ఇంకో అయిదారు నెలల్లో రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కోసం టాలీవుడ్ కూడా సిద్ధమవుతోంది. అదేంటి రాజకీయాలకు పరిశ్రమకు ముడి ఏంటనుకుంటున్నారా. ఎప్పుడూ లేనిది అధికార పార్టీ అజెండా కోసం వరస బెట్టి సినిమాలు రూపొందడమే దానికి కారణం. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ ఏపీ సిఎం జగన్ ని కీర్తించేలా రెండు చిత్రాలు సిద్ధం చేస్తున్నాడు. వాటిలో ఒకటి వ్యూహం నవంబర్ 10న మరొకటి శపథం వచ్చే ఏడాది జనవరి 25 విడుదల కాబోతున్నట్టు ప్రకటించారు. వైఎస్ఆర్ చనిపోయాక జరిగిన పరిణామాలతో మొదలుపెట్టి జగన్ అధికారంలోకి వచ్చే దాకా జరిగే సంఘటనలు వీటిలో ఉంటాయి.
ఇవి వన్ సైడ్ లోనే చెప్పే కథలని మళ్ళీ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అధికారికంగా పదవి లేదనే మాటే తప్పించి అన్ని విషయాల్లోనో వైసిపి స్పోక్స్ పర్సన్ గా ట్విట్టర్ లో వర్మ వ్యవహారిస్తున్న తీరుని అందరూ చూస్తున్నారు. చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ లను పదే పదే టార్గెట్ గా పెట్టుకుని వ్యంగ్యంగా, కొన్నిసార్లు మరీ తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్న వైనం ఈ మధ్య కాలంలో ఊపందుకుంది. అదే తన పార్టీలో ఎవరైనా మాట జారినా తప్పు చేసినా అది తనకు సంబంధం లేని విషయమనే రీతిలో వర్మ ప్రవర్తన గురించి అందరికీ ఎప్పుడో ఒక క్లారిటీ వచ్చింది.
ఈ వ్యూహం, శపథం ఆ తర్వాత ఫిబ్రవరిలో రాబోయే మహి వి రాఘవ్ యాత్ర 2 అన్నీ జగన్ ని ఓ రేంజ్ లో ఎలివేట్ చేయడానికి వాడబోతున్నారు. థియేటర్లలో ఆడినా ఆడకపోయినా వాటిలో ఉన్న విజువల్స్, డైలాగులు, సీన్లు అన్నీ ఆన్ లైన్ ప్రచారానికి బాగా ఉపయోగపడతాయి. గతంలో బాబు, పవన్ ని ఎద్దేవా చేయడానికే లో గ్రేడ్ సినిమాలు తీసిన వర్మ ఇప్పుడు అంతకన్నా బెటర్ గా తీస్తారని కాదు కానీ రూలింగ్ పార్టీ అండ ఉంది కాబట్టి క్వాలిటీ కాస్త మెరుగుపడొచ్చు కానీ ప్రెజెంటేషన్ లో మాత్రం పెద్దగా మార్పు ఉండదు. జనానికి వీటి మీద ఆసక్తి ఉండటమూ అనుమానమే.
This post was last modified on October 11, 2023 11:44 am
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…