ఈ ఏడాది ఆన్ లైన్లో, ఆఫ్ లైన్లో విపరీతమైన చర్చకు దారి తీసిన సినిమాల్లో ఆదిపురుష్ ఒకటి. ప్రభాస్ ప్రధాన పాత్రలో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ రూపొందించిన ఈ చిత్రం రామాయణ గాథ ఆధారంగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఐతే ఆధునిక సొబగులు అద్దే క్రమంలో రామాయణాన్ని చెడగొట్టారంటూ ఈ సినిమాపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ప్రధాన పాత్రలను ఇందులో చూపించిన తీరు.. కొన్ని సన్నివేశాలు, డైలాగులపై తీవ్ర అభ్యంతరాలు వచ్చాయి.
రిలీజ్ టైంలోనే కాక.. ఆ తర్వాత కూడా వివాదాలు కొనసాగాయి. హిందువుల మనోభావాలను కించపరిచారంటూ ఈ సినిమా మీద కోర్టుల్లో పలు కేసులు నమోదయ్యాయి. ఇది ఆ చిత్ర బృందానికి పెద్ద తలనొప్పిగామారింది. సినిమా రిలీజై నెలలు గడుస్తున్నా ఆ కేసులు కొనసాగుతుండటంతో ఏమవుతుందో అన్న ఆందోళన టీం సభ్యుల్లో నెలకొంది.
ఐతే ఎట్టకేలకు ఆదిపురుష్ టీంకు ఉపశమనం లభించింది.
ఆదిపురుష్ సినిమాకు సంబంధించి వివిధ కోర్టుల్లో నమోదైన అన్ని కేసులనూ సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఇచ్చిందని.. ఆ తర్వాతే సినిమా విడుదలై దాని థియేట్రికల్ రన్ కూడా ముగిసిందని.. ఇక దాని మీద చర్చ అనవసరమని సుప్రీం కోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది.
అన్ని కోర్టుల్లోనూ సంబంధిత పిటిషన్ల మీద విచారణ ఆపేయాలని కోర్టు ఆదేశించింది. ఈ పిటిషన్ల మీద వాదోపవాదాలు వ్యర్థమని స్పష్టం చేసింది. దీంతో ఆదిపురుష్ టీంకు పెద్ద తలనొప్పి తీరిపోయినట్లే. ఈ సినిమాలో రావణుడు పాత్రను మలిచిన విధానం.. హనుమంతుడి పాత్రకు పెట్టిన డైలాగులు సహా పలు అంశాలు వివాదాలకు దారి తీశాయి. వీటి మీదే పలువురు కోర్టు మెట్లెక్కారు.
This post was last modified on October 9, 2023 10:31 pm
బీజేపీ, జనసేనలతో కూటమి కట్టిన టీడీపీ ఏపీలో జరిగిన ఎన్నికల్లో పోరాటం చేసిన విషయం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…
గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…
ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…
చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…
యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలలో 370కి పైగా స్థానాలు సాధించి హ్యాట్రిక్ విజయంతో అధికారం చేజిక్కించుకోవాలన్న కమలం ఆశలమీద ఆయా…