గత పదేళ్ల కాలంలో తమిళ కథానాయకుడు విజయ్ రేంజే మారిపోయింది. ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్, బిజ ఒకప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్కు అతను దరిదాపుల్లో ఉండేవాడు కాదు. కానీ ఓవైపు రజినీకాంత్ వరుస ఫ్లాపులతో డౌన్ అవుతుంటే.. మరోవైపు విజయ్ వరుసగా బ్లాక్బస్టర్లు ఇస్తూ ఎదిగిపోయాడు. చూస్తుండగానే రజినీని దాటి ముందుకు వెళ్లిపోయాడు.
అతడి హవా ఎలా సాగిందంటే తెరి, బిగిల్, మాస్టర్ లాంటి యావరేజ్ సినిమాలు కూడా భారీ వసూళ్లు తెచ్చుకున్నాయి. అతడి సినిమాలకూ భారీగా బిజినెస్ జరగడం మొదలైంది. ఐతే టైం ఎప్పుడూ ఒకలా ఉండదు. అందుకు గత ఏడాదిన్నరలో వచ్చిన ఫలితాలే ఉదాహరణ. బీస్ట్ మూవీతో విజయ్ కెరీర్కు పెద్ద బ్రేకే పడింది. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. ఇక ఈ ఏడాది రజినీ జైలర్ మూవీతో బలంగా బౌన్స్ బ్యాక్ అయ్యాడు.
ఆ సినిమా యావరేజ్ టాక్తోనే చాలా పెద్ద రేంజికి వెళ్లిపోయింది. విజయ్ ఇప్పుడు లియోతో రజినీకి బదులిస్తాడని అంతా అనుకున్నారు. కానీ మొన్నటిదాకా ఈ సినిమాకు ఉన్న హైప్ ఉన్నట్లుండి తగ్గింది. అందుక్కారణం.. ట్రైలర్. ఏదో అనుకుని ట్రైలర్ చూసిన వాళ్లకు ప్యూజులు ఎగిరిపోయాయి. అది ఏమాత్రం అంచనాలను అందుకోలేని విధంగా సాధారణంగా ఉండటంతో విజయ్ అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులూ నిరాశ చెందారు.
ఒక్కసారిగా సినిమాపై నెగెటివిటీ ముసురుకుంది. ట్రైలర్లో ఎక్కువగా ట్రోలింగ్కు గురవుతున్నది విజయే. అతడి లుక్ తేలిపోయింది. కొన్ని సన్నివేశాల్లో అతడి నటన.. హావభావాలు కూడా తుస్సుమనిపించాయి. దీని మీద సోషల్ మీడియాలో చాలా ట్రోలింగ్ నడుస్తోంది. లుక్స్, నటన పరంగా విజయ్ బలహీనతలన్నీ ఈ ట్రైలర్ బయటపెట్టేసిందని.. లోకేష్ ఇలా చేశాడేంటని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
This post was last modified on October 7, 2023 9:09 am
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…