బాక్సాఫీస్కు ఎప్పుడు ఊపొస్తుందో.. ఎప్పుడు అది డల్ అవుతుందో తెలియదు. కొన్నిసార్లు టైమింగ్ కలిసొచ్చి యావరేజ్గా ఆడాల్సిన సినిమాలు కూడా పెద్ద హిట్టయిపోతుంటాయి. కొన్నిసార్లు మంచి సినిమాలు కూడా అన్యాయం అయిపోతుంటాయి. ప్రస్తుతం బాక్సాఫీస్ కొంచెం స్లంప్లోనే నడుస్తోంది. కొన్ని వారాలుగా సరైన సినిమాలే లేవు. బాక్సాఫీస్ డల్లుగా నడుస్తోంది.
గత వీకెండ్లో రిలీజైన కొత్త చిత్రాల్లో ‘స్కంద’ ఓ మోస్తరుగా ఆడుతోందంతే. చంద్రముఖి-2, పెదకాపు సినిమాలు వాషౌట్ అయిపోయాయి. ఇక వచ్చే వారాంతంలో లెక్కకు మిక్కిలి సినిమాలు రిలీజవుతున్నాయి. ఒక వీకెండ్లో రెండో మూడో సినిమాలు రిలీజైతే ప్రేక్షకుల దృష్టి వాటి మీద ఉంటుంది. కానీ ఒకేసారి అరడజనుకు పైగా సినిమాలు రిలీజైతే పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది.
అసలే బాక్సాఫీస్ స్లంప్ నడుస్తున్న టైం. ఇలాంటపుడు పరిమితికి మించి సినిమాలు రిలీజైతే వాటిలో కొన్ని ప్రేక్షకుల దృష్టిలోనే పడకుండా వెళ్లిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ వారం రాబోయే చిత్రాలు అలాంటి ప్రమాదాన్నే ఎదుర్కొంటున్నాయి. ఉన్నంతలో ‘రూల్స్ రంజన్’ పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉంది. దాని ట్రైలర్ చూస్తే మంచి కామెడీ ఎంటర్టైనర్ లాగా కనిపించింది. సినిమాకు కొంచెం బజ్ ఏర్పడింది. ‘మ్యాడ్’ కూడా యూత్ దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సినిమా మీద టీం చాలా కాన్ఫిడెంట్గా ఉంది. మిగతా సినిమాలకు మాత్రం ఆశించిన బజ్ కనిపించడం లేదు.
‘మామా మశ్చీంద్ర’కు ఎందుకో సరైన బజ్ క్రియేట్ కాలేదు. దీని ట్రైలర్ పర్వాలేదనిపించింది. ఇక ‘మంత్ ఆఫ్ మధు’ ట్రైలర్ చాలా బాగున్నా స్టార్ కాస్ట్ లేకపోవడం, సినిమా మరీ క్లాస్గా కనిపిస్తుండటం మైనస్ అయ్యేలా ఉంది. ఇంత పోటీలో ఇలాంటి సినిమాను జనం ఏమేర పట్టించుకుంటారన్నది సందేహం. తెలుగు సినిమాలకే స్కోప్ తక్కువగా ఉంటే ‘800’, ‘చిన్నా’ లాంటి డబ్బింగ్ సినిమాలు కూడా వస్తున్నాయి. వాటికి చాలినన్ని థియేటర్లు దొరకడం, ప్రేక్షకుల దృష్టిలో పడటం చాలా కష్టమే. ఇవి కాక నేనే సరోజ, రాక్షస కావ్యం అని చిన్నా చితకా చిత్రాలేవో వస్తున్నాయి.మరి ఇంత పోటీలో ప్రేక్షకుల మెప్పు పొందే సినిమాలేవో చూడాలి.
This post was last modified on October 2, 2023 6:03 pm
ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…