మన సినిమాని పక్క భాష వాళ్ళు ఆదరిస్తున్నారంటే వాళ్లకు గౌరవం ఇవ్వడం ఎంతైనా అవసరం. కానీ కోలీవుడ్ హీరోలు నిర్మాతలకు అదేమి పట్టడం లేదు. కనీసం టైటిల్ ని తెలుగులో అనువదించాలన్న సోయ లేకుండా ప్యాన్ ఇండియాని సాకుగా చూపించి యధాతథంగా పెట్టేస్తున్నారు. శివ కార్తికేయన్ కొత్త సినిమా అయలాన్ కు అదే పేరుని అలాగే ఉంచేసి సంక్రాంతి విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఇంతకు ముందు అజిత్ వలిమై, కంగనా రౌనత్ తలైవి, త్వరలో విడుదల కాబోయే విజయ ఆంటోనీ రత్తం అందరిదీ ఇదే దారి. అరవ భాషని ప్రమోట్ చేయడమే లక్ష్యంగా కనిపిస్తోంది.
ఈ విషయంలోనే కాదు మరికొన్ని అంశాల్లోనూ తమిళ హీరోల ధోరణి ఆమోదయోగ్యంగా లేదు. ఇక్కడ మార్కెట్ ఎంత పెరుగుతున్నా విజయ్ ఏనాడూ హైదరాబాద్ కు వచ్చి కనీసం ఒక ప్రెస్ మీట్ ఇచ్చిన పాపాన పోలేదు. దిల్ రాజు లాంటి దిగ్గజమే వారసుడు టైంలో ఇది సాధించలేకపోయారు. కారణాలు చెప్పుకున్నారు అవి సహేతుకంగా అనిపించలేదు. అజిత్ సంగతి సరేసరి. భాగ్యనగరానికి షూటింగ్ కోసం ఎన్ని సార్లు వచ్చినా కనీసం డబ్బింగ్ హక్కులు కొన్న నిర్మాతతో మీటింగ్ కూడా పెట్టుకోరు. ఏమైనా అంటే మేమింతే మా పద్దతి ఇంతే సర్దుకోండని తేల్చేస్తారు.
హీరోలే కాదు నయనతార లాంటి హీరోయిన్లు సైతం టాలీవుడ్ ప్రెస్ మీట్లు, ఈవెంట్లంటే మొహం చాటేస్తారు. విశాల్, లారెన్స్, విజయ్ ఆంటోనీ, సూర్య, కార్తీ లాంటి వాళ్ళను వీటి నుంచి మినహాయించవచ్చు. వీళ్ళు దగ్గరుండి మరీ ప్రమోషన్లకు తమ వంతుగా సహకారం అందిస్తారు. ఒకప్పుడు దర్శకుడు శంకర్ కమల్ హాసన్ తో ఇండియన్ తీస్తే దాన్ని తెలుగులో భారతీయుడుగా డబ్ చేశారు. అది లాంగ్వేజ్ కిచ్చే గౌరవం. ఇప్పుడు చూస్తే ఆయనే గేమ్ చేంజర్ అంటూ ఇంగ్లీష్ కి షిఫ్ట్ అయిపోయారు. మనం ఎన్ని అనుకున్నా ఈ పోకడలో మార్పు రాదు కానీ చూస్తూ ఉండటం తప్ప ఏం చేయలేం.
This post was last modified on October 7, 2023 2:30 pm
సినిమాకు హైప్ తీసుకురావడంలో ఒక్కో దర్శకుడిది ఒక్కో స్టైల్. ముఖ్యంగా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకులు తమ…
టీడీపీ ని నిలబెట్టింది కార్యకర్తలు.. వారి అండతోనే పార్టీ విజయం దక్కించుకుంటోంది- అని పార్టీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ…
దేశరాజధాని ఢిల్లీలో సోమవారం చోటు చేసుకున్న పరిణామాలపై సోషల్ మీడియా వేదికగా అనేక వ్యాఖ్యలు వెల్లువెత్తుతున్నాయి. అందరి టార్గెట్ ఒక్కటే..…
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రశంసలు లభించాయి. ఆయన వ్యవహరిస్తున్న తీరును పలువురు కేంద్ర మంత్రులు కొనియాడారు.…
ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యవహారం మరోసారి చర్చకు వచ్చింది. 2024లో పార్టీ పగ్గాలు చేపట్టిన షర్మిలపై…
ప్రేమలు సినిమాతో మమిత బైజు అనే అమ్మాయి ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. అప్పటికే మలయాళంలో కొన్ని సినిమాల్లో నటించినా..…