ఒక సినిమా మొదలుపెట్టి కొంత స్టేజి దాటాక చేతులు మారడం సహజం. చాలాసార్లు జరిగిన వ్యవహారమే. అధిక సందర్భాల్లో కారణాలు బయటికి చెప్పరు కానీ ఏకాభిప్రాయం రాకపోవడం కన్నా వేరొక రీజన్ ఉండదు. మహేష్ బాబు నో చెప్పాకే సుకుమార్ పుష్పని తీసుకెళ్లి అల్లు అర్జున్ కి సెట్ చేశాడు. బన్నీ వద్దన్నాకే కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ దేవరకు రంగం సిద్ధమయ్యింది. ఇప్పుడు అలాంటిదే మరో కేసు. హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్లతో మంచి ఊపుమీదున్న నవీన్ పోలిశెట్టి మరో సినిమా అనగనగా ఒక రాజు ఎప్పుడో గత ఏడాదే మొదలై కొంత భాగం షూటింగ్ కూడా జరుపుకుంది.
ఏమైందో ఏమో కానీ మధ్యలో బ్రేక్ పడింది. ప్రాజెక్టు మొదలుపెట్టినప్పుడు లాక్ చేసుకున్న దర్శకుడు కళ్యాణ్ శంకర్. సితార బ్యానర్ పై నాగవంశీ మంచి బడ్జెట్ తోనే స్కెచ్ రెడీ చేశారు. అయితే ఆగిపోయే సూచనలు కనిపించడంతో దాని స్థానంలో తన సోదరి హారికని నిర్మాతగా పరిచయం చేస్తూ మ్యాడ్ సినిమాని కళ్యాణ్ శంకర్ చేతుల్లో పెట్టారు. కట్ చేస్తే అది మంచి హిట్ దిశగా దూసుకుపోతోంది. ఇప్పుడా పెండింగ్ లో పడ్డ రాజుని జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కి ఇచ్చినట్టు లేటెస్ట్ అప్ డేట్. జాతిరత్నాలు రైటింగ్ టీమ్ లో కళ్యాణ్ శంకర్ ఉన్నప్పటి నుంచే వీళ్ళ మధ్య బాండింగ్ ఉంది.
సో పెద్దగా అపార్థాలు గట్రా లేకుండానే కాంబో మారిపోయినట్టు తెలిసింది. అఫీషియల్ గా ప్రకటించలేదు కానీ రేపో ఎల్లుండో చెప్పేయొచ్చు. ఇంతకు ముందు శ్రీలీలని హీరోయిన్ గా తీసుకున్నారు. ఇప్పుడు తనే ఉంటుందో లేదో చూడాలి. తమన్ సంగీతం కొనసాగవచ్చు. జాతిరత్నాలు తర్వాత ప్రిన్స్ తో షాక్ తిన్న అనుదీప్ రచయితగానూ ఫస్ట్ డే ఫస్ట్ షోకి డిజాస్టర్ రుచి చూశాడు. సో బలమైన కంబ్యాక్ కావాలి. తన వన్ లైనర్స్ బ్రహ్మాండంగా పలికించగలిగే నవీన్ పోలిశెట్టి దొరికితే అంతకన్నా కావాల్సింది ఏముంది. కథ మాత్రం అనగనగా ఒక రాజుకు ముందు అనుకున్నదే ఉంటుందట.
This post was last modified on October 10, 2023 1:42 pm
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…