ఒకే రోజు తలపడనున్న డుంకీ, సలార్ ల గురించి మేమంటే మేము గొప్పని సోషల్ మీడియా ఫ్యాన్స్ తెగ చించేసుకుంటున్నారు. నిన్న సలార్ కన్నడ మూవీ ఉగ్రం రీమేకనే ప్రచారాన్ని తెగ తిప్పేశారు. అది ప్రశాంత్ నీల్ మొదటి సినిమా కావడమే దీనికి కారణం. గతంలో ఇంకా రెగ్యులర్ షూటింగ్ మొదలుకాకముందు సంగీత దర్శకుడు రవి బస్రూర్ అన్న మాటలను వైరల్ చేస్తూ ఫ్యాన్ వార్ ని కొత్త ఎత్తుకు తీసుకెళ్తున్నారు. మరి ప్రభాస్ అభిమానులు ఊరుకుంటారా. రాజ్ కుమార్ హిరానీని టార్గెట్ చేస్తూ ఆయన గత, ప్రస్తుత చిత్రాలు దేనికి రీమేకో ఆధారాలు బయటికి తీస్తున్నారు
డుంకీ హాలీవుడ్ మూవీ సిఐఏ ఆధారంగా తీస్తున్నారని, అదొక్కటే కాకుండా డాంకీ ఫ్లైట్, దుల్కర్ సల్మాన్ కామ్రేడ్ ఇన్ అమెరికాల నుంచి స్ఫూర్తి పొందారని పోస్ట్లు పెడుతున్నారు. అసలు సినిమానే చూడకుండా ఎలా అంటున్నారంటే వలసదారుల కష్టాలను ఆధారంగా చేసుకుని హిరానీ డుంకీ తీస్తున్నారనే లీక్ ముంబై వర్గాల్లో గతంలోనే వచ్చింది. దాన్ని ఆధారంగా చేసుకునే ఇప్పుడీ కామెంట్లు చేస్తున్నారు. అంతే కాదు పీకే, 3 ఇడియట్లో పలు సన్నివేశాలను ఉటంకిస్తూ అవి ఏ ఇంగ్లీష్ సినిమాల నుంచి తీసుకొచ్చారో వీడియోలు, పోస్టర్లతో సహా ట్వీట్ చేస్తూ తగిన కౌంటర్లు ఇస్తున్నారు.
ఈ మొత్తం వ్యవహారంలో అవసరం లేని విషయాలన్నీ బయటికి వస్తున్నాయి. డుంకీ, సలార్ పోటీ అనివార్యమని తేలిపోయాక పరస్పరం రెండు బాగా ఆడాలని కోరుకోవడం తప్ప ఎవరైనా ఏమి చేయలేరు. అది వదిలిపెట్టి దర్శకుల రీమేక్ వ్యవహారాలను రచ్చకీడ్చడం వల్ల ఎలాంటి లాభం లేదు. పైగా రిలీజయ్యాక వాటిలో వేరే కథలంటే ట్రోల్ చేస్తున్న వాళ్లే కామెడీ అయిపోతారు. ఇవి ఎన్ని జరుగుతున్నా హిరానీ, నీల్ ఇద్దరూ తమ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఎవరైనా ఆన్ లైన్లో ఈ రచ్చ జరుగుతోందని చెప్పినా వినే పరిస్థితిలో ఎంత మాత్రం లేరన్నది వాస్తవం.
This post was last modified on October 2, 2023 11:43 am
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…