చేసింది కొన్ని సినిమాలే అయినా యాంకర్ కం హీరోయిన్ గా గుర్తుండిపోయిన కలర్ స్వాతి చాలా గ్యాప్ తర్వాత థియేటర్ మూవీతో ప్రేక్షకులను పలకరించబోతోంది. ఆమె ప్రధాన పాత్ర పోషించిన మంత్ అఫ్ మధు వచ్చే నెల 6 విడుదల కాబోతున్న నేపథ్యంలో ట్రైలర్ ఇవాళ ఒక ఈవెంట్ లో లాంచ్ చేశారు. సాయి తేజ్ గెస్టుగా హాజరవ్వగా ఆన్ లైన్ వెర్షన్ ని కొంత ఆలస్యంగా వదిలారు. భానుమతి అండ్ రామకృష్ణతో గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాంత్ నగోతి ఈ ఎమోషనల్ డ్రామాకు దర్శకుడు. మూడున్నర నిమిషాల వీడియోలో కథ మొత్తంగా స్పష్టంగా ఓపెన్ చేశారు.
అమెరికా నుంచి వచ్చిన ఎన్ఆర్ఐ మధు(శ్రేయ నవిలే) ఊబకాయంతో బాధ పడుతూ ఉంటుంది. బోలెడు ఆత్మవిశ్వాసం ఉన్నా లావుగా ఉన్న కారణంగా తల్లి(మంజుల)సైతం అవమానిస్తూ ఇబ్బంది పెడుతుంది. ఈ క్రమంలో తాగుడుకి బానిసైన ఓ మధ్య వయస్కుడు(నవీన్ చంద్ర) పరిచయమవుతాడు. తన గతాన్ని వివరిస్తాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న అందమైన అమ్మాయి(స్వాతి రెడ్డి)కి విడాకులు ఇవ్వాలనుకునే దాకా కుటుంబ పరిస్థితులు ఎలా దారి తీశాయో చెబుతాడు. అసలు మధుకి అతనికి స్నేహం ఎలా కుదిరింది, రెండు కథలు ఏ మజిలీకి దారి తీశాయనేదే అసలు స్టోరీ.
మంచి ఎమోషన్స్ తో దర్శకుడు శ్రీకాంత్ నగోతి ఫెమినిస్ట్ భావాలతో తెరకెక్కించినట్టు కనిపిస్తోంది. డైలాగులు, భావోద్వేగాలు అన్నీ మహిళల కోణంలో సాగాయి. అందరూ స్వాతి రెడ్డిదే మెయిన్ క్యారెక్టర్ అనుకున్నారు కానీ శ్రేయ నవిలే అంతే సమానమైన పాత్ర దక్కించుకుంది. నవీన్ చంద్ర రెండు షేడ్స్ లో విభిన్నంగా కనిపించాడు. పరిమిత బడ్జెట్ లో అయినా యాక్టింగ్ క్వాలిటీతో కంటెంట్ రిచ్ గా ఉంది. అక్టోబర్ 6న చిన్న సినిమాల మధ్య విపరీతమైన పోటీ ఉన్న నేపథ్యంలో జనాన్ని థియేటర్ దాకా తీసుకురావడం మంత్ అఫ్ మధుకి సవాలే. టాక్ బ్రహ్మాండంగా వస్తే అదేం కష్టం కాదు.
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…