ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. రాజకీయ చిత్రాల ప్రభావం కూడా గట్టిగానే ఉండేలా కనిపిస్తోంది. ఇటీవల వచ్చిన స్కంద, పెదకాపు చిత్రాలు రాజకీయాల చుట్టూ తిరిగాయి. పెదకాపు కథ పూర్తిగా రాజకీయాల మీదే నడవగా.. ‘స్కంద’లో రాజకీయాల ప్రస్తావనతో బోలెడు పంచులు పేలాయి. ఇక ఎన్నికల సమయానికి ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ మద్దతుతో తెరకెక్కుతున్న కొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
గత ఎన్నికలకు ముందు యాత్ర, లక్ష్మీస్ ఎన్టీఆర్ లాంటి చిత్రాలు వైసీపీకి ఉపయోగపడగా.. ఈసారి దాదాపుగా అలాంటి సినిమాలే రెడీ అవుతున్నాయి. ‘లక్ష్మీస్ యన్టీఆర్’ తీసిన రామ్ గోపాల్ వర్మే ‘వ్యూహం’ అనే ప్రాపగండా మూవీ చేస్తున్నాడు. అలాగే వైఎస్ జీవిత కథ ఆధారంగా ‘యాత్ర’ తీసి మెప్పించిన మహి.వి.రాఘవ్ ఇప్పుడు వైఎస్ తనయుడు జగన్ మీద ‘యాత్ర-2’ చేస్తున్నాడు.
‘యాత్ర’తో పోలిస్తే ‘యాత్ర-2’ వ్యవహారమంతా కొంచెం పెద్ద స్థాయిలోనే కనిపిస్తోంది. యువి క్రియేషన్స్ లాంటి పెద్ద బేనర్ ఈ చిత్ర నిర్మాణంలో పాలు పంచుకోవడం విశేషం. ఇప్పటిదాకా రాజకీయాలు, వివాదాల జోలికి వెళ్లకుండా ఒక పంథాలో వెళ్లిపోతున్న యువి క్రియేషన్స్.. ప్రాపగండా ఫిలిం లాగే కనిపిస్తున్న ‘యాత్ర-2’తో అసోసియేట్ కావడం ఆశ్చర్యం కలిగించే విషయమే.
ఇక ఈ సినిమాకు మధీ లాంటి టాప్ సినిమాటోగ్రాఫర్.. సంతోష్ నారాయణన్ లాంటి మంచి అభిరుచి ఉన్న సంగీత దర్శకుడు పని చేస్తున్నారు. మధీ ‘శ్రీమంతుడు’ సహా ఎన్నో పెద్ద చిత్రాలకు పని చేశాడు. సంతోష్ నారాయణన్ తమిళంలో అగ్ర సంగీత దర్శకుల్లో ఒకడు. అతను ప్రస్తుతం ప్రభాస్ సినిమా ‘కల్కి’కి కూడా పని చేస్తున్నాడు. ఇలాంటి టెక్నీషియన్లను పెట్టుకుని భారీ బడ్జెట్లోనే సినిమా తీస్తున్నాడు మహి రాఘవ్. అధికార పార్టీ సహాయ సహకారాలున్నాయి కాబట్టి ఖర్చు విషయంలో అతడికి సమస్యలుండవు. మరి ఈ సినిమాను ఎంతమేర జనరంజకంగా తీస్తాడన్నదే చూడాలి.
This post was last modified on October 9, 2023 10:36 pm
నాని ది ప్యారడైజ్ షూటింగ్ చివరి ఘట్టానికి వచ్చేసింది. ఇంకో వారం పది రోజుల్లో గుమ్మడికాయ కొట్టేలా ఉన్నారు. కీర్తి…
దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న పరిణామాలను గమనిస్తే.. ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇమేజ్కు యువత పెద్ద ఎత్తున…
సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ డెబ్యూ ఫలితం తేలిపోయింది. కుర్రాడి నటనకు కాసిన్ని ప్రశంసలు దక్కినప్పటికీ కంటెంట్ పరంగా…
త్వరలోనే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు తెరదీయనున్నారు. సెప్టెంబరు-అక్టోబరు మధ్య మునిసిపాలిటీ… నవంబరు-డిసెంబరు మధ్య కార్పోరేషన్లు, జనవరిలో పంచాయతీ ఎన్నికలు…
శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్ నుంచి బుమ్రా గాయం కారణంగా తప్పుకున్నాడు. అయితే అతని స్థానంలో సీనియర్ బౌలర్…
ప్రధాని నరేంద్ర మోదీ వీడియోను ఫేస్బుక్ నుంచి తొలగించిన వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. సోషల్ మీడియా దిగ్గజం మెటా…