చాలా ఏళ్లుగా సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్నాడు తమిళ కథానాయకుడు విశాల్. ఐతే తన కొత్త చిత్రం ‘మార్క్ ఆంటోనీ’ క్రేజీ ట్రైలర్తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. రొడ్డ కొట్టుడు మాస్ స్టైల్ విడిచిపెట్టి.. ఈసారి అతను కొంచెం కొత్తగా ట్రై చేశాడు. ఒక ఫోన్ ద్వారా గతంలోని వ్యక్తులతో మాట్లాడే కాన్సెప్ట్తో ఈ సినిమా తెరకెక్కింది. ఈ వెరైటీ కథను మాస్ స్టయిల్లో డీల్ చేసిన దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్.. ప్రేక్షకులను బాగానే ఎంటర్టైన్ చేశాడు.
ఇందులో కొన్ని క్రేజీ ఎపిసోడ్లు ప్రేక్షకులను బాగానే అలరించాయి. కాకపోతే ఓవర్ ద టాప్ నరేషన్.. సినిమా అంతా గోల గోలగా ఉండటం ప్రతికూలాంశాలు. ఈ చిత్రానికి తెలుగులో యావరేజ్ టాక్ వచ్చింది. ఓపెనింగ్స్ కూడా ఓ మోస్తరుగా వచ్చాయంతే. ఈ కథను కొంచెం సటిల్గా డీల్ చేసి ఉంటే మన ప్రేక్షకులు కూడా బాగానే ఆదరించేవారేమో. మొత్తంగా మనదగ్గర ‘మార్క్ ఆంటోనీ’ యావరేజ్ అనిపించుకుంది.
కానీ తమిళంలో మాత్రం ‘మార్క్ ఆంటోనీ’ ఇరగాడేసింది. విశాల్ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్స్ తెచ్చుకోవడమే కాదు.. ఓవరాల్ వసూళ్లలోనూ కెరీర్ రికార్డు ఇచ్చింది. తొలిసారిగా వంద కోట్ల క్లబ్బును విశాల్కు పరిచయం చేసింది. విడుదలైన మూడో వారాలకు కూడా బాగా ఆడుతున్న ఈ చిత్రం తాజాగా వంద కోట్ల మార్కును అందుకుంది. విశాల్ రేంజికి ఇది పెద్ద అచీవ్మెంటే.
‘మార్క్ ఆంటోనీ’ తమిళ జనాలకు విపరీతంగా నచ్చేసిందనడానికి ఇది రుజువు. విశాల్ను మించి ఇందులో ఎస్.జె.సూర్య హైలైట్ అయ్యాడు. అతడితో ముడిపడ్డ కొన్ని ఎపిసోడ్లను తమిళ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. సిల్క్ స్మిత ఎపిసోడ్కు కూడా వాళ్లు బాగా కనెక్టయ్యారు. మూడు వారాల తర్వాత కూడా ‘మార్క్ ఆంటోనీ’కి వసూళ్లు నిలకడగా ఉండటం విశేషం. ఇటీవలే ఈ చిత్రాన్ని హిందీలోనూ రిలీజ్ చేశాడు విశాల్. ఐతే అక్కడ సెన్సార్ కోసం లంచం ఇవ్వాల్సి రావడంపై విశాల్ ఫిర్యాదు చేయడం.. సోషల్ మీడియాలో దీని గురించి పోస్ట్ పెట్టడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే.
This post was last modified on October 3, 2023 3:20 pm
ఎప్పుడూ ఫిలిం ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు అంటూ హీరోల గురించే మాట్లాడుకుంటూ ఉంటాం. హీరోయిన్ల గురించి అంత…
టాలీవుడ్ లెజెండరీ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ పెద్ద కొడు అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో పెద్ద స్టార్ అయిపోయాడు.…
కొన్ని డిమాండ్ల గురించి చర్చకు తీసుకొచ్చినప్పుడు.. ఒకవైపు వాదన విన్నప్పుడు నిజమే కదా? అనిపిస్తుంది. కానీ.. అదే విషయాన్ని మరో…
పిఠాపురం మున్సిపల్అధికారులపై టీడీపీ నేత వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ కార్యక్రమంలో తమ నేత చంద్రబాబు నాయుడి ఫొటో…
స్టేజ్ మీద నోరు జారడం.. ఆపై క్షమాపణ చెప్పడం.. ఈ మధ్య ఫిలిం సెలబ్రిటీలకు మాములు అయిపోయింది. టాలీవుడ్ లెజెండరీ…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'కు తెలంగాణలో టికెట్ల ధరలు ఎలా ఉంటాయన్నది గత…