ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. రాజకీయ చిత్రాల ప్రభావం కూడా గట్టిగానే ఉండేలా కనిపిస్తోంది. ఇటీవల వచ్చిన స్కంద, పెదకాపు చిత్రాలు రాజకీయాల చుట్టూ తిరిగాయి. పెదకాపు కథ పూర్తిగా రాజకీయాల మీదే నడవగా.. ‘స్కంద’లో రాజకీయాల ప్రస్తావనతో బోలెడు పంచులు పేలాయి. ఇక ఎన్నికల సమయానికి ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ మద్దతుతో తెరకెక్కుతున్న కొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
గత ఎన్నికలకు ముందు యాత్ర, లక్ష్మీస్ ఎన్టీఆర్ లాంటి చిత్రాలు వైసీపీకి ఉపయోగపడగా.. ఈసారి దాదాపుగా అలాంటి సినిమాలే రెడీ అవుతున్నాయి. ‘లక్ష్మీస్ యన్టీఆర్’ తీసిన రామ్ గోపాల్ వర్మే ‘వ్యూహం’ అనే ప్రాపగండా మూవీ చేస్తున్నాడు. అలాగే వైఎస్ జీవిత కథ ఆధారంగా ‘యాత్ర’ తీసి మెప్పించిన మహి.వి.రాఘవ్ ఇప్పుడు వైఎస్ తనయుడు జగన్ మీద ‘యాత్ర-2’ చేస్తున్నాడు.
‘యాత్ర’తో పోలిస్తే ‘యాత్ర-2’ వ్యవహారమంతా కొంచెం పెద్ద స్థాయిలోనే కనిపిస్తోంది. యువి క్రియేషన్స్ లాంటి పెద్ద బేనర్ ఈ చిత్ర నిర్మాణంలో పాలు పంచుకోవడం విశేషం. ఇప్పటిదాకా రాజకీయాలు, వివాదాల జోలికి వెళ్లకుండా ఒక పంథాలో వెళ్లిపోతున్న యువి క్రియేషన్స్.. ప్రాపగండా ఫిలిం లాగే కనిపిస్తున్న ‘యాత్ర-2’తో అసోసియేట్ కావడం ఆశ్చర్యం కలిగించే విషయమే.
ఇక ఈ సినిమాకు మధీ లాంటి టాప్ సినిమాటోగ్రాఫర్.. సంతోష్ నారాయణన్ లాంటి మంచి అభిరుచి ఉన్న సంగీత దర్శకుడు పని చేస్తున్నారు. మధీ ‘శ్రీమంతుడు’ సహా ఎన్నో పెద్ద చిత్రాలకు పని చేశాడు. సంతోష్ నారాయణన్ తమిళంలో అగ్ర సంగీత దర్శకుల్లో ఒకడు. అతను ప్రస్తుతం ప్రభాస్ సినిమా ‘కల్కి’కి కూడా పని చేస్తున్నాడు. ఇలాంటి టెక్నీషియన్లను పెట్టుకుని భారీ బడ్జెట్లోనే సినిమా తీస్తున్నాడు మహి రాఘవ్. అధికార పార్టీ సహాయ సహకారాలున్నాయి కాబట్టి ఖర్చు విషయంలో అతడికి సమస్యలుండవు. మరి ఈ సినిమాను ఎంతమేర జనరంజకంగా తీస్తాడన్నదే చూడాలి.
This post was last modified on October 9, 2023 10:36 pm
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఉవ్వెత్తున సాగుతున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలు(అసెంబ్లీ+పార్లమెంటు) ప్రశాంతంగా జరిగాయని ఎన్నికలు సంఘం చెబుతోంది. అయితే.. ప్రశాంతత కొన్ని నియోజకవర్గాలకు.. జిల్లాలకు మాత్రమే…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలకు వెళ్లి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి అయిన శిల్పా రవికి ప్రచారం…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పలు చోట్ల అధికార వైఎస్సార్ పార్టీ నేతలు, కార్యకర్తలు దాడులకు పాల్పడ్డ ఉదంతాలు మీడియాలో…
ఎన్నికల అంకం ముగింపుకొస్తున్న తరుణంలో అందరి దృష్టి క్రమంగా సినిమాల వైపు మళ్లుతోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్లానింగ్ ఎలా…
కీలకమైన నాలుగోదశ ఎన్నికల పోలింగ్ సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవా ల్.. సంచలన ప్రకటన చేశారు.…