చాలా ఏళ్లుగా సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్నాడు తమిళ కథానాయకుడు విశాల్. ఐతే తన కొత్త చిత్రం ‘మార్క్ ఆంటోనీ’ క్రేజీ ట్రైలర్తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. రొడ్డ కొట్టుడు మాస్ స్టైల్ విడిచిపెట్టి.. ఈసారి అతను కొంచెం కొత్తగా ట్రై చేశాడు. ఒక ఫోన్ ద్వారా గతంలోని వ్యక్తులతో మాట్లాడే కాన్సెప్ట్తో ఈ సినిమా తెరకెక్కింది. ఈ వెరైటీ కథను మాస్ స్టయిల్లో డీల్ చేసిన దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్.. ప్రేక్షకులను బాగానే ఎంటర్టైన్ చేశాడు.
ఇందులో కొన్ని క్రేజీ ఎపిసోడ్లు ప్రేక్షకులను బాగానే అలరించాయి. కాకపోతే ఓవర్ ద టాప్ నరేషన్.. సినిమా అంతా గోల గోలగా ఉండటం ప్రతికూలాంశాలు. ఈ చిత్రానికి తెలుగులో యావరేజ్ టాక్ వచ్చింది. ఓపెనింగ్స్ కూడా ఓ మోస్తరుగా వచ్చాయంతే. ఈ కథను కొంచెం సటిల్గా డీల్ చేసి ఉంటే మన ప్రేక్షకులు కూడా బాగానే ఆదరించేవారేమో. మొత్తంగా మనదగ్గర ‘మార్క్ ఆంటోనీ’ యావరేజ్ అనిపించుకుంది.
కానీ తమిళంలో మాత్రం ‘మార్క్ ఆంటోనీ’ ఇరగాడేసింది. విశాల్ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్స్ తెచ్చుకోవడమే కాదు.. ఓవరాల్ వసూళ్లలోనూ కెరీర్ రికార్డు ఇచ్చింది. తొలిసారిగా వంద కోట్ల క్లబ్బును విశాల్కు పరిచయం చేసింది. విడుదలైన మూడో వారాలకు కూడా బాగా ఆడుతున్న ఈ చిత్రం తాజాగా వంద కోట్ల మార్కును అందుకుంది. విశాల్ రేంజికి ఇది పెద్ద అచీవ్మెంటే.
‘మార్క్ ఆంటోనీ’ తమిళ జనాలకు విపరీతంగా నచ్చేసిందనడానికి ఇది రుజువు. విశాల్ను మించి ఇందులో ఎస్.జె.సూర్య హైలైట్ అయ్యాడు. అతడితో ముడిపడ్డ కొన్ని ఎపిసోడ్లను తమిళ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. సిల్క్ స్మిత ఎపిసోడ్కు కూడా వాళ్లు బాగా కనెక్టయ్యారు. మూడు వారాల తర్వాత కూడా ‘మార్క్ ఆంటోనీ’కి వసూళ్లు నిలకడగా ఉండటం విశేషం. ఇటీవలే ఈ చిత్రాన్ని హిందీలోనూ రిలీజ్ చేశాడు విశాల్. ఐతే అక్కడ సెన్సార్ కోసం లంచం ఇవ్వాల్సి రావడంపై విశాల్ ఫిర్యాదు చేయడం.. సోషల్ మీడియాలో దీని గురించి పోస్ట్ పెట్టడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే.
This post was last modified on October 3, 2023 3:20 pm
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…
అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…
మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…
ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…
సినీ రంగంలో మహిళలు నటనలోకి పెద్ద సంఖ్యలోనే వస్తారు కానీ.. టెక్నికల్ సైడ్ వెళ్లే వాళ్లు తక్కువ. అందులోనూ దర్శకత్వం వైపు అడుగులు…
పెద్ది వాయిదా గురించి కథనాలు వస్తూనే ఉన్నాయి. లేట్ లేదని రాకాస ప్రమోషన్ వీడియోలో రామ్ చరణ్ స్వయంగా చెప్పినా…