సినిమా తీయడం ఒక ఎత్తయితే దాన్ని సరిగా ప్రమోట్ చేసుకోవడం మరో ఎత్తు. ఎప్పటికప్పుడు అభిమానులకు అప్డేట్స్ ఇస్తూ మీడియాతో టచ్ లో ఉండటం వల్ల ఫలానా మూవీ వస్తోందనే విషయం ఆడియన్స్ మెదడులో క్రమం తప్పకుండా ఉంటుంది. దీనికి చిన్నా పెద్దా తేడా లేదు. అందరూ ఒకటే. వంద కోట్లతో తీసి కేవలం పబ్లిసిటీ సరిగా చేయని కారణంగా దారుణమైన ఓపెనింగ్స్ వచ్చిన చిత్రాలు ఈ ఏడాదిలోనే ఉన్నాయి. న్యాచురల్ స్టార్ నాని అందుకే ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాడు. నిర్మాతలు కూడా దానికి అనుగుణంగా ముందస్తుగా ప్లాన్ చేసుకుంటారు.
హాయ్ నాన్న మార్చుకోవాల్సిన విడుదల తేదీ ఇంకా ఖరారు చేసుకోనప్పటికీ ప్రచారం మాత్రం కొనసాగిస్తోంది. ఇటీవలే రిలీజ్ చేసిన మొదటి లిరికల్ వీడియో సమయమాకి మంచి స్పందన రాగా తాజాగా తండ్రి కూతుళ్ళ మధ్య వచ్చే గాజుబొమ్మ పాటను వదిలేముందు చిన్న ప్రమోషన్ వీడియోని ఆకట్టుకునేలా డిజైన్ చేయించారు. విజయ్ దేవరకొండ ఖుషితో హిట్ డెబ్యూ అందుకున్న హేశం అబ్దుల్ వహబ్ దీనికి సంగీతం సమకూరుస్తున్న సంగతి తెలిసిందే. నాని ప్రత్యేకంగా ప్రోమోల కోసమే షూటింగులు చేయడం ఇక్కడ గమనించాల్సిన అంశం. ప్రకటన స్టేజి నుంచే దీన్ని ఫాలో అవుతున్నారు.
సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న హాయ్ నాన్న ద్వారా శౌర్యువ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. విజువల్స్ గట్రా చూస్తుంటే అనుభవం ఉన్న రీతిలో హ్యాండిల్ చేస్తున్నట్టు అనిపిస్తోంది. డిసెంబర్ మొదటి వారంలో రావాలా లేక ఫిబ్రవరికి షిఫ్ట్ అవ్వాలా అనే విషయంలో నాని టీమ్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తాము లాక్ చేసుకున్న డేట్ కి సలార్ చొచ్చుకు వచ్చేయడంతో హాయ్ నాన్నకు పోస్ట్ పోన్ తప్ప వేరే మార్గం లేకపోయింది. ఇంకో వారం లోపు దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఏమైనా నాన్న ప్లానింగ్ మాత్రం బాగుంది.
This post was last modified on October 3, 2023 1:17 pm
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…