ఇప్పటిదాకా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్ అంటే గుర్తొచ్చేది బ్రహ్మోత్సవం ఒకటే. ఫ్యామిలీ డ్రామాగా భారీ అంచనాలు మోసుకొచ్చి బాక్సాఫీస్ వద్ద చతికిలపడ్డ వైనం మహేష్ అభిమానులు అంత సులభంగా మర్చిపోలేరు. దీని దెబ్బకే అడ్డాల చాలా గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. తిరిగి నారప్ప రీమేక్ కోసం సురేష్ బాబు పిలిచే దాకా ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయారు. ఈలోగా పెదకాపు కథ నిర్మాత మిర్యాల రవీంద్రరెడ్డికి నచ్చడం, విరాట్ కర్ణని పరిచయం చేయడానికి ఇదే బెస్ట్ సబ్జెక్టని ఫీల్ కావడంతో పెద్ద బడ్జెట్ తో మూడు భాగాలుగా ప్లాన్ చేసుకున్నారు.
కట్ చేస్తే థియేట్రికల్ బిజినెస్ పరంగా పెదకాపు 1 బ్రహ్మోత్సవంని మించిన ఫలితాన్ని అందుకుంది. 12 కోట్ల టార్గెట్ తో బరిలో దిగి కనీసం పది శాతం కూడా రికవరీ చేయలేక ఈ ఏడాది అతి పెద్ద ఫ్లాపుల్లో ఒకటిగా మిగిలిపోనుంది. మొదటి రోజు సాయంత్రం నుంచే డెఫిషిట్లు మొదలు కావడం ట్రాజెడీ. ట్రేడ్ చెబుతున్న దాని ప్రకారం పట్టుమని నలభై లక్షలు కూడా వసూలు చేయలేక పెదకాపు వారం తిరగకుండానే తిరుగుటపా కట్టేస్తోంది. భారీ మొత్తాలకు కొన్న బయ్యర్లకు తీవ్ర నష్టాలు తప్పలేదు. ఎల్లుండి ఎనిమిదికి పైగా కొత్త రిలీజులు ఉన్న నేపథ్యంలో ఇక ఆశలేం లేవు.
పెదకాపు 2 జరగడం అనుమానమే. ఇప్పుడు వచ్చిన రిటర్న్స్ చూశాక ఏ నిర్మాతైనా అంత సాహసం చేయడు. తనకు అలవాటు లేని కొత్త జానర్ ని ట్రై చేసిన శ్రీకాంత్ అడ్డాలకు ఈ షాక్ మళ్ళీ ఎంత గ్యాప్ ఇస్తుందో చెప్పలేం. ఒక పెద్ద హీరోతో అన్నాయ్ అనే రెండు భాగాల చిత్రాన్ని ప్లాన్ చేసుకున్న ఈ ఫ్యామిలీ దర్శకుడు దాన్ని ముందుకు తీసుకెళ్లడం కష్టమే. విడుదలకు ముందు చాలా కాన్ఫిడెంట్ గా కనిపించిన అడ్డాల తీరా సినిమా వచ్చాక ఎలాంటి ప్రెస్ మీట్ కానీ, బయట కనిపించడం కానీ చేయలేదు. కంటెంట్ పరంగా చాలా దారుణంగా ఉన్న చంద్రముఖి 2నే మెరుగైన కలెక్షన్లు రాబట్టడం అసలు విషాదం.
This post was last modified on October 4, 2023 11:47 am
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…