దక్షిణాదిలో అత్యధిక డిమాండ్ ఉన్న సంగీత దర్శకుడిగా అనిరుద్ రవిచందర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమి లేదు. వరస బ్లాక్ బస్టర్లతో తన డిమాండ్ ని పీక్స్ కి చేర్చుకుంటున్నాడు. కమల్ హాసన్, రజనీకాంత్, షారుఖ్ ఖాన్ లాంటి సీనియర్ మోస్ట్ హీరోలకు ఇండస్ట్రీ హిట్లు దక్కేలా చేయడంతో ఇతని పాత్ర చాలా కీలకం. అయితే తనతో పని చేయించుకునే విషయంలో దర్శకులు ఎలా ఉండాలనే దానికి అతనే కొన్ని ఉదాహరణలు చెబుతున్నాడు. ఇటీవలే ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు.
అవేంటో చూద్దాం. జైలర్ స్క్రిప్ట్ రాసుకున్నాక దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ అడిగింది ఒక్క పాటే. అది కూడా ఫస్ట్ హాఫ్ లో ఫ్యామిలీ సెంటిమెంట్ బ్యాక్ డ్రాప్ లో వచ్చేది. రికార్డింగ్ కూడా అదొక్కటే చేశారు. షూటింగ్ పూర్తయి రఫ్ కట్ చూశాక ఇంకో రెండు పాటలు పెట్టే ఛాన్స్ ఉందని అర్థమై టైగర్ కా హుకుం, తమన్నా కావాలయ్యా జోడించారు. హుకుం పదాన్ని సూపర్ స్టార్ చెప్పిన విధానం చూశాక దాని మీద ట్యూన్ కంపోజ్ చేసి ఓకే చేయించుకున్నాడు అనిరుధ్. ఇలా అదనంగా ఏవైతే మూడు సాంగ్స్ వచ్చి చేరాయో చివరికి అవే ఛార్ట్ బస్టర్స్ గా నిలవడం కొసమెరుపు.
ఇది నెల్సన్ ఇచ్చిన స్వేచ్ఛ వల్లే జరిగిందని అనిరుద్ చెప్పుకొచ్చాడు. లోకేష్ కనగరాజ్ తాను ఏది ఇచ్చినా ఓకే చేస్తాడని, విక్రమ్ కు బ్యాక్ గ్రౌండ్ అయ్యాక ఫైనల్ కాపీ చూశాడని అప్పటిదాకా మధ్యలో పనిలా జరుగుతోందని కూడా అడగలేదట. అట్లీ తన ప్రపంచాన్ని వివరించి వదిలేస్తాడని అందుకే తనకు స్పెషల్ గా ఇస్తానని అన్నాడు. సో ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే కుర్రాడికి ఎంత ఫ్రీడం ఇస్తే అది బెస్ట్ రాబట్టుకోవచ్చన్న మాట. ఇప్పుడిది ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ దేవర, విజయ్ దేవరకొండ 14లకు సంగీత దర్శకుడు తనే కాబట్టి ఈ టిప్స్ ఫాలో అయితే బెటరేమో
This post was last modified on September 30, 2023 11:16 am
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
బారత ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ... వరుసబెట్టి మూడు పర్యాయాలు దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాకుండా దేశానికి అత్యధిక…
కొత్త నెల వచ్చేసింది. సంక్రాంతి అయిపోయాక ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా జనాలు రాక థియేటర్లు అలో లక్ష్మణా అంటున్న…
జంతర్ మంతర్ ఆందోళనలో విద్యార్థులు తనను దుషించారని ప్రధాని మోదీ శుక్రవారం రాత్రి విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో…
నేటి తరం రాజకీయ నాయకులలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కుమార్ స్టైలే వేరు. నిబద్దత కలిగిన నాయకుడిగా ఎదిగినప్పటికి…