చేసింది కొన్ని సినిమాలే అయినా యాంకర్ కం హీరోయిన్ గా గుర్తుండిపోయిన కలర్ స్వాతి చాలా గ్యాప్ తర్వాత థియేటర్ మూవీతో ప్రేక్షకులను పలకరించబోతోంది. ఆమె ప్రధాన పాత్ర పోషించిన మంత్ అఫ్ మధు వచ్చే నెల 6 విడుదల కాబోతున్న నేపథ్యంలో ట్రైలర్ ఇవాళ ఒక ఈవెంట్ లో లాంచ్ చేశారు. సాయి తేజ్ గెస్టుగా హాజరవ్వగా ఆన్ లైన్ వెర్షన్ ని కొంత ఆలస్యంగా వదిలారు. భానుమతి అండ్ రామకృష్ణతో గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాంత్ నగోతి ఈ ఎమోషనల్ డ్రామాకు దర్శకుడు. మూడున్నర నిమిషాల వీడియోలో కథ మొత్తంగా స్పష్టంగా ఓపెన్ చేశారు.
అమెరికా నుంచి వచ్చిన ఎన్ఆర్ఐ మధు(శ్రేయ నవిలే) ఊబకాయంతో బాధ పడుతూ ఉంటుంది. బోలెడు ఆత్మవిశ్వాసం ఉన్నా లావుగా ఉన్న కారణంగా తల్లి(మంజుల)సైతం అవమానిస్తూ ఇబ్బంది పెడుతుంది. ఈ క్రమంలో తాగుడుకి బానిసైన ఓ మధ్య వయస్కుడు(నవీన్ చంద్ర) పరిచయమవుతాడు. తన గతాన్ని వివరిస్తాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న అందమైన అమ్మాయి(స్వాతి రెడ్డి)కి విడాకులు ఇవ్వాలనుకునే దాకా కుటుంబ పరిస్థితులు ఎలా దారి తీశాయో చెబుతాడు. అసలు మధుకి అతనికి స్నేహం ఎలా కుదిరింది, రెండు కథలు ఏ మజిలీకి దారి తీశాయనేదే అసలు స్టోరీ.
మంచి ఎమోషన్స్ తో దర్శకుడు శ్రీకాంత్ నగోతి ఫెమినిస్ట్ భావాలతో తెరకెక్కించినట్టు కనిపిస్తోంది. డైలాగులు, భావోద్వేగాలు అన్నీ మహిళల కోణంలో సాగాయి. అందరూ స్వాతి రెడ్డిదే మెయిన్ క్యారెక్టర్ అనుకున్నారు కానీ శ్రేయ నవిలే అంతే సమానమైన పాత్ర దక్కించుకుంది. నవీన్ చంద్ర రెండు షేడ్స్ లో విభిన్నంగా కనిపించాడు. పరిమిత బడ్జెట్ లో అయినా యాక్టింగ్ క్వాలిటీతో కంటెంట్ రిచ్ గా ఉంది. అక్టోబర్ 6న చిన్న సినిమాల మధ్య విపరీతమైన పోటీ ఉన్న నేపథ్యంలో జనాన్ని థియేటర్ దాకా తీసుకురావడం మంత్ అఫ్ మధుకి సవాలే. టాక్ బ్రహ్మాండంగా వస్తే అదేం కష్టం కాదు.
This post was last modified on September 26, 2023 11:33 pm
యానిమల్ విడుదలైన టైంలో, అంతకు ముందు కబీర్ సింగ్ సమయంలో బాలీవుడ్ విమర్శకులు, కొందరు నటీనటులు అదే పనిగా దర్శకుడు…
ఎన్నికల ప్రచారంలో ఎండనక.. వాననక.. నానా కష్టాలూ పడిన రాజకీయ ప్రముఖులు, పోలింగ్ తర్వాత, కౌంటింగ్కి ముందు.. కొంత ఉపశమనం…
పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద పోటీకి దిగిన వైసీపీ ఎంపీ (కాకినాడ) వంగా గీత, జనసేన పార్టీలోకి…
ఏపీలో రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి. ఎన్నికల పోలింగ్ జరిగిన ఈ నెల 13న, ఆ రోజు తర్వాత కూడా..…
దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల ఐదో దశ పోలింగ్ సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభం కానుంది. మొత్తం 6…
లోక్ సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే తెలంగాణలో ఉన్న 33 జిల్లాలను 17 జిల్లాలకు కుదిస్తారని వస్తున్న వార్తలు…