ఒక సినిమా మొదలుపెట్టి కొంత స్టేజి దాటాక చేతులు మారడం సహజం. చాలాసార్లు జరిగిన వ్యవహారమే. అధిక సందర్భాల్లో కారణాలు బయటికి చెప్పరు కానీ ఏకాభిప్రాయం రాకపోవడం కన్నా వేరొక రీజన్ ఉండదు. మహేష్ బాబు నో చెప్పాకే సుకుమార్ పుష్పని తీసుకెళ్లి అల్లు అర్జున్ కి సెట్ చేశాడు. బన్నీ వద్దన్నాకే కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ దేవరకు రంగం సిద్ధమయ్యింది. ఇప్పుడు అలాంటిదే మరో కేసు. హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్లతో మంచి ఊపుమీదున్న నవీన్ పోలిశెట్టి మరో సినిమా అనగనగా ఒక రాజు ఎప్పుడో గత ఏడాదే మొదలై కొంత భాగం షూటింగ్ కూడా జరుపుకుంది.
ఏమైందో ఏమో కానీ మధ్యలో బ్రేక్ పడింది. ప్రాజెక్టు మొదలుపెట్టినప్పుడు లాక్ చేసుకున్న దర్శకుడు కళ్యాణ్ శంకర్. సితార బ్యానర్ పై నాగవంశీ మంచి బడ్జెట్ తోనే స్కెచ్ రెడీ చేశారు. అయితే ఆగిపోయే సూచనలు కనిపించడంతో దాని స్థానంలో తన సోదరి హారికని నిర్మాతగా పరిచయం చేస్తూ మ్యాడ్ సినిమాని కళ్యాణ్ శంకర్ చేతుల్లో పెట్టారు. కట్ చేస్తే అది మంచి హిట్ దిశగా దూసుకుపోతోంది. ఇప్పుడా పెండింగ్ లో పడ్డ రాజుని జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కి ఇచ్చినట్టు లేటెస్ట్ అప్ డేట్. జాతిరత్నాలు రైటింగ్ టీమ్ లో కళ్యాణ్ శంకర్ ఉన్నప్పటి నుంచే వీళ్ళ మధ్య బాండింగ్ ఉంది.
సో పెద్దగా అపార్థాలు గట్రా లేకుండానే కాంబో మారిపోయినట్టు తెలిసింది. అఫీషియల్ గా ప్రకటించలేదు కానీ రేపో ఎల్లుండో చెప్పేయొచ్చు. ఇంతకు ముందు శ్రీలీలని హీరోయిన్ గా తీసుకున్నారు. ఇప్పుడు తనే ఉంటుందో లేదో చూడాలి. తమన్ సంగీతం కొనసాగవచ్చు. జాతిరత్నాలు తర్వాత ప్రిన్స్ తో షాక్ తిన్న అనుదీప్ రచయితగానూ ఫస్ట్ డే ఫస్ట్ షోకి డిజాస్టర్ రుచి చూశాడు. సో బలమైన కంబ్యాక్ కావాలి. తన వన్ లైనర్స్ బ్రహ్మాండంగా పలికించగలిగే నవీన్ పోలిశెట్టి దొరికితే అంతకన్నా కావాల్సింది ఏముంది. కథ మాత్రం అనగనగా ఒక రాజుకు ముందు అనుకున్నదే ఉంటుందట.
This post was last modified on October 10, 2023 1:42 pm
భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…
టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…
ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…