ఒకే రోజు తలపడనున్న డుంకీ, సలార్ ల గురించి మేమంటే మేము గొప్పని సోషల్ మీడియా ఫ్యాన్స్ తెగ చించేసుకుంటున్నారు. నిన్న సలార్ కన్నడ మూవీ ఉగ్రం రీమేకనే ప్రచారాన్ని తెగ తిప్పేశారు. అది ప్రశాంత్ నీల్ మొదటి సినిమా కావడమే దీనికి కారణం. గతంలో ఇంకా రెగ్యులర్ షూటింగ్ మొదలుకాకముందు సంగీత దర్శకుడు రవి బస్రూర్ అన్న మాటలను వైరల్ చేస్తూ ఫ్యాన్ వార్ ని కొత్త ఎత్తుకు తీసుకెళ్తున్నారు. మరి ప్రభాస్ అభిమానులు ఊరుకుంటారా. రాజ్ కుమార్ హిరానీని టార్గెట్ చేస్తూ ఆయన గత, ప్రస్తుత చిత్రాలు దేనికి రీమేకో ఆధారాలు బయటికి తీస్తున్నారు
డుంకీ హాలీవుడ్ మూవీ సిఐఏ ఆధారంగా తీస్తున్నారని, అదొక్కటే కాకుండా డాంకీ ఫ్లైట్, దుల్కర్ సల్మాన్ కామ్రేడ్ ఇన్ అమెరికాల నుంచి స్ఫూర్తి పొందారని పోస్ట్లు పెడుతున్నారు. అసలు సినిమానే చూడకుండా ఎలా అంటున్నారంటే వలసదారుల కష్టాలను ఆధారంగా చేసుకుని హిరానీ డుంకీ తీస్తున్నారనే లీక్ ముంబై వర్గాల్లో గతంలోనే వచ్చింది. దాన్ని ఆధారంగా చేసుకునే ఇప్పుడీ కామెంట్లు చేస్తున్నారు. అంతే కాదు పీకే, 3 ఇడియట్లో పలు సన్నివేశాలను ఉటంకిస్తూ అవి ఏ ఇంగ్లీష్ సినిమాల నుంచి తీసుకొచ్చారో వీడియోలు, పోస్టర్లతో సహా ట్వీట్ చేస్తూ తగిన కౌంటర్లు ఇస్తున్నారు.
ఈ మొత్తం వ్యవహారంలో అవసరం లేని విషయాలన్నీ బయటికి వస్తున్నాయి. డుంకీ, సలార్ పోటీ అనివార్యమని తేలిపోయాక పరస్పరం రెండు బాగా ఆడాలని కోరుకోవడం తప్ప ఎవరైనా ఏమి చేయలేరు. అది వదిలిపెట్టి దర్శకుల రీమేక్ వ్యవహారాలను రచ్చకీడ్చడం వల్ల ఎలాంటి లాభం లేదు. పైగా రిలీజయ్యాక వాటిలో వేరే కథలంటే ట్రోల్ చేస్తున్న వాళ్లే కామెడీ అయిపోతారు. ఇవి ఎన్ని జరుగుతున్నా హిరానీ, నీల్ ఇద్దరూ తమ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఎవరైనా ఆన్ లైన్లో ఈ రచ్చ జరుగుతోందని చెప్పినా వినే పరిస్థితిలో ఎంత మాత్రం లేరన్నది వాస్తవం.
This post was last modified on October 2, 2023 11:43 am
అగ్రరాజ్యం అమెరికా కొత్తగా సుంకాల పెంపు కారణంగా ఏపీలో ఆక్వా రంగంపై తీవ్ర ప్రభావం పడినా... కూటమి సర్కారు తీసుకున్న…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ తో కలిసి…
ఒకప్పుడు తమిళ డబ్బింగ్ సినిమాలను చూసి తెలుగులో ఇలాంటి సినిమాలు రావేంటి అని చాలా ఫీలయ్యేవాళ్లు మన ప్రేక్షకులు. అక్కడ ఎన్నో కొత్త…
మాస్ రాజా రవితేజకు గత కొన్నేళ్లలో పెద్ద హిట్ అంటే.. ధమాకానే. ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుని కూడా బ్లాక్ బస్టర్…
హైదరాబాద్ శిల్ప కళావేదికలో జరిగిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవాళ అభిమానులతో కళకళలాడిపోయింది. ఇదే నెలలో…
పాకిస్థాన్ క్రికెటర్ల మీద సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతూ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఆటతోనే కాక మాటతీరుతోనూ వాళ్లు సోషల్ మీడియాకు టార్గెట్ అవుతుంటారు.…