బాక్సాఫీస్కు ఎప్పుడు ఊపొస్తుందో.. ఎప్పుడు అది డల్ అవుతుందో తెలియదు. కొన్నిసార్లు టైమింగ్ కలిసొచ్చి యావరేజ్గా ఆడాల్సిన సినిమాలు కూడా పెద్ద హిట్టయిపోతుంటాయి. కొన్నిసార్లు మంచి సినిమాలు కూడా అన్యాయం అయిపోతుంటాయి. ప్రస్తుతం బాక్సాఫీస్ కొంచెం స్లంప్లోనే నడుస్తోంది. కొన్ని వారాలుగా సరైన సినిమాలే లేవు. బాక్సాఫీస్ డల్లుగా నడుస్తోంది.
గత వీకెండ్లో రిలీజైన కొత్త చిత్రాల్లో ‘స్కంద’ ఓ మోస్తరుగా ఆడుతోందంతే. చంద్రముఖి-2, పెదకాపు సినిమాలు వాషౌట్ అయిపోయాయి. ఇక వచ్చే వారాంతంలో లెక్కకు మిక్కిలి సినిమాలు రిలీజవుతున్నాయి. ఒక వీకెండ్లో రెండో మూడో సినిమాలు రిలీజైతే ప్రేక్షకుల దృష్టి వాటి మీద ఉంటుంది. కానీ ఒకేసారి అరడజనుకు పైగా సినిమాలు రిలీజైతే పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది.
అసలే బాక్సాఫీస్ స్లంప్ నడుస్తున్న టైం. ఇలాంటపుడు పరిమితికి మించి సినిమాలు రిలీజైతే వాటిలో కొన్ని ప్రేక్షకుల దృష్టిలోనే పడకుండా వెళ్లిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ వారం రాబోయే చిత్రాలు అలాంటి ప్రమాదాన్నే ఎదుర్కొంటున్నాయి. ఉన్నంతలో ‘రూల్స్ రంజన్’ పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉంది. దాని ట్రైలర్ చూస్తే మంచి కామెడీ ఎంటర్టైనర్ లాగా కనిపించింది. సినిమాకు కొంచెం బజ్ ఏర్పడింది. ‘మ్యాడ్’ కూడా యూత్ దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సినిమా మీద టీం చాలా కాన్ఫిడెంట్గా ఉంది. మిగతా సినిమాలకు మాత్రం ఆశించిన బజ్ కనిపించడం లేదు.
‘మామా మశ్చీంద్ర’కు ఎందుకో సరైన బజ్ క్రియేట్ కాలేదు. దీని ట్రైలర్ పర్వాలేదనిపించింది. ఇక ‘మంత్ ఆఫ్ మధు’ ట్రైలర్ చాలా బాగున్నా స్టార్ కాస్ట్ లేకపోవడం, సినిమా మరీ క్లాస్గా కనిపిస్తుండటం మైనస్ అయ్యేలా ఉంది. ఇంత పోటీలో ఇలాంటి సినిమాను జనం ఏమేర పట్టించుకుంటారన్నది సందేహం. తెలుగు సినిమాలకే స్కోప్ తక్కువగా ఉంటే ‘800’, ‘చిన్నా’ లాంటి డబ్బింగ్ సినిమాలు కూడా వస్తున్నాయి. వాటికి చాలినన్ని థియేటర్లు దొరకడం, ప్రేక్షకుల దృష్టిలో పడటం చాలా కష్టమే. ఇవి కాక నేనే సరోజ, రాక్షస కావ్యం అని చిన్నా చితకా చిత్రాలేవో వస్తున్నాయి.మరి ఇంత పోటీలో ప్రేక్షకుల మెప్పు పొందే సినిమాలేవో చూడాలి.
This post was last modified on October 2, 2023 6:03 pm
వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…
జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…
రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రకటనలు చేస్తానంటే ఆయనకు భారీ పారితోషకం ఇవ్వడానికి బోలెడన్ని కంపెనీలు ముందుకు వస్తాయి. కానీ…
గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…
టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…