డిసెంబర్ లో సలార్ వస్తుందో రాదో ఇంకా హోంబాలే ఫిలిమ్స్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు కానీ సంక్రాంతికి సంబంధించి వేరే సినిమాలు తమ డేట్లను అఫీషియల్ చేసుకుంటున్నాయి. గుంటూరు కారం జనవరి 12 తేదీని ఎప్పుడో తీసుకుంది. ఇవాళ విజయ్ దేవరకొండ – పరశురామ్ కాంబో మూవీని పండగకే తీసుకొస్తున్నట్టు దిల్ రాజు ప్రకటించారు. హనుమాన్ ఎప్పటి నుంచో మహేష్ బాబుతో క్లాష్ అయినా పర్వాలేదని డిసైడ్ అయిపోయి దానికి తగ్గట్టు ప్లానింగ్ చేసుకుంటోంది. తాజాగా మాస్ మహారాజా రవితేజ ఈగల్ కూడా నేను సైతం అంటూ విడుదల తేదీని అధికారికం చేసుకుంది.
వరల్డ్ వైడ్ జనవరి 13న ఈగల్ థియేటర్లలో అడుగుపెట్టబోతున్నాడు. ఇది కొద్దివారాలుగా లీకుల రూపంలో తిరుగుతున్న న్యూసే కానీ టీమ్ చెప్పకపోవడంతో ఫ్యాన్స్ లో ఎంతో కొంత అనుమానాలు నెలకొంటు వచ్చాయి. ఎడిటర్ కార్తీక్ ఘట్టమనేనిని దర్శకుడిగా పరిచయం చేస్తూ రూపొందించిన ఈ భారీ యాక్షన్ డ్రామాలో రవితేజ పలురకాల గెటప్స్ లో కనిపించబోతున్నాడు. ట్రీట్ మెంట్ వైజ్ హాలీవుడ్ స్టాండర్డ్ లో ఉంటుందని యూనిట్ ఇప్పటికీ తెగ ఊరిస్తోంది. ఈ రోజు వదిలిన లుక్ తో సహా గతంలో ఇచ్చిన పోస్టర్లు, టీజర్ అంచనాలు పెంచేవిగానే ఉంటూ వచ్చాయి.
అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈగల్ లో కావ్య థాపర్, నవదీప్, అవసరాల శ్రీనివాస్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. డవ్జాన్ సంగీతం సమకూరుస్తున్నాడు. సో ఇప్పుడు ఈగల్ కన్ఫర్మ్ చేసుకోవడంతో జనవరి రేస్ ఇంకా ఆసక్తికరంగా మారింది. సలార్ నిర్ణయాలు ఎప్పటికప్పుడు చాలా అనూహ్యంగా మారిపోతూ ఉండటంతో మిగిలినవాళ్ళు జాగ్రత్త పడుతున్నారు. ఎలాగూ ప్రభాస్ సంక్రాంతికి రాడనే సమాచారం పక్కాగా ఉండటంతో ఈ రకంగా ప్రకటనల వెల్లువ ముంచెత్తుతోంది. మరి అందరూ మాటకు కట్టుబడి ఉంటారా ఒకరిద్దరు డ్రాప్ అవుతారానేది వేచి చూడాలి.
This post was last modified on September 27, 2023 4:37 pm
జంతర్ మంతర్లో కాక్రోచ్ జనతా పార్టీ చేసిన ఆందోళన విరమించినప్పటికీ అది సృష్టించిన తుఫాన్ కొనసాగుతుంది. సద్దుమణిగిందనుకున్న విషయాన్ని శుక్రవారం…
చెన్నై లవ్ స్టోరీ పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లలో యూనిట్ సభ్యులు కొందరు వాడిన మాట ఒకటుంది. అదే కిరణ్ అబ్బవరం హ్యాట్రిక్…
ఆ మధ్య జరిగిన లెనిన్ సక్సెస్ మీట్ లో కింగ్ నాగార్జున ఒక మాట అన్నారు. ది ఒడిస్సి లాంటి…
భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…
టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…
సూర్య, వెంకీ అట్లూరి కాంబినేషన్ లో తెరకెక్కిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా ఈ నెల 14న థియేటర్లలోకి రానుంది.…