తరాలు మారుతున్నట్టే ఫిలిం మేకింగ్ లో కూడా బోలెడు ధోరణులు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు శంకరాభరణం లాంటి క్లాసిక్స్ ని క్లాసు మాస్ తేడా లేకుండా బ్రహ్మాండంగా ఆదరించారు. ఎర్ర సైన్యం లాంటి రెవల్యూషన్ చిత్రాలు శతదినోత్సవాలు జరుపుకున్నాయి. ఇప్పుడలాంటివి తీస్తే ఎవరూ చూడరు. అయితే వాటితో పోల్చి ఇప్పుడొచ్చే వాటిని తక్కువ చేసి చూడటం కరెక్ట్ కాదు. బాలీవుడ్ సీనియర్ మోస్ట్ నటుడు నసీరుద్దీన్ షా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. హీరో, విలన్, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఎమోషన్, సీరియస్ ఇలా ఆయన టచ్ చేయని జానర్, పాత్రలు ఏవీ లేవు.
అంత అనుభవమున్న పెద్దాయన ఇటీవలే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కొత్త సినిమాల గురించి రివ్యూల టైపులో రెండు ముక్కలు పంచుకున్నారు. అవేంటంటే పుష్ప, ఆర్ఆర్ఆర్ తనింకా చూడలేదట. హీరోయిజంని మితిమీరి ఎక్స్ ప్లాయ్ట్ చేసే ఇలాంటి వాటికి దూరంగా ఉంటానని, ఏ అజెండా లేకుండా మణిరత్నం తీసిన పొన్నియిన్ సెల్వన్ చాలా బాగా నచ్చిందని కితాబిచ్చారు. ఇక్కడ మిస్ అవుతున్న లాజిక్ ఏంటంటే చూడకుండానే సుకుమార్, రాజమౌళిని సర్టిఫై చేసిన షా గారు పొన్నియిన్ సెల్వన్ తమిళనాడులో తప్ప ఇతర రాష్ట్రాల్లో పెద్దగా ఆడలేదనే పాయింట్ మిస్సయ్యారేమో.
ఎవరు ఏ సినిమా తీసినా ప్రతి ఒక్కరికి అజెండా ఉండే తీరుతుంది. మణిరత్నం దానికి మినహాయింపు కాదు. చోళ సామ్రాజ్య చరిత్రను ప్రపంచానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే పాత్రల పేర్లు ఎంత కన్ఫ్యూజ్ చేసినా వాటితోనే అన్ని భాషల్లో రిలీజ్ చేశారు. అలాంటప్పుడు ఏ ఉద్దేశం లేదని చెప్పడం రైట్ కాదుగా. ఒకవేళ పుష్ప, ఆర్ఆర్ఆర్ లు చూశాక నచ్చలేదని చెబితే సంతోషమే. ఒకటి జాతీయ అవార్డు తీసుకొస్తే మరొకటి ఆస్కార్ కు వెళ్లి పురస్కారం అందుకుంది. మరి అది విస్మరించి అజెండా అంటూ కేవలం ఒకవైపే ఆలోచించడం కరెక్ట్ కాదేమో పెద్దాయనా.
This post was last modified on September 27, 2023 11:05 pm
నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…
సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…