నిన్న విడుదలైన పెదకాపు 1 వసూళ్లు ట్రేడ్ కి పెద్ద షాక్ ఇచ్చాయి. రిలీజ్ కు ముందు భారీ అంచనాలు లేకపోయినా ట్రైలర్ చూసిన ఆడియన్స్ అంతో ఇంతో మొదటి రోజు వస్తారనే ధీమా టీమ్ లో కనిపించింది. కానీ ఓపెనింగ్ గ్రాస్ కనీసం పాతిక లక్షలైనా రాకపోవడం ఆందోళన కలిగించే విషయమే. పైగా పబ్లిక్ టాక్, రివ్యూలు ఏమంత ఆశాజనకంగా లేకపోవడంతో వీకెండ్ మీద పెద్దగా నమ్మకం పెట్టుకోవడానికి లేకుండా పోయింది. స్కందకు సైతం బ్యాడ్ టాక్ ఉన్నప్పటికీ మాస్ కంటెంట్ తో పాటు రామ్ బ్రాండ్ జనాన్ని థియేటర్ల దాకా తీసుకొస్తోంది. అదే ఫస్ట్ ఆప్షన్ గా మారిపోయింది.
కానీ పెదకాపు 1 విషయంలో రివర్స్ కావడం ఎవరూ ఊహించనిది. రెండు రోజుల ముందే ప్రీమియర్లు వేసినా లాభం లేకపోయింది. ప్రివ్యూలు చూసిన వాళ్ళు చాలా బాగుందని సోషల్ మీడియాలో ప్రమోట్ చేసినా దాని ప్రయోజనం టికెట్ కౌంటర్ల దగ్గర కనిపించలేదు. శ్రీకాంత్ అడ్డాల పూర్తిగా సీరియస్ జానర్ కి షిఫ్ట్ అయిపోవాలనే ఆలోచన మంచిదే కానీ కొత్త హీరోతో ఇంత పెద్ద కాన్వాస్ మీద స్లో నెరేషన్ తో మెప్పించాలనుకున్న ప్రయత్నం బెడిసి కొట్టింది. చాలా చోట్ల పట్టుమని పాతిక మంది కూడా రాలేని షోలు ఫస్ట్ డేనే నమోదయ్యాయని డిస్ట్రిబ్యూటర్లు టెన్షన్ పడ్డారు.
సుమారు పన్నెండు కోట్ల దాకా టార్గెట్ పెట్టుకున్న పెదకాపు 1 ఫైనల్ గా భారీ నష్టాలు తప్పేలా లేవు. దీని ప్రభావం తర్వాత ప్లాన్ చేసుకున్న సీక్వెల్స్ మీద ఉంటుంది. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మొత్తం మూడు భాగాలు ప్లాన్ చేసుకున్నారు. ఇలాంటి వాటికి ఫస్ట్ పార్ట్ హిట్ అయితేనే తర్వాత వాటికి బజ్, బిజినెస్ రెండూ వస్తాయి. కానీ పెదకాపుకి అలా జరిగే ఛాన్స్ లేకపోవడంతో నిర్మాత మిర్యాల రవీంద్రరెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. ముఖ్యంగా విపరీతమైన డెప్త్ ఉన్న కథని కొత్త హీరో మీద చేయడం పెద్ద రిస్క్ అయిపోయింది. స్టార్ హీరో అయ్యుంటే రిజల్ట్ కొంచెం బెటర్ గా ఉండేది.
This post was last modified on September 30, 2023 5:14 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…