట్రీ వర్గాలను…
చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసు అధికారే నిబంధనలను ఉల్లంఘించి వివాదంలో చిక్కుకున్నారు. హైదరాబాద్ శివారులోని గంధంగూడ–బైరాగిగూడ ప్రధాన రహదారిపై ఆరేళ్ల…
టాలీవుడ్ యంగ్ స్టార్స్ పర్సనల్ లైఫ్ లో జరిగిన మార్పులు, ఆ వెంటనే వారు అందుకున్న సక్సెస్ లపై నెటిజన్లు…
తెలుగులో ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీకి వంద కోట్ల వసూళ్లు రావడం అన్నది అనూహ్యమే. అందులోనూ అది ఫ్యామిలీ సినిమా…
వీకెండ్ వసూళ్లను ఘనంగా రాబట్టుకున్న లెనిన్ అసలు పరీక్ష మొదలుపెట్టింది. సోమవారం నుంచి ఆక్యుపెన్సీలు ఎలా ఉండబోతున్నాయనే దాని మీద…
రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీవీ వెంకటేశ్వరరావు గత వైసీపీ పాలనలో ఎదుర్కొన్న ఇబ్బందులు తెలిసిందే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందే…