బాహుబలి, కేజీఎఫ్, పుష్ప లాంటి భారీ చిత్రాలు రెండేసి భాగాలుగా రావడం మంచి ఫలితాన్నివ్వడంతో చిన్న, మీడియం రేంజ్ సినిమాలకు కూడా సెకండ్ పార్ట్, సీక్వెల్స్ తీయడం మామూలైపోయింది. ఐతే సినిమా రిజల్ట్ ఏంటో చూడకుండా అందరూ సీక్వెల్స్ అనౌన్స్ చేస్తుండటంతో సమస్య తప్పట్లేదు. అసలు సినిమాలే సరిగా ఆడనపుడు.. ఇంక సీక్వెల్స్ ఏం పట్టాలెక్కుతాయి? గత ఏడాది రవితేజ సినిమా రామారావు ఆన్ డ్యూటీ ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో తెలిసిందే.
దానికి కూడా సీక్వెల్ హింట్ ఇచ్చాడు దర్శకుడు. సినిమా ఫలితం చూశాక సీక్వెల్ ఊసే ఎత్తలేదు. ఈ ఏడాది కాలంలో మరి కొన్ని చిత్రాలకు ఇలా సీక్వెల్స్, సెకండ్ పార్ట్స్ అనౌన్స్ చేసి తర్వాత వెనక్కి తగ్గారు. ఈ వారం సినిమాల విషయంలోనూ అలాగే జరిగేలా ఉంది. రామ్-బోయపాటి శ్రీనుల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన స్కంద మూవీ గురువారం విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.
మాస్ ప్రేక్షకులు సినిమాకు కొంతమేర కనెక్ట్ అయ్యారు కానీ.. సినిమాలో పెద్దగా విషయం లేదు. సామాన్య ప్రేక్షకులకు సినిమా చూసి తలపోటు వచ్చేసింది. కాంబినేషన్ క్రేజ్ వల్ల, పక్కా మాస్ మూవీ కావడం వల్ల ఓపెనింగ్స్ అయితే బాగానే వచ్చాయి. కానీ సినిమా వీకెండ్ తర్వాత నిలవడం కష్టమే అనిపిస్తోంది. కథలో ఏ విశేషం లేని సినిమాకు సీక్వెల్ తీయడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు.
రిజల్ట్ కూడా సీక్వెల్ను నిర్దేశిస్తుంది. అంతిమంగా స్కంద యావరేజ్ స్థాయిని దాటడం కష్టమే. కాబట్టి సీక్వెల్ ఆలోచన అటకెక్కినట్లే. ఇక శ్రీకాంత్ అడ్డాల కొత్త సినిమా పెదకాపును రెండు మూడు భాగాలుగా తీయాలనుకున్నాడు. అందుకే ముందుగా పెదకాపు-1 అని రిలీజ్ చేశాడు. కానీ ఈ సినిమా కూడా నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. పేరున్న హీరో కూడా లేకపోవడంతో సరైన ఓపెనింగ్స్ కూడా లేవు. సినిమాకు కమర్షియల్గా చేదు అనుభవం తప్పేలా లేదు. ఇప్పుడు పెట్టిన పెట్టుబడే వేస్ట్ అయ్యేలా ఉన్నపుడు ఇక దీనికి సీక్వెల్ ఎలా తీస్తారు?
This post was last modified on September 30, 2023 10:01 am
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…