తెలుగులో ప్రస్తుతం ఉన్న సంగీత దర్శకుల్లో ప్రస్తుతం మోస్ట్ పాపులర్ ఎవరు అంటే తమన్ అని చెప్పేయొచ్చు. కొన్నేళ్లుగా దేవిశ్రీ ప్రసాద్ను కూడా వెనక్కి నెట్టి వరుసబెట్టి భారీ సినిమాలు చేస్తున్నాడు. ఐతే టాప్ మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నప్పటికీ సోషల్ మీడియాకు తరచుగా టార్గెట్ అవుతుంటాడు తమన్. అందుకు అతడి మీద ఉన్న ‘కాపీ’ ముద్రే కారణం. ఎక్కడెక్కడి నుంచో ట్యూన్లు పట్టుకొచ్చేస్తాడని.. ఒకే రకం మ్యూజిక్ ఇస్తాడని.. తన ట్యూన్లను, స్కోర్నే కాపీ కొడుతుంటాడని.. ఇలా చాలా విమర్శలే ఉన్నాయి తమన్ మీద.
మధ్యలో కొన్ని సినిమాలకు వైవిధ్యం చూపించిన తమన్.. ఈ మధ్య మళ్లీ ఒక మూసలో సాగిపోతున్నాడనే విమర్శలు ఎక్కువ అవుతున్నాయి. తాజాగా ‘స్కంద’ సినిమా విషయంలో తమన్ విమర్శల పాలైన సంగతి తెలిసిందే. గత నెలలో వచ్చిన ‘ఓజీ’ టీజర్కు తమన్ ఇచ్చిన స్కోర్ విషయంలో మంచి స్పందన వచ్చినా అది కూడా కాపీ ట్యూన్ అంటూ నెటిజన్లు దాని ఒరిజినల్ చూపించి తమన్ను ట్రోల్ చేశారు.
తాజాగా తమన్కు మరోసారి కాపీ మరకలు అంటాయి. ఈసారి తన మ్యూజిక్నే తమన్ కాపీ కొట్టాడని నెటిజన్లు కౌంటర్ వేస్తున్నారు. నిన్న రిలీజైన ‘భగవంత్ కేసరి’ ట్రైలర్కు ఎనర్జిటిక్ మ్యూజిక్కే ఇచ్చాడు తమన్. కానీ అందులో కొత్తదనం అయితే కనిపించలేదు. అందులో బాలయ్య ఇదీ మన సౌండ్ అంటూ ఒక డైలాగ్ చెబుతాడు. దానికి ముందు వినిపించే స్కోర్ ‘బ్రో’ సినిమాను గుర్తుకు చేస్తోంది.
బ్రో ఫస్ట్ టీజర్లో ‘బ్రో.. బ్రో’ అంటూ వినిపించే సౌండునే తమన్ రిపీట్ చేసినట్లు అనిపిస్తోంది. ఈ మ్యూజిక్ బిట్ పట్టుకుని.. ‘బ్రో’ టీజర్తో పోలుస్తూ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు నెటిజన్లు. ఎంత బిజీగా ఉంటే మాత్రం ఒక సినిమా మ్యూజిక్ ఇంకో సినిమాకు వాడేస్తాడా.. రెంటికీ ఒకే సౌండింగ్ ఇస్తున్న విషయం కూడా తెలియదా అంటూ తమన్ను విమర్శిస్తున్నారు. ఇలా సోషల్ మీడియాకు ఎన్నిసార్లు దొరికిపోతావ్ తమన్ అంటూ ప్రశ్నలు గుప్పిస్తున్నారు నెటిజన్లు.
This post was last modified on October 9, 2023 6:47 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…