మాములుగా ఒక సినిమా టాక్ పూర్తిగా బయటికి వచ్చాక కలెక్షన్లు తగ్గడమో లేదా థియేటర్ల నుంచి తీసేయడమో జరుగుతుంది. ఇది సహజం. ఆశ్చర్యపోవడానికి ఏమి లేదు. కానీ బోలెడు కొత్త చిత్రాలు రిలీజై మొదటి రోజు స్క్రీన్లు తక్కువ పడితే అంతకంటే పండగేమనుకుంటాం. కానీ వాటిలో ఒక్క దానికి మినహాయించి మిగిలినవాటికి హౌస్ ఫుల్స్ కావడం పక్కనపెడితే అసలు మధ్యాన్నం, రాత్రి ఆటలు క్యాన్సిల్ కావడమంటే ఖచ్చితంగా ఆందోళన కలిగించే పరిణామమే. నిన్న విడుదలైన వాటిలో ఒక్క మ్యాడ్ మాత్రమే ప్రేక్షకులతో పాస్ ముద్ర వేయించుకుని వసూళ్లు రాబడుతోంది.
భాషతో సంబంధం లేకుండా మిగిలినవాటి బాక్సాఫీస్ సీన్ దయనీయంగా ఉంది. కలర్స్ స్వాతి మంత్ అఫ్ మధు, సుధీర్ బాబు మామా మశ్చీంద్ర, మురళీధరన్ 800, సిద్దార్థ్ చిన్నాలకు నగరాల్లో కొన్ని మల్టీప్లెక్సులు మినహాయించి చాలా చోట్ల షోకు కనీసం ఓ పాతిక మంది రాలేని పరిస్థితి నెలకొంది. పలు బిసి సెంటర్లలో మార్నింగ్ షోలే రద్దు చేయాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంకొన్ని చోట్ల ఆల్రెడీ తీసేసిన జవాన్ ని మళ్ళీ వేసి ఫైనల్ రన్ వైపు వెళ్తున్న స్కందని తిరిగి కంటిన్యూ చేస్తున్నారు. ఒక నెల మొదటి వారంలో ఇలా జరగడం అనూహ్యం.
దెబ్బకు బయ్యర్లు బెంబేలెత్తుతున్నారు. దసరాకు భగవంత్ కేసరి, లియో, టైగర్ నాగేశ్వరరావులు వచ్చే దాకా ఇందులో ఎలాంటి మార్పు ఉండదని, అద్దెలు గిట్టుబాటు అయితే చాలానే రీతిలో ఎగ్జిబిటర్లు రోజు దేవుడిని వేడుకోవడం మినహా ఏం చేయలేమంటున్నారు. హైదరాబాద్, వైజాగ్, గుంటూరు లాంటి నగరాల్లో కొంత మెరుగ్గా ఉన్నా మాస్ ప్రభావం ఎక్కువగా ఉండే కేంద్రాల్లో మాత్రం టికెట్ కౌంటర్లు డల్లుగా ఉన్నాయి. ఇతర బాషల మిషన్ రాణిగంజ్, దోనో, ఎగ్జార్సిస్ట్ బిలీవర్ లు కూడా అంతంతమాత్రమే జనాన్ని రప్పిస్తున్నాయి. సో మ్యాడ్ తప్ప ఈ ఫ్రైడే టోటల్ బ్యాడ్ అయిపోయింది.
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…