మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ తో ఏ నిర్మాతైనా సినిమా చేస్తున్నప్పుడు ఆయన మీద అభిమానుల కళ్ళు నిత్యం ఉంటాయి. ఎప్పుడెప్పుడు అప్డేట్స్ ఇస్తారా అంటూ ట్విట్టర్ లో పోరు పెడుతూనే ఉంటారు. నాగవంశీ తన సోదరి హారిక కోసం మ్యాడ్ ని సమర్పించి దానికి సంబంధించిన ప్రమోషన్ వ్యవహారాలు దగ్గరుండి చూసుకున్న సంగతి తెలిసిందే. ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇచ్చారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి స్టార్లను తీసుకొచ్చి దాని మీద జానాల దృష్టి పడేలా చేశారు. మంచి థియేటర్లు దక్కేలా చూసుకున్నారు. హిట్ టాక్ తెచ్చుకోవడంతో దాన్ని మరింత బలపరిచే పనిలో ఉన్నారు.
ఇదంతా బాగానే ఉంది కానీ మ్యాడ్ ని ప్రమోట్ చేసుకోవడం నాగవంశీ ఉద్దేశమైతే ఆయనతో ముఖాముఖీ తీసుకున్న వాళ్ళందరూ గుంటూరు కారం గురించి ప్రశ్నల వర్షం కురిపించి వీలైనంత దాని విశేషాలను బయట పెట్టే ప్రయత్నం చేశారు. టాకీ పార్ట్ అక్టోబర్ 20 లోపు పూర్తి కావడం, వచ్చే నెలాఖరుకి పాటలు ఫినిష్ చేసేయడం, ఇప్పటిదాకా మహేష్ కెరీర్లో రానటువంటి బిగ్గెస్ట్ మాస్ సాంగ్ ఇందులో ఉందని హిట్ ఇవ్వడం, ఇంటర్వెల్ బ్లాక్ కు సంబంధించిన విశేషాలు, ఫ్యాన్స్ ఫీలింగ్స్ గురించి టీమ్ అభిప్రాయాలు ఇలా ఎన్నో సంగతులు ఆయన నుంచి ధారాళంగా వచ్చేశాయి.
అప్డేట్స్ కోసం మొహం వాచిపోయిన అభిమానులకు ఈ వీడియోలే కొండంత బలంగా మారాయి. వాటిలో సూర్యవంశీ ఇచ్చిన ఎలివేషన్లు నెక్స్ట్ లెవెల్ లో ఉండటంతో ఆనందంతో ఉబ్బితబ్బిబ్బువుతున్నారు. తమకు కావాల్సిన క్లిప్పులను కట్ చేసుకుని వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. దెబ్బకు మ్యాడ్ ముచ్చట్ల కన్నా గుంటూరు కారం కబుర్లు బాగా హైలైట్ అయ్యాయి. కాగల కార్యం ఎవరో నెరవేర్చినట్టు ఇంకొద్ది రోజులు మహేష్ ఫ్యాన్స్ వీటితో సరిపెట్టుకుంటారు. ఫస్ట్ ఆడియో సింగల్ పండక్కు అనౌన్స్ చేసి అక్కడి నుంచి ప్రమోషన్లు మొదలుపెట్టే ప్లానింగ్ లో ఉన్నారు హారిక అండ్ హాసిని.
This post was last modified on October 8, 2023 4:30 pm
ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన కొత్త మ్యాప్ వివాదాస్పదంగా మారింది. భారత దేశంలో భాగమైన అరుణాచల్ ప్రదేశ్ ని స్వతంత్ర…
రాష్ట్రంలో కూటమి సర్కారు ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తయింది. అయితే.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్లీ అధికారం ఎవరికి దక్కుతుంది? అనే…
ఏపీ విపక్షం(ప్రధాన కాదు) వైసీపీలో అంతర్గత పోరు ఎక్కువగా సాగుతోంది. దీనికి తోడు.. వైసీపీ అధినేత జగన్కు అత్యంత సన్నిహితంగా…
ఒకటి కాదు.. రెండు కాదు... ఏకంగా వేలు.. లక్షల్లోనే ఉద్యోగాలకు ప్రతిష్టాత్మక సంస్థలు మంగళం పాడుతున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత ఫోక్స్…
ఇండియాలో ఓటీటీల హవా మొదలయ్యాక పాన్ ఇండియా స్థాయిలో అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకున్న వెబ్ సిరీస్ల్లో ‘మీర్జాపూర్’ ఒకటి. ఇండియాలో…
తెలుగు వారికి అత్యంత ప్రీతిపాత్రమైన టీవీ ఛానెళ్లలో ఈటీవీ ఒకటి. 90వ దశకంలో ప్రైవేటు టీవీ ఛానెళ్ల జోరు పెరుగుతున్న…