Movie News

16 ఏళ్ల తర్వాత.. మళ్లీ ఆ కాంబినేషన్?

అక్కినేని నాగార్జునను నెవర్ బిఫోర్ అన్నట్లుగా చాలా కొత్తగా ప్రెజెంట్ చేసిన దర్శకుల్లో పూరి జగన్నాథ్ ఒకరు. వీళ్లిద్దరి కలయికలో వచ్చిన తొలి సినిమా ‘శివమణి’ అప్పట్లో ఓ సెన్సేషన్. బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరు విజయం సాధించిన ఈ చిత్రానికి.. విడుదలకు ముందు బంపర్ క్రేజ్ వచ్చింది.

ఆ సినిమాలో నాగ్ క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా, పూరి స్టయిల్లో కొంచెం తిక్క తిక్కగా ఉండి ప్రేక్షకుల్ని బాగా అలరించింది. సినిమాకు హైలైట్ హీరో పాత్రే. దీని తర్వాత నాగ్, పూరి కలిసి ‘సూపర్’ పేరుతో మరో భారీ చిత్రం చేశారు. కానీ ఆ చిత్రం అంచనాల్ని అందుకోలేకపోయింది.

కానీ అందులోనూ నాగ్ చాలా కొత్తగా, స్టైలిష్‌గా కనిపించాడు. ఆ తర్వాత నాగ్-పూరి కాంబినేషన్ కోసం ఎదురు చూసిన అభిమానులకు నిరాశ తప్పలేదు. ఐతే త్వరలోనే వీళ్లిద్దరూ మళ్లీ కలుస్తున్నారని తాజాగా ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

గత ఏడాది ‘ఇస్మార్ట్ శంకర్’తో హిట్టు కొట్టి బౌన్స్ బ్యాక్ అయిన పూరి.. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ‘ఫైటర్’ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా లేకుంటే ఈ సినిమా ఇప్పటికే పూర్తి కావాల్సింది. కానీ ప్రస్తుత పరిస్థితుల వల్ల వచ్చే ఏడాది ప్రథమార్ధంలోనే సినిమా పూర్తయి విడుదలయ్యేలా కనిపిస్తోంది. దీని తర్వాత పూరి చేయబోయే సినిమాల గురించి రకరకాల వార్తలొచ్చాయి.

ఆయన చిరు కోసం, బాలయ్య కోసం కథలు రాస్తున్నట్లు వార్తలొచ్చాయి. కానీ ఈ కాంబినేషన్లు ఏవీ ఓకే కాలేదు. తాజా సమాచారం ప్రకారం పూరి.. నాగ్‌ కోసం కథ రెడీ చేశాడని.. అక్కినేని హీరో కూడా లైన్ విని ఓకే అన్నాడని.. వీళ్లిద్దరి కలయికలో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ రాబోతోందని అంటున్నారు. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ఈ సినిమా పట్టాలెక్కుతుందని అంటున్నారు. ఈలోపు ‘వైల్డ్ డాగ్’తో పాటు ప్రవీణ్ సత్తారు సినిమాను కూడా నాగ్ పూర్తి చేస్తాడట.

This post was last modified on August 24, 2020 4:56 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తారక్ ఫ్యాన్స్‌కు ఆ రోజు నిద్ర ఉండదు

మే నెల అంటే నందమూరి అభిమానులకు చాలా స్పెషల్. ఈ నెలలోనే లెజెండరీ నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక…

29 minutes ago

‘పోకిరి’లో ఆ ట్రాక్ పూరి తీసేద్దామనుకుంటే..

టాలీవుడ్ ఆల్ టైం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ‘పోకిరి’ ఒకటి. 2006 వేసవిలో విడుదలైన ఈ చిత్రం అప్పటి కలెక్షన్లు,…

2 hours ago

ఇక రాంబాబు రానట్టే

సౌత్ ఇండియాలో మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్‌లో ఒకటైన ‘దృశ్యం-3’ ఇంకో పది రోజుల్లోపే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఏప్రిల్ 2కే…

3 hours ago

వెంకీ మాట విన‌క‌పోవ‌డంతోనే ఆ ఫ్లాప్

తెలుగు సినీ చ‌రిత్ర‌లోనే అత్యంత హైప్ మ‌ధ్య విడుద‌లైన చిత్రాల్లో.. దేవిపుత్రుడు ఒక‌టి. 2001 సంక్రాంతికి మృగ‌రాజు, న‌ర‌సింహ‌నాయుడు లాంటి…

5 hours ago

మూకుమ్మడిగా మహేష్ సినిమాలను పిండుతున్నారు

రీ రిలీజ్ ట్రెండ్ ఎక్కడికి వెళ్తుందో అర్థం కావడం లేదు. ఒక నోస్టాల్జియా ఫీలింగ్ ఇవ్వడం కోసం మొదలైన ఈ…

7 hours ago

సోషల్ మీడియా వేరే ప్రపంచం కాదే

ఈ వారం విడుదల కాబోతున్న వీరభద్రుడుకి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. దర్శకుడు ఆర్జె బాలాజీ కొన్ని…

11 hours ago