ఈ ఏడాది ఆన్ లైన్లో, ఆఫ్ లైన్లో విపరీతమైన చర్చకు దారి తీసిన సినిమాల్లో ఆదిపురుష్ ఒకటి. ప్రభాస్ ప్రధాన పాత్రలో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ రూపొందించిన ఈ చిత్రం రామాయణ గాథ ఆధారంగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఐతే ఆధునిక సొబగులు అద్దే క్రమంలో రామాయణాన్ని చెడగొట్టారంటూ ఈ సినిమాపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ప్రధాన పాత్రలను ఇందులో చూపించిన తీరు.. కొన్ని సన్నివేశాలు, డైలాగులపై తీవ్ర అభ్యంతరాలు వచ్చాయి.
రిలీజ్ టైంలోనే కాక.. ఆ తర్వాత కూడా వివాదాలు కొనసాగాయి. హిందువుల మనోభావాలను కించపరిచారంటూ ఈ సినిమా మీద కోర్టుల్లో పలు కేసులు నమోదయ్యాయి. ఇది ఆ చిత్ర బృందానికి పెద్ద తలనొప్పిగామారింది. సినిమా రిలీజై నెలలు గడుస్తున్నా ఆ కేసులు కొనసాగుతుండటంతో ఏమవుతుందో అన్న ఆందోళన టీం సభ్యుల్లో నెలకొంది.
ఐతే ఎట్టకేలకు ఆదిపురుష్ టీంకు ఉపశమనం లభించింది.
ఆదిపురుష్ సినిమాకు సంబంధించి వివిధ కోర్టుల్లో నమోదైన అన్ని కేసులనూ సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఇచ్చిందని.. ఆ తర్వాతే సినిమా విడుదలై దాని థియేట్రికల్ రన్ కూడా ముగిసిందని.. ఇక దాని మీద చర్చ అనవసరమని సుప్రీం కోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది.
అన్ని కోర్టుల్లోనూ సంబంధిత పిటిషన్ల మీద విచారణ ఆపేయాలని కోర్టు ఆదేశించింది. ఈ పిటిషన్ల మీద వాదోపవాదాలు వ్యర్థమని స్పష్టం చేసింది. దీంతో ఆదిపురుష్ టీంకు పెద్ద తలనొప్పి తీరిపోయినట్లే. ఈ సినిమాలో రావణుడు పాత్రను మలిచిన విధానం.. హనుమంతుడి పాత్రకు పెట్టిన డైలాగులు సహా పలు అంశాలు వివాదాలకు దారి తీశాయి. వీటి మీదే పలువురు కోర్టు మెట్లెక్కారు.
This post was last modified on October 9, 2023 10:31 pm
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రజలకు ఎంత అవసరమో తేల్చి చెప్పే ఉదంతం ఇది. ఆయనను…
మనసుంటే మార్గాలు ఉంటాయని మంత్రి నారా లోకేష్ నిరూపించారు. ఒక పారిశ్రామికవేత్త ట్విట్టర్లో పెట్టిన మెసేజ్ కు నిముషాల్లో స్పందించారు.…
నేచురల్ స్టార్ నాని కెరీర్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం.. ది ప్యారడైజ్. ఇంతకుముందు నానికి ‘దసరా’ రూపంలో కెరీర్…
టాక్సిక్ గురించి సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన నడుస్తున్న వేళ ఒక అవసరం లేని టాపిక్ సామజిక మాధ్యమాల్లో ట్రెండ్…
యుఎస్లో పెద్ద పెద్ద స్టార్లను మించి మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో.. నాని. హీరోగా తొలి అడుగులు వేస్తున్న రోజుల్లోనే…
కాంగ్రెస్పార్టీ మాజీ అధ్యక్షురాలు, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ రాసిన ఆత్మకథ ..పుస్తకం ముద్రణ వ్యవహారం వివాదంగా మారింది.…