బాహుబలి తర్వాత ప్రభాస్ అన్నీ ప్యాన్ ఇండియా సినిమాలే చేస్తున్నాడు కానీ మిర్చి, ఈశ్వర్ రేంజ్ లో ఒక ఊర మాస్ కంటెంట్ పడాలని అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. బడ్జెట్ తక్కువైనా పర్లేదు కానీ నిఖార్సైన తెలుగు కమర్షియల్ బొమ్మలో చూడాలని వాళ్ళ కోరిక. మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో అలాగే కనిపిస్తాడనే టాక్ ఉంది కానీ గెటప్ ఎలా ఉంటుందో అంతు చిక్కడం లేదు. ఈలోగా ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాంకేతికత ఉపయోగించి లీకుల ఆధారంగా కొందరు ఫ్యాన్స్ డార్లింగ్ ఎలా ఉంటాడనే దాని మీద ఒక ఆర్ట్ డిజైన్ చేశారు.
నిజంగానే అదిరిపోయిందనిపించేలా ప్రభాస్ కటవుట్ అరాచకంగా ఉంది. ఊహించి చేసిందే కానీ ఒకవేళ అచ్చం ఇదే మేకోవర్ తో కనక ఓ ఫ్యాక్షన్ సినిమా తీస్తే రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమే. ఇదొక్కటే కాదు మహేష్ బాబు రాజమౌళి ఫారెస్ట్ మూవీకి సంబంధించి కూడా కొన్ని ఇమేజెస్ తయారు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. సలార్ లో ప్రభాస్ ఫ్యాన్స్ కోరుకున్నట్టే ఉన్నా అధిక శాతం అది కెజిఎఫ్ లాగా బ్లాక్ బ్యాక్ గ్రౌండ్ తో ఉంటుంది. సో నేటివిటీ పరంగా మన మాస్ కు కొంచెం దూరంగానే ఉంటుంది. కానీ మారుతీది మాత్రం అలా ఉండదని ఇన్ సైడ్ టాక్.
డిసెంబర్ లో సలార్ 1 రిలీజయ్యాక రెండో భాగం షూటింగ్ మొదలవుతుంది. ఆలోగా కల్కి ఫస్ట్ పార్ట్ ని ఒక కొలిక్కి తీసుకొస్తారు. జనవరి నుంచి మారుతీ షూటింగ్ మళ్ళీ వేగమందుకుంటుంది. సందీప్ వంగా స్పిరిట్ ని వేసవి లోగానే మొదలుపెట్టొచ్చు. హను రాఘవపూడి దర్శకత్వంలో ప్లాన్ చేసుకున్న మరో ప్యాన్ ఇండియాకు సంబంధించిన స్క్రిప్ట్ ఫైనలైతే అది కూడా సెట్స్ పైకి వెళ్తుంది. రాబోయే మూడేళ్ళకు సరిపడా రిలీజులు ప్రభాస్ రెడీ చేసి పెడుతున్నాడు. కాకపోతే తన చేతుల్లో లేని వాయిదాల పర్వం వల్ల ఫ్యాన్స్ ఫీలవుతున్నారు తప్పించి వేగంగా భారీ చిత్రాలు చేయడంలో ప్రభాసే ముందున్న మాట వాస్తవం.
This post was last modified on October 5, 2023 5:11 pm
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో బెట్టింగుల జోరు ఎక్కువ.! నెల్లూరు జిల్లాలో అయితే ఓ ప్రజా ప్రతినిథి నేతృత్వంలోనే బెట్టింగులు…
అంబటి రాంబాబు.. పరిచయం అక్కర్లేని పేరిది. పేరుకి మంత్రి.! కానీ, ఆ నీటి పారుదల శాఖ తరఫున పెద్దగా మాట్లాడిందీ,…
"నేడు నా పుట్టిన రోజు.. వైసీపీ చచ్చిన రోజు``- అని వైసీపీ రెబల్ ఎంపీ, టీడీపీ నాయకుడు కనుమూరి రఘురామకృష్ణరాజు…
మాములుగా కొత్త సినిమా ఏదైనా థియేటర్లో లేదా ఓటిటిలో నిర్మాత నిర్ణయాన్ని బట్టి రావడం ఇప్పటిదాకా చూస్తున్నాం. కానీ సోషల్…
ప్రధాని నరేంద్ర మోడీ ముచ్చటగా మూడో సారి కూడా వారణాసి నియోజకవర్గం నుంచి తన నామినేషన్ సమర్పించారు. సొంత రాష్ట్రం…
రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. ఏమైనా కావొచ్చు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి నియోజకవర్గంలోనూ ఇదే చర్చ సాగుతోంది. పోలింగ్…