మాములుగా ఒక సినిమా టాక్ పూర్తిగా బయటికి వచ్చాక కలెక్షన్లు తగ్గడమో లేదా థియేటర్ల నుంచి తీసేయడమో జరుగుతుంది. ఇది సహజం. ఆశ్చర్యపోవడానికి ఏమి లేదు. కానీ బోలెడు కొత్త చిత్రాలు రిలీజై మొదటి రోజు స్క్రీన్లు తక్కువ పడితే అంతకంటే పండగేమనుకుంటాం. కానీ వాటిలో ఒక్క దానికి మినహాయించి మిగిలినవాటికి హౌస్ ఫుల్స్ కావడం పక్కనపెడితే అసలు మధ్యాన్నం, రాత్రి ఆటలు క్యాన్సిల్ కావడమంటే ఖచ్చితంగా ఆందోళన కలిగించే పరిణామమే. నిన్న విడుదలైన వాటిలో ఒక్క మ్యాడ్ మాత్రమే ప్రేక్షకులతో పాస్ ముద్ర వేయించుకుని వసూళ్లు రాబడుతోంది.
భాషతో సంబంధం లేకుండా మిగిలినవాటి బాక్సాఫీస్ సీన్ దయనీయంగా ఉంది. కలర్స్ స్వాతి మంత్ అఫ్ మధు, సుధీర్ బాబు మామా మశ్చీంద్ర, మురళీధరన్ 800, సిద్దార్థ్ చిన్నాలకు నగరాల్లో కొన్ని మల్టీప్లెక్సులు మినహాయించి చాలా చోట్ల షోకు కనీసం ఓ పాతిక మంది రాలేని పరిస్థితి నెలకొంది. పలు బిసి సెంటర్లలో మార్నింగ్ షోలే రద్దు చేయాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంకొన్ని చోట్ల ఆల్రెడీ తీసేసిన జవాన్ ని మళ్ళీ వేసి ఫైనల్ రన్ వైపు వెళ్తున్న స్కందని తిరిగి కంటిన్యూ చేస్తున్నారు. ఒక నెల మొదటి వారంలో ఇలా జరగడం అనూహ్యం.
దెబ్బకు బయ్యర్లు బెంబేలెత్తుతున్నారు. దసరాకు భగవంత్ కేసరి, లియో, టైగర్ నాగేశ్వరరావులు వచ్చే దాకా ఇందులో ఎలాంటి మార్పు ఉండదని, అద్దెలు గిట్టుబాటు అయితే చాలానే రీతిలో ఎగ్జిబిటర్లు రోజు దేవుడిని వేడుకోవడం మినహా ఏం చేయలేమంటున్నారు. హైదరాబాద్, వైజాగ్, గుంటూరు లాంటి నగరాల్లో కొంత మెరుగ్గా ఉన్నా మాస్ ప్రభావం ఎక్కువగా ఉండే కేంద్రాల్లో మాత్రం టికెట్ కౌంటర్లు డల్లుగా ఉన్నాయి. ఇతర బాషల మిషన్ రాణిగంజ్, దోనో, ఎగ్జార్సిస్ట్ బిలీవర్ లు కూడా అంతంతమాత్రమే జనాన్ని రప్పిస్తున్నాయి. సో మ్యాడ్ తప్ప ఈ ఫ్రైడే టోటల్ బ్యాడ్ అయిపోయింది.
This post was last modified on October 7, 2023 4:25 pm
గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…
బీజేపీ, జనసేనలతో కూటమి కట్టిన టీడీపీ ఏపీలో జరిగిన ఎన్నికల్లో పోరాటం చేసిన విషయం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…
గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…
ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…
చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…
యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…