ఏజెంట్ సినిమా అంత పెద్ద డిజాస్టర్ అయినా దాని ప్రభావం మరీ తీవ్రంగా దర్శకుడు సురేందర్ రెడ్డి మీద పడలేదు. ఇది రిలీజ్ కాకముందే వచ్చిన పవన్ కళ్యాణ్ ప్రాజెక్టు తనకో సంజీవిని కాగా ఇప్పుడు మరో క్రేజీ మూవీని చేజిక్కించుకున్నట్టు ఫిలిం నగర్ టాక్. విక్టరీ వెంకటేష్ 76వ చిత్రం సూరితోనే ఉండొచ్చనే ప్రచారం బలంగా జరుగుతోంది. సైంధవ్ చివరి స్టేజిలో ఉంది. జనవరి 13 విడుదల తేదీ లాక్ చేయడంతో టీమ్ చక్కగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకుంటోంది. ఇండియా ఆడే వరల్డ్ కప్ మ్యాచులు మినహాయించి అవసరమైన డేట్లు దర్శకుడు శైలేష్ కొలనుకే ఇచ్చాడు వెంకీ.
ఇంత హఠాత్తుగా ఈ కాంబో గురించి ప్రచారం జరగడానికి కారణం లేకపోలేదు. సూరి చేతిలో ఉన్న పవన్ కళ్యాణ్ సినిమా మొదలుపెట్టడానికి 2024 వేసవి దాటిపోతుంది. ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు పూర్తి చేస్తే తప్ప పవర్ స్టార్ ఫ్రీ కాడు. పైగా వీటిలో ఒకటో రెండో సీక్వెల్స్ ఉంటాయని అంటున్నారు. అదే నిజమైతే ఇంకా ఆలస్యమవుతుంది. కాబట్టి అప్పటిదాకా ఖాళీగా ఉండాల్సి వస్తుంది. అయితే ఒక ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కథని ఆ మధ్య వెంకీ, సురేష్ బాబులకు చెబితే వాళ్ళ నుంచి సానుకూల స్పందన వచ్చిందట. అందుకే కార్యరూపం దాల్చే అవకాశం లేకపోలేదు.
ఇంకోవైపు వెంకటేష్ జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కో కమిట్ మెంట్ ఇచ్చారు. అఫీషియల్ గా ప్రకటించలేదు కానీ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. స్టోరీకి సంబంధించి ఏకాభిప్రాయం రాలేదట. శివ కార్తికేయన్ తో అతను చేసిన ప్రిన్స్ ఫ్లాప్ కావడంతో జాగ్రత్తలు తీసుకోవడంలో భాగంగా లేట్ చేస్తున్నారని సమాచారం. అంతకు ముందు తరుణ్ భాస్కర్ తో అనుకున్నది కూడా క్యాన్సిల్ అయ్యింది. దాంతో అతను కీడా కోలాకు షిఫ్ట్ అయ్యాడు. మరి వెంకటేష్ ఫైనల్ గా ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారో చూడాలి. సైంధవ్ రిలీజ్ అయ్యేవరకు వేచి చూద్దామన్నా ఆశ్చర్యం లేదు.
This post was last modified on October 9, 2023 10:24 pm
ఇటీవలే జరిగిన ఒక ఈవెంట్ లో అమీర్ ఖాన్ మాట్లాడుతూ థియేటర్ ఓటిటి మధ్య ఇప్పుడున్న గ్యాప్ సరిపోదని నాలుగు…
రాష్ట్రంలోని 25 పార్లమెంటు నియోజకవర్గాల ఇంచార్జ్లను మార్చనున్నట్లు వైసీపీ అధినేత జగన్ చెప్పారు. అయితే దీనికి కొంత సమయం పడుతుందన్నారు.…
పహల్ గాం ఉగ్రవాద దాడి తదనంతర పరిణామాల్లో భాగంగా మంగళవార తెల్లవారుజామున భారత త్రివిధ దళాలు పాకిస్తాన్ భూభాగంలోని ఆ దేశ…
టాలీవుడ్లో ఒకప్పుడు టాప్-4 హీరోల్లో ఒకడిగా ఒక వెలుగు వెలిగిన హీరో.. అక్కినేని నాగార్జున. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్లతో పోటాపోటీగా…
పహల్గామ్లో ఉగ్రదాడి అనంతరం.. భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఎదురైనా దేశ ప్రజలు…
భారత దేశానికి శత్రుదేశాలపై యుద్ధాలు కొత్తకాదు.. ఉగ్రవాదులపై దాడులు కూడా కొత్తకాదు. కానీ.. అందరినీ ఏకం చేయడంలోనూ.. అందరినీ ఒకే…