Movie News

పాపం సిద్దార్థ్ ని బయటికి పంపించేశారు

కొన్నిసార్లు రాజకీయ పరిణామాలకు సినిమా హీరోలు బలి కావాల్సి ఉంటుంది. బొమ్మరిల్లు సిద్ధార్థ్ కు అలాంటి  పరిస్థితి ఎదురయ్యింది. తన తాజా చిత్రం చిత్తా ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో డబ్బింగ్ చేశారు కానీ పోటీ వల్ల రిలీజ్ ని వాయిదా వేశారు. దీని ప్రమోషన్లలో భాగంగా సిద్దు బెంగళూరు వెళ్లి అక్కడో ప్రెస్ మీట్ కు హాజరయ్యాడు. ఇంకా సమావేశం మొదలుకాకుండానే కావేరి జలాల కోసం పోరాడుతున్న కొందరు సామజిక కార్యకర్తలు తనను మాట్లానివ్వకుండా అడ్డుపడి బయటికి వెళ్లే దాకా వదల్లేదు. మీడియా సర్దిచెప్పాలని చూసినా లాభం లేకపోయింది.

ప్రస్తుతం కర్ణాటక తమిళనాడు మధ్య కావేరి జలాల వివాదం తీవ్ర స్థాయిలో రగులుతోంది. ఏకంగా రాష్ట్ర బందులకు పిలుపు ఇచ్చే దాకా పరిస్థితి చేయి దాటిపోయింది. ఈ నేపథ్యంలో అరవ సినిమాలను ప్రోత్సహించవద్దంటూ కన్నడ సంఘాలు పిలుపునిస్తున్నాయి. కొన్ని థియేటర్లలో చంద్రముఖి 2, ఇరైవన్, చిత్తాల స్క్రీనింగ్ లు కూడా ఆపారట. ఇప్పుడు సిద్దార్థ్ ని ఏకంగా ప్రెస్ మీట్ నుంచి పంపేయడం కోలీవుడ్ వర్గాలను ఆగ్రహానికి గురి చేస్తోంది. కళాకారులకు బాషతో సంబంధం ఉండదని, అలాంటప్పుడు ఇలా ఉద్దేశపూర్వకంగా అవమానించడం తప్పని భగ్గుమంటున్నాయి.

కావేరి కాంట్రావర్సీ కొత్త కాదు కానీ తాజాగా పరిణామాలు తీవ్రతకు అద్దం పడుతున్నాయి. గతంలో ఇదే అంశం మీద రెండు వైపులా నటీనటులు ధర్నాలు, నిరాహారదీక్షలు చేశారు. అయినా శాశ్వత పరిష్కారం కలిగించడంలో ప్రభుత్వాలు విఫలమవుతూ వచ్చాయి. ఇప్పుడు చూస్తేనేమో కెమెరాల సాక్షిగా సిద్దార్థ్ లాంటి పేరున్న హీరోలను సైతం వెళ్ళిపోమని ఆదేశాలిస్తున్నారు. అతను మాత్రం సంయమనం కోల్పోకుండా కూల్ గా అక్కడి నుంచి సెలవు తీసుకున్న వీడియో బాగా చక్కర్లు కొడుతోంది. దీని గురించి పలువురు తమిళ నటులు దర్శక నిర్మాతలు ఘాటుగా స్పందించే అవకాశముంది.

This post was last modified on September 28, 2023 10:49 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

బాలయ్య బ్యాక్ టు డ్యూటీ

ఎన్నికలు అయిపోయాయి. ఫలితాలు ఇంకో పద్దెనిమిది రోజుల్లో రాబోతున్నాయి. ఎవరికి వారు విజయం పట్ల ధీమాగా ఉన్నారు. అధికార పార్టీ,…

55 mins ago

పూజా హెగ్డే కోరుకున్న బ్రేక్ దొరికింది

మొన్నటిదాకా టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా అత్యధిక డిమాండ్ అనుభవించిన పూజా హెగ్డే కెరీర్ ప్రారంభంలో వచ్చిన ఐరన్ లెగ్…

3 hours ago

ఆమంచి .. ఎవరి ‘కొంప’ ముంచేనో ?!

ప్రకాశం జిల్లాలో ఆమంచి కృష్ణమోహన్ రాజకీయంగా ఒక బలమైన నాయకుడే అని చెప్పాలి. అయితే తన రాజకీయ భవిష్యత్తు కోసం…

3 hours ago

అమెరికాలో వెంటాడిన మృత్యువు

తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత రెండు ప్రమాదాలు తప్పించుకుని మూడో ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. నెలల వ్యవధిలో…

3 hours ago

కోర్టు మెట్లెక్కిన జూనియర్  !

ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ 2003లో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో  681 చదరపు గజాల స్థలం సుంకు గీత అనే…

3 hours ago

ప్రభాస్ ఊరిస్తోంది దేని గురించంటే

ఒక్క చిన్న ఇన్స్ టా పోస్ట్ తో ప్రభాస్ సోషల్ మీడియాని ఊపేస్తున్నాడు. హలో డార్లింగ్స్ చివరికి చాలా ప్రత్యేకం…

4 hours ago