ఎనర్జిటిక్ స్టార్ రామ్ దర్శకుడు పూరి జగన్నాధ్ కాంబోలో రూపొందుతున్న డబుల్ ఇస్మార్ట్ సంగీత దర్శకుడికి సంబంధించిన సస్పెన్స్ తీరిపోయింది. ఇస్మార్ట్ శంకర్ కి అదిరిపోయే మాస్ ఆల్బమ్ తో పాటు బీజీఎంతో ప్రాణం పోసిన మణిశర్మనే ఫైనల్ గా లాక్ చేశారని తెలిసింది. ఒక పాటకు సంబంధించిన ట్యూన్ తో పాటు ఫైనల్ కంపోజింగ్ కూడా ఓకే అయిపోయిందని సమాచారం. నిజానికీ ప్రాజెక్టు ప్రకటించినప్పుడు మణిశర్మ పేరు లేదు. పూరితో ఏవో విభేదాలు ఉన్నాయని, పైగా ప్యాన్ ఇండియా మూవీ కాబట్టి హిందీ వైపు టీమ్ మొగ్గు చూపుతోందనే ప్రచారం జరిగింది.
అవేవి కాదని తేలిపోయింది. అయితే దీని వెనుక పెద్ద కసరత్తే జరిగినట్టు ఇన్ సైడ్ టాక్. ముందు తమన్, అనిరుధ్ లాంటి వాళ్ళతో మాట్లాడారు కానీ ప్రకటించిన రిలీజ్ డేట్ లోపు పనులు జరగాలంటే వాళ్ళతో కుదరదని గుర్తించి ఫైనల్ గా మెలోడీ బ్రహ్మకే ఓటేశారని అంటున్నారు. పైగా మొదటి భాగంలోని పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎంతో కొంత వాడకుండా సీక్వెల్ ని నడిపించడం కష్టం. ఒకవేళ అదే జరిగితే కాపీ రైట్స్ సమస్య వస్తుంది. ఎంత పూరి స్వంత సినిమా అయినా సరే ఆడియో కంపెనీ, మ్యూజిక్ డైరెక్టర్ అంగీకారం లేకుండా వాడుకుంటే అదో సమస్యే.
ఇవన్నీ అలోచించి మణిశర్మకే డబుల్ ఇస్మార్ట్ ఇవ్వడం మంచి నిర్ణయం. అయితే ఇటీవలి కాలంలో ఈయన తన స్థాయి సంగీతం ఇవ్వలేకపోతున్నారు. శాకుంతలం, ఆచార్య లాంటివి ఎంత డిజాస్టర్ అయినా కనీసం వాటిలో పాటలు పర్వాలేదనిపించుకున్నా బాగుండేది. అదీ జరగలేదు. సో ఇప్పుడు పూరి మణితో ఎలాంటి అవుట్ ఫుట్ రాబట్టుకుంటాడనేది కీలకం. తగినంత సమయం దొరుకుతుంది కాబట్టి బెస్ట్ ఆశించవచ్చు. 2024 మార్చి 8 విడుదల కాబోతున్న డబుల్ ఇస్మార్ట్ లో సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ కీలక భాగం పూర్తి చేశారు కూడా.
This post was last modified on October 1, 2023 12:59 pm
ఏపీ మహిళలకు రాష్ట్రంలోని కూటమి సర్కారు ఓ అదిరిపోయే బహుమానాన్ని అందించింది. రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలు పండించిన వ్యవసాయ, వ్యవసాయేతర…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యలో అభియోగాలు ఎదుర్కొంటూ..అప్రూవర్గా మారిన షేక్ దస్తగిరి భార్య షాబానాపై…
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ప్యాన్ ఇండియా మూవీ కింగ్…
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఇంటిలోకి ఓ ఆగంతకుడు ప్రవేశించిన విషయం ఆదివారం హైదరాబాద్…
ఏఐ.. ఏఐ.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే మాట. దాని సాయంతో అద్భుతాలు చేస్తోంది యువతరం. ఐతే దీన్ని వినోదం…
బీజేపీకి ఉత్తరాదిలో ఉన్న బలం.. దక్షిణాదికి వచ్చే సరికి లేకుండా పోయింది. నిజానికి బండి సంజయ్, కిషన్రెడ్డి, పురందేశ్వరి వంటివారు…