ఈ ఏడాది ఆన్ లైన్లో, ఆఫ్ లైన్లో విపరీతమైన చర్చకు దారి తీసిన సినిమాల్లో ఆదిపురుష్ ఒకటి. ప్రభాస్ ప్రధాన పాత్రలో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ రూపొందించిన ఈ చిత్రం రామాయణ గాథ ఆధారంగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఐతే ఆధునిక సొబగులు అద్దే క్రమంలో రామాయణాన్ని చెడగొట్టారంటూ ఈ సినిమాపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ప్రధాన పాత్రలను ఇందులో చూపించిన తీరు.. కొన్ని సన్నివేశాలు, డైలాగులపై తీవ్ర అభ్యంతరాలు వచ్చాయి.
రిలీజ్ టైంలోనే కాక.. ఆ తర్వాత కూడా వివాదాలు కొనసాగాయి. హిందువుల మనోభావాలను కించపరిచారంటూ ఈ సినిమా మీద కోర్టుల్లో పలు కేసులు నమోదయ్యాయి. ఇది ఆ చిత్ర బృందానికి పెద్ద తలనొప్పిగామారింది. సినిమా రిలీజై నెలలు గడుస్తున్నా ఆ కేసులు కొనసాగుతుండటంతో ఏమవుతుందో అన్న ఆందోళన టీం సభ్యుల్లో నెలకొంది.
ఐతే ఎట్టకేలకు ఆదిపురుష్ టీంకు ఉపశమనం లభించింది.
ఆదిపురుష్ సినిమాకు సంబంధించి వివిధ కోర్టుల్లో నమోదైన అన్ని కేసులనూ సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఇచ్చిందని.. ఆ తర్వాతే సినిమా విడుదలై దాని థియేట్రికల్ రన్ కూడా ముగిసిందని.. ఇక దాని మీద చర్చ అనవసరమని సుప్రీం కోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది.
అన్ని కోర్టుల్లోనూ సంబంధిత పిటిషన్ల మీద విచారణ ఆపేయాలని కోర్టు ఆదేశించింది. ఈ పిటిషన్ల మీద వాదోపవాదాలు వ్యర్థమని స్పష్టం చేసింది. దీంతో ఆదిపురుష్ టీంకు పెద్ద తలనొప్పి తీరిపోయినట్లే. ఈ సినిమాలో రావణుడు పాత్రను మలిచిన విధానం.. హనుమంతుడి పాత్రకు పెట్టిన డైలాగులు సహా పలు అంశాలు వివాదాలకు దారి తీశాయి. వీటి మీదే పలువురు కోర్టు మెట్లెక్కారు.
This post was last modified on October 9, 2023 10:31 pm
హృదయ కాలేయం, కొబ్బరి మట్ట లాంటి సినిమాలతో స్పూఫ్ హీరోగా గుర్తింపు పొందిన సంపూర్ణేష్ బాబు ఆ తర్వాత అదే…
వైసీపీ అధినేత జగన్ అరెస్టు ఎంతో దూరంలో లేదా? ఈ ఏడాదే ఆయనను అరెస్టు చేయొచ్చా.? అది తప్పితే.. ఆయన…
నిన్న ఇరుముడి ఓటిటిలో వచ్చేసింది. థియేటర్ రన్ ఇంకా కొనసాగుతున్నప్పటికీ ముందస్తు అగ్రిమెంట్ వల్ల కేవలం 28 రోజుల విండోతో…
తెలంగాణాలోని రైల్వే స్టేషన్ వద్ద చెత్త ఏరుకునే ఒక మహిళ మీద హోం గార్డు చేసిన దౌర్జన్యం తీవ్ర దుమారం…
ఎన్ని నామినేషన్లు వెళ్లినా, మన వైపు నుంచి పెద్ది ఇరుముడి లాంటి బ్లాక్ బస్టర్లను పంపినా, ఆస్కార్ బరిలో మరాఠి…
నిన్న చెన్నైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సిబి చక్రవర్తి అట్లీని పొగిడే క్రమంలో…