ప్రియాంక అరుల్ మోహన్.. గత ఏడాది తెలుగు కుర్రాళ్ల గుండెలకు గాయం చేసిన అమ్మాయి. నాని సినిమా ‘గ్యాంగ్ లీడర్’తో తెలుగు తెరకు పరిచయం అయ్యిందీ మలయాళ అమ్మాయి.
‘గ్యాంగ్ లీడర్’ అనుకున్న స్థాయిలో ఆడకపోవడం వల్ల ప్రియాంకకు బ్రేక్ రాలేదు కానీ.. ఒక స్టార్ హీరోయిన్ కాగల లక్షణాలు ఆమెలో కచ్చితంగా ఉన్నాయి. కాకపోతే రెగ్యులర్ గ్లామర్ హీరోయిన్లకు ఆమె భిన్నం. ‘అందాల రాక్షసి’లో లావణ్య త్రిపాఠి లాగే ప్రియాంకకు కూడా ఒక ప్రత్యేకమైన అందంతో కుర్రాళ్లను ఆకట్టుకుంది. చాలామంది ఆ సినిమా చూసి ప్రియాంకతో ప్రేమలో పడిపోయారు.
కానీ మన దగ్గర అవకాశాలు రావాలంటే బాక్సాఫీస్ సక్సెసే ప్రామాణికం. పైగా ప్రియాంక తొలి సినిమాలో గ్లామర్ విందు కూడా చేయలేదు. దీంతో తనకు ఆ తర్వాత ఒక్క అవకాశం కూడా రాలేదు. దాదాపు ఏడాది గ్యాప్ వచ్చేయడంతో ప్రియాంకకు ఇక తెలుగులో అవకాశాలు లేనట్లే అని అంతా ఫిక్సయిపోయారు.
ఐతే ప్రియాంక ఎట్టకేలకు రెండో అవకాశం సంపాదించినట్లు సమాచారం. యువ కథానాయకుడు నిఖిల్కు జోడీగా ప్రియాంక నటించనుందట. అతను సుకుమార్, అల్లు అరవింద్ల ఉమ్మడి నిర్మాణంలో.. సుక్కు శిష్యుడు పల్నాటి సూర్యప్రతాప్ రూపొందించనున్న ‘18 పేజెస్’ సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి కథానాయికగా రకరకాల పేర్లు వినిపించాయి. ఐతే చివరికి నిఖిల్కు జోడీగా ప్రియాంకను ఖరారు చేసినట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందట.
ఇంతకుముందు సుక్కు స్క్రిప్టుతో ‘కుమారి 21 ఎఫ్’ తీసిన సూర్యప్రతాప్.. ఆ తర్వాత మరే సినిమా తీయలేదు. మళ్లీ గురువు కథతోనే సినిమా చేయబోతున్నాడు. ఇది ఒక డైరీ నేపథ్యంలో సాగే ప్రేమకథ అని సమాచారం. కథ కొంచెం పాత తరహాలో ఉన్నప్పటికీ.. ట్రీట్మెంట్ కొత్తగా ఉంటుందట. సుకుమార్, అల్లు అరవింద్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటంతో దీనిపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది.
This post was last modified on August 25, 2020 1:44 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…