ఈ ఏడాది ఆన్ లైన్లో, ఆఫ్ లైన్లో విపరీతమైన చర్చకు దారి తీసిన సినిమాల్లో ఆదిపురుష్ ఒకటి. ప్రభాస్ ప్రధాన పాత్రలో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ రూపొందించిన ఈ చిత్రం రామాయణ గాథ ఆధారంగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఐతే ఆధునిక సొబగులు అద్దే క్రమంలో రామాయణాన్ని చెడగొట్టారంటూ ఈ సినిమాపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ప్రధాన పాత్రలను ఇందులో చూపించిన తీరు.. కొన్ని సన్నివేశాలు, డైలాగులపై తీవ్ర అభ్యంతరాలు వచ్చాయి.
రిలీజ్ టైంలోనే కాక.. ఆ తర్వాత కూడా వివాదాలు కొనసాగాయి. హిందువుల మనోభావాలను కించపరిచారంటూ ఈ సినిమా మీద కోర్టుల్లో పలు కేసులు నమోదయ్యాయి. ఇది ఆ చిత్ర బృందానికి పెద్ద తలనొప్పిగామారింది. సినిమా రిలీజై నెలలు గడుస్తున్నా ఆ కేసులు కొనసాగుతుండటంతో ఏమవుతుందో అన్న ఆందోళన టీం సభ్యుల్లో నెలకొంది.
ఐతే ఎట్టకేలకు ఆదిపురుష్ టీంకు ఉపశమనం లభించింది.
ఆదిపురుష్ సినిమాకు సంబంధించి వివిధ కోర్టుల్లో నమోదైన అన్ని కేసులనూ సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఇచ్చిందని.. ఆ తర్వాతే సినిమా విడుదలై దాని థియేట్రికల్ రన్ కూడా ముగిసిందని.. ఇక దాని మీద చర్చ అనవసరమని సుప్రీం కోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది.
అన్ని కోర్టుల్లోనూ సంబంధిత పిటిషన్ల మీద విచారణ ఆపేయాలని కోర్టు ఆదేశించింది. ఈ పిటిషన్ల మీద వాదోపవాదాలు వ్యర్థమని స్పష్టం చేసింది. దీంతో ఆదిపురుష్ టీంకు పెద్ద తలనొప్పి తీరిపోయినట్లే. ఈ సినిమాలో రావణుడు పాత్రను మలిచిన విధానం.. హనుమంతుడి పాత్రకు పెట్టిన డైలాగులు సహా పలు అంశాలు వివాదాలకు దారి తీశాయి. వీటి మీదే పలువురు కోర్టు మెట్లెక్కారు.
This post was last modified on October 9, 2023 10:31 pm
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…