ఒకే రోజు తలపడనున్న డుంకీ, సలార్ ల గురించి మేమంటే మేము గొప్పని సోషల్ మీడియా ఫ్యాన్స్ తెగ చించేసుకుంటున్నారు. నిన్న సలార్ కన్నడ మూవీ ఉగ్రం రీమేకనే ప్రచారాన్ని తెగ తిప్పేశారు. అది ప్రశాంత్ నీల్ మొదటి సినిమా కావడమే దీనికి కారణం. గతంలో ఇంకా రెగ్యులర్ షూటింగ్ మొదలుకాకముందు సంగీత దర్శకుడు రవి బస్రూర్ అన్న మాటలను వైరల్ చేస్తూ ఫ్యాన్ వార్ ని కొత్త ఎత్తుకు తీసుకెళ్తున్నారు. మరి ప్రభాస్ అభిమానులు ఊరుకుంటారా. రాజ్ కుమార్ హిరానీని టార్గెట్ చేస్తూ ఆయన గత, ప్రస్తుత చిత్రాలు దేనికి రీమేకో ఆధారాలు బయటికి తీస్తున్నారు
డుంకీ హాలీవుడ్ మూవీ సిఐఏ ఆధారంగా తీస్తున్నారని, అదొక్కటే కాకుండా డాంకీ ఫ్లైట్, దుల్కర్ సల్మాన్ కామ్రేడ్ ఇన్ అమెరికాల నుంచి స్ఫూర్తి పొందారని పోస్ట్లు పెడుతున్నారు. అసలు సినిమానే చూడకుండా ఎలా అంటున్నారంటే వలసదారుల కష్టాలను ఆధారంగా చేసుకుని హిరానీ డుంకీ తీస్తున్నారనే లీక్ ముంబై వర్గాల్లో గతంలోనే వచ్చింది. దాన్ని ఆధారంగా చేసుకునే ఇప్పుడీ కామెంట్లు చేస్తున్నారు. అంతే కాదు పీకే, 3 ఇడియట్లో పలు సన్నివేశాలను ఉటంకిస్తూ అవి ఏ ఇంగ్లీష్ సినిమాల నుంచి తీసుకొచ్చారో వీడియోలు, పోస్టర్లతో సహా ట్వీట్ చేస్తూ తగిన కౌంటర్లు ఇస్తున్నారు.
ఈ మొత్తం వ్యవహారంలో అవసరం లేని విషయాలన్నీ బయటికి వస్తున్నాయి. డుంకీ, సలార్ పోటీ అనివార్యమని తేలిపోయాక పరస్పరం రెండు బాగా ఆడాలని కోరుకోవడం తప్ప ఎవరైనా ఏమి చేయలేరు. అది వదిలిపెట్టి దర్శకుల రీమేక్ వ్యవహారాలను రచ్చకీడ్చడం వల్ల ఎలాంటి లాభం లేదు. పైగా రిలీజయ్యాక వాటిలో వేరే కథలంటే ట్రోల్ చేస్తున్న వాళ్లే కామెడీ అయిపోతారు. ఇవి ఎన్ని జరుగుతున్నా హిరానీ, నీల్ ఇద్దరూ తమ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఎవరైనా ఆన్ లైన్లో ఈ రచ్చ జరుగుతోందని చెప్పినా వినే పరిస్థితిలో ఎంత మాత్రం లేరన్నది వాస్తవం.
This post was last modified on October 2, 2023 11:43 am
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…