ఈ వారం టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మ్యాడ్ రష్ చూస్తున్నాం. ఒకేసారి అరడజను చెప్పుకోదగ్గ సినిమాలు రిలీజయ్యాయి శుక్రవారం. ఏదో నామమాత్రంగా రిలీజవుతున్న సినిమాలను కూడా కలుపుకుంటే నంబర్ పది దాకా ఉంది. ఐతే కొత్త రిలీజ్ల్లో చాలా చిత్రాలు మినిమం ఇంపాక్ట్ కూడా క్రియేట్ చేసేలా లేవు. ఒక్క మ్యాడ్ సినిమాకు మాత్రమే ఫుల్ పాజిటివ్ టాక్ వచ్చింది.
తమిళ అనువాద చిత్రం చిన్నాకు మంచి టాక్ ఉన్నా లిమిటెడ్ రిలీజ్తో వచ్చిన ఆ చిత్రం ప్రేక్షకుల దృష్టిలో ఏమాత్రం పడుతుందన్నది సందేహంగానే ఉంది. మిగతా సినిమాలు నెగెటివ్, డివైడ్ టాక్ తెచ్చుకున్నాయి. ఒకేసారి ఎక్కువ సినిమాలు రిలీజైనపుడు నెగెటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాలు ఎలా అడ్రస్ లేకుండా పోతాయో.. అన్నింట్లోకి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాకు అంత అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు మ్యాడ్కు కూడా అలాగే కలిసొచ్చేలా ఉంది.
ముందు రోజు రాత్రి ప్రిమియర్ల నుంచే మ్యాడ్కు హిట్ టాక్ వచ్చింది. తొలి రోజు షో షోకి పాజిటివ్ టాక్ పెరుగుతూ వెళ్తోంది. సాయంత్రానికి సినిమాకు చాలా చోట్ల హౌస్ ఫుల్స్ పడిపోయాయి. యూత్ సినిమాను ఎగబడి చూస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. మ్యాడ్ మరీ గొప్ప సినిమా కాకపోయినా ఉన్న వాటిలో బెస్ట్, టైంపాస్ వినోదానికి ఢోకా లేకపోవడంతో యూత్కు ఇదే ఫస్ట్ ఛాయిస్ అవుతోంది.
సినిమాకు క్రమంగా స్క్రీన్లు కూడా పెరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం బుక్ మై షోలో మ్యాడ్కు ఫుల్ పాజిటివ్ ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. చూస్తుంటే బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఫుల్ అడ్వాంటేజ్ తీసుకునేలా ఉంది. ఫుల్ రన్లో ఈజీగా పది కోట్ల షేర్ మార్కును సినిమా క్రాస్ చేసేలా ఉంది. ఇంకా పెద్ద నంబర్స్ నమోదైనా ఆశ్చర్యం లేదేమో. కొత్త దర్శకుడు కళ్యాణ్ శంకర్ రూపొందించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది.
This post was last modified on October 7, 2023 9:05 am
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…