Movie News

చేతులు మారిన నవీన్ పోలిశెట్టి మూవీ

ఒక సినిమా మొదలుపెట్టి కొంత స్టేజి దాటాక చేతులు మారడం సహజం. చాలాసార్లు జరిగిన వ్యవహారమే. అధిక సందర్భాల్లో కారణాలు బయటికి చెప్పరు కానీ ఏకాభిప్రాయం రాకపోవడం కన్నా వేరొక రీజన్ ఉండదు. మహేష్ బాబు నో చెప్పాకే సుకుమార్ పుష్పని తీసుకెళ్లి అల్లు అర్జున్ కి సెట్ చేశాడు. బన్నీ వద్దన్నాకే కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ దేవరకు రంగం సిద్ధమయ్యింది. ఇప్పుడు అలాంటిదే మరో కేసు. హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్లతో మంచి ఊపుమీదున్న నవీన్ పోలిశెట్టి మరో సినిమా అనగనగా ఒక రాజు ఎప్పుడో గత ఏడాదే మొదలై కొంత భాగం షూటింగ్ కూడా జరుపుకుంది.

ఏమైందో ఏమో కానీ మధ్యలో బ్రేక్ పడింది. ప్రాజెక్టు మొదలుపెట్టినప్పుడు లాక్ చేసుకున్న దర్శకుడు కళ్యాణ్ శంకర్. సితార బ్యానర్ పై నాగవంశీ మంచి బడ్జెట్ తోనే స్కెచ్ రెడీ చేశారు. అయితే ఆగిపోయే సూచనలు కనిపించడంతో దాని స్థానంలో తన సోదరి హారికని నిర్మాతగా పరిచయం చేస్తూ మ్యాడ్ సినిమాని కళ్యాణ్ శంకర్ చేతుల్లో పెట్టారు. కట్ చేస్తే అది మంచి హిట్ దిశగా దూసుకుపోతోంది. ఇప్పుడా పెండింగ్ లో పడ్డ రాజుని జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కి ఇచ్చినట్టు లేటెస్ట్ అప్ డేట్. జాతిరత్నాలు రైటింగ్ టీమ్ లో కళ్యాణ్ శంకర్ ఉన్నప్పటి నుంచే వీళ్ళ మధ్య బాండింగ్ ఉంది.

సో పెద్దగా అపార్థాలు గట్రా లేకుండానే కాంబో మారిపోయినట్టు తెలిసింది. అఫీషియల్ గా ప్రకటించలేదు కానీ రేపో ఎల్లుండో చెప్పేయొచ్చు. ఇంతకు ముందు శ్రీలీలని హీరోయిన్ గా తీసుకున్నారు. ఇప్పుడు తనే ఉంటుందో లేదో చూడాలి. తమన్ సంగీతం కొనసాగవచ్చు. జాతిరత్నాలు తర్వాత ప్రిన్స్ తో షాక్ తిన్న అనుదీప్ రచయితగానూ ఫస్ట్ డే ఫస్ట్ షోకి డిజాస్టర్ రుచి చూశాడు. సో బలమైన కంబ్యాక్ కావాలి. తన వన్ లైనర్స్ బ్రహ్మాండంగా పలికించగలిగే నవీన్ పోలిశెట్టి దొరికితే అంతకన్నా కావాల్సింది ఏముంది. కథ మాత్రం అనగనగా ఒక రాజుకు ముందు అనుకున్నదే ఉంటుందట.

This post was last modified on October 10, 2023 1:42 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బిగ్ డే : తండేల్ మీదే అందరి కళ్ళు

నాగ చైతన్య కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కిన తండేల్ థియేటర్లకు వచ్చేసింది. గత ఏడాది డిసెంబర్…

2 hours ago

‘పట్టు’ లేదని ముందే తెలుసుకున్నారా

ఈ మధ్య కాలంలో అజిత్ లాంటి స్టార్ ఉన్న పెద్ద సినిమా బజ్ లేకుండా విడుదలయ్యిందంటే అది పట్టుదల మాత్రమే.…

9 hours ago

‘అమ‌రావ‌తి’ని ఆప‌ద్దు: ఈసీ లేఖ‌

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిని ప‌రుగులు పెట్టించాల‌ని సీఎం చంద్ర‌బాబు నేతృత్వంలోని కూట‌మి ప్ర‌భుత్వం నిర్ణ‌యించుకున్న విష‌యం తెలిసిందే. ఈ క్రమంలో…

12 hours ago

ప్ర‌జ‌ల్లోకి ప్ర‌భుత్వం.. సీఎం రేవంత్ ప్లాన్‌

'ప్ర‌జ‌ల్లోకి ప్ర‌భుత్వం' నినాదంతో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి స‌రికొత్త కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్ట‌నున్నారు. తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన…

13 hours ago

బాస్ ఈజ్ బాస్ : విశ్వక్ సేన్

వచ్చే వారం విడుదల కాబోతున్న లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా రానున్న సంగతి తెలిసిందే.…

14 hours ago

బ‌డ్జెట్ రెడీ.. ఆ రెండు ప‌థ‌కాల‌కే నిధులు ..!

ఈ నెల 24వ తేదీ నుంచి రాష్ట్ర బడ్జెట్ స‌మావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో 2025-26 వార్షిక బ‌డ్జెట్‌ను…

14 hours ago