కెరీర్ మొదలుపెట్టింది ఫ్లాప్ సినిమాలతోనే అయినా ఒక్కసారిగా మీనాక్షి చౌదరి కెరీర్ ఊపందుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఏ ముహూర్తంలో పూజా హెగ్డే గుంటూరు కారం నుంచి తప్పుకుందో కానీ అప్పటి నుంచి ఈ అమ్మడి దశ తిరిగిపోయింది. వరసగా క్రేజీ ఆఫర్లు ముంచెత్తున్నాయి. వరుణ్ తేజ్, విశ్వక్ సేన్ ల సరసన జోడి కడుతుండగా తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ 68లో ఇద్దరు హీరోయిన్లలో ఒకరిగా ఎంపిక చేసినట్టు చెన్నై టాక్. మరో భామగా ప్రియాంకా అరుళ్ మోహన్ ఉండొచ్చట. ఒకరకంగా ఇది తనకు బ్రహ్మాండమైన జాక్ పాట్ అనే చెప్పాలి.
కొన్ని వారాల క్రితమే కొలై(తెలుగులో హత్య) అనే తమిళ మూవీ చేసిన మీనాక్షి చౌదరి అందులో హత్యకు గురయ్యే ఒక మాములు పాత్ర పోషించింది. విజయ్ ఆంటోనీ హీరో అయినప్పటికీ దారుణంగా డిజాస్టరయ్యింది. దెబ్బకు ఇంక అక్కడ ఆఫర్లు రావనుకుంటున్న టైంలో తలపతి సరసన ఛాన్స్ అంటే దశ తిరిగినట్టే. అధికారికంగా ప్రకటించలేదు. ఇక్కడ మహేష్ బాబు అక్కడ విజయ్ అంటే మాములు విషయం కాదు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో విజయ్ రెండు పాత్రలు చేస్తున్నాడు. తండ్రి కొడుకని సమాచారం. అయితే ఈ డ్యూయల్ రోల్స్ రెగ్యులర్ గా ఉండవని యూనిట్ లీక్.
మొత్తానికి హీరోయిన్ల కొరత మీనాక్షి చౌదరి లాంటి వాళ్లకు వరంగా మారుతోంది. ఇట్లు వాహనములు నిలుపరాదు. ఖిలాడీ రెండూ బాక్సాఫీస్ వద్ద నిలువునా మునిగినా అడవి శేష్ హిట్ 2లో పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేకపోయినా మీనాక్షి చౌదరి ఇంత వేగంగా స్పీడ్ అందుకోవడం విశేషమే . శ్రీలీల తప్ప ఇంకో ఆప్షన్ కనపడకుండా పోతున్న దర్శకులకు ప్రత్యాన్మయంగా కనిపిస్తోంది. విజయ్ ఇప్పుడీ సినిమా చేశాక రాజకీయాలోకి వెళ్ళిపోతాడనే ప్రచారం జోరుగా జరుగుతున్న నేపథ్యంలో ఈ 68వ సినిమాని చాలా స్పెషల్ గా అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నట్టు తెలిసింది.
This post was last modified on October 1, 2023 10:12 pm
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…