తరాలు మారుతున్నట్టే ఫిలిం మేకింగ్ లో కూడా బోలెడు ధోరణులు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు శంకరాభరణం లాంటి క్లాసిక్స్ ని క్లాసు మాస్ తేడా లేకుండా బ్రహ్మాండంగా ఆదరించారు. ఎర్ర సైన్యం లాంటి రెవల్యూషన్ చిత్రాలు శతదినోత్సవాలు జరుపుకున్నాయి. ఇప్పుడలాంటివి తీస్తే ఎవరూ చూడరు. అయితే వాటితో పోల్చి ఇప్పుడొచ్చే వాటిని తక్కువ చేసి చూడటం కరెక్ట్ కాదు. బాలీవుడ్ సీనియర్ మోస్ట్ నటుడు నసీరుద్దీన్ షా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. హీరో, విలన్, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఎమోషన్, సీరియస్ ఇలా ఆయన టచ్ చేయని జానర్, పాత్రలు ఏవీ లేవు.
అంత అనుభవమున్న పెద్దాయన ఇటీవలే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కొత్త సినిమాల గురించి రివ్యూల టైపులో రెండు ముక్కలు పంచుకున్నారు. అవేంటంటే పుష్ప, ఆర్ఆర్ఆర్ తనింకా చూడలేదట. హీరోయిజంని మితిమీరి ఎక్స్ ప్లాయ్ట్ చేసే ఇలాంటి వాటికి దూరంగా ఉంటానని, ఏ అజెండా లేకుండా మణిరత్నం తీసిన పొన్నియిన్ సెల్వన్ చాలా బాగా నచ్చిందని కితాబిచ్చారు. ఇక్కడ మిస్ అవుతున్న లాజిక్ ఏంటంటే చూడకుండానే సుకుమార్, రాజమౌళిని సర్టిఫై చేసిన షా గారు పొన్నియిన్ సెల్వన్ తమిళనాడులో తప్ప ఇతర రాష్ట్రాల్లో పెద్దగా ఆడలేదనే పాయింట్ మిస్సయ్యారేమో.
ఎవరు ఏ సినిమా తీసినా ప్రతి ఒక్కరికి అజెండా ఉండే తీరుతుంది. మణిరత్నం దానికి మినహాయింపు కాదు. చోళ సామ్రాజ్య చరిత్రను ప్రపంచానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే పాత్రల పేర్లు ఎంత కన్ఫ్యూజ్ చేసినా వాటితోనే అన్ని భాషల్లో రిలీజ్ చేశారు. అలాంటప్పుడు ఏ ఉద్దేశం లేదని చెప్పడం రైట్ కాదుగా. ఒకవేళ పుష్ప, ఆర్ఆర్ఆర్ లు చూశాక నచ్చలేదని చెబితే సంతోషమే. ఒకటి జాతీయ అవార్డు తీసుకొస్తే మరొకటి ఆస్కార్ కు వెళ్లి పురస్కారం అందుకుంది. మరి అది విస్మరించి అజెండా అంటూ కేవలం ఒకవైపే ఆలోచించడం కరెక్ట్ కాదేమో పెద్దాయనా.
This post was last modified on September 27, 2023 11:05 pm
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…