మాస్ మహారాజా స్పీడ్ ప్రస్తుతం ఎవరికీ లేదన్నది వాస్తవం. ఈ ఏడాది ప్రారంభంలో చిరంజీవితో కలిసి వాల్తేరు వీరయ్య రూపంలో భారీ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న రవితేజ దసరాకి టైగర్ నాగేశ్వరరావుగా రాబోతున్న సంగతి తెలిసిందే. సుప్రసిద్ధ స్టువర్ట్ పురం ప్రాంతానికి చెందిన ఒక నిజ జీవిత దొంగ కథతో వంశీ దర్శకత్వంలో రూపొందిన ఈ పీరియాడిక్ డ్రామాను అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. ఇవాళ ముంబైలో జరిగిన ఒక గ్రాండ్ ఈవెంట్ ద్వారా ట్రైలర్ లాంచ్ జరిగింది. అక్టోబర్ 20 విడుదల కాబోతున్న టైగర్ నాగేశ్వరరావు రవితేజకు మొదటి ప్యాన్ ఇండియా మూవీ.
దశాబ్దాల క్రితం స్టువర్ట్ పురం అనే ఊరు దొంగలకు ప్రసిద్ధి. ఎక్కడ ఎవరు లూటీలు చేయాలనేది ముందే వేలం పాట పాడుకుని మరీ దోపిడీలకు పాల్పడుతూ ఉంటారు. ఆ తెగకు చెందినవాడే నాగేశ్వరరావు(రవితేజ). భయం తెలియని వ్యక్తిత్వం. కొందరు చేసిన కుట్రల వల్ల జైలుకు వెళ్లాల్సి వస్తుంది. అప్పటిదాకా ఒకరి మాట వినే పరిస్థితి నుంచి దేనికైనా తెగించే స్థాయికి చేరుకుంటాడు. ఈ జాతిని వేటాడటమే పనిగా పెట్టుకున్న పోలీస్ ఆఫీసర్(జిస్సుసేన్ గుప్తా)అక్కడికి వస్తాడు. ఈలోగా నాగేశ్వరరావు ఏకంగా సిఎం, పీఎంలు ఆలోచించే రేంజ్ కు చేరుకుంటాడు. అదెలానేది తెరమీద చూడాలి.
విజువల్స్ అప్పటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా టెర్రిఫిక్ గా ఉన్నాయి. ఆర్ట్ వర్క్ పనితనం, జివి ప్రకాష్ నేపధ్య సంగీతం పోటీ పడ్డాయి. రవితేజ గతంలో చూడని గెటప్ లో రెండు షేడ్స్ లో అదరగొట్టాడు. మనకు పరిచయమే లేని ఒక సరికొత్త నేర ప్రపంచంలోకి దర్శకుడు వంశీ తీసుకెళ్లిన తీరు థియేటర్ లో మంచి ఎక్స్ పీరియన్స్ ఇవ్వనుంది. నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటించగా నాజర్, అనుపమ్ ఖేర్, రేణు దేశాయ్ తదితరుల క్యాస్టింగ్ పెద్దదే ఉంది. కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కాకుండా హాలీవుడ్ స్టాండర్ లో కనిపిస్తున్న టైగర్ నాగేశ్వరరావు విజయదశమికి అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.
This post was last modified on October 3, 2023 2:55 pm
రేపు విడుదల కాబోతున్న ఎపిక్ ఇవాళ రాత్రి నుంచే ప్రీమియర్ షోలు వేయనుంది. హైదరాబాద్ ఒకటే కాకుండా ఏపీ, తెలంగాణ…
కొన్ని సినిమాలు థియేటర్లలో అనుకున్న స్థాయిలో అనుకున్న స్థాయిలో ఆడకపోయినా.. కొన్ని పాటలు, సన్నివేశాలు కల్ట్ స్టేటస్ తెచ్చుకుంటాయి. వర్షం…
స్థానిక సంస్థల ఎన్నికల విషయంపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తరచుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ ఎన్నికల నిర్వహణ…
స్పీకర్ ను అవమానించిన వాళ్లకు ముంబైలో దాడులకు పాల్పడిన కసబ్ కు పెద్దగా తేడా ఏమీ లేదని ముఖ్యమంత్రి రేవంత్…
వైసీపీ ఖాళీ అవుతుంది.. ఈ మాటలు తరచుగా వినిపిస్తున్నాయి. అయితే.. పోయే వారిని పోనీ.. అన్నట్టుగానే పార్టీ అధినేత జగన్…
అర్జున్ రెడ్డితో విజయ్ దేవరకొండ సంపాదించుకున్న యూత్ ఫాలోయింగ్ కి అదనంగా ఫ్యామిలీ ఆడియన్స్ ని జోడించిన బ్లాక్ బస్టర్…