హీరోయిన్లు స్టార్లుగా ఎదగడం.. అలాగే మంచి స్థాయి నుంచి కిందికి పడిపోవడం చాలా వేగంగా జరిగిపోతుంటుంది. ‘పెళ్ళిసంద-డి’ అనే ఔట్ డేటెడ్ సినిమాతో కథానాయికగా పరిచయం అయిన శ్రీలీల.. ఎంత వేగంగా టాప్ హీరోయిన్ అయిపోయిందో తెలిసిందే. అలాగే టాలీవుడ్లో నంబర్ వన్ హీరోయిన్గా కొన్నేళ్లు ఒక వెలుగు వెలిగిన పూజా హెగ్డే ఉన్నట్లుండి సినిమాలు లేక ఖాళీ అయిపోయింది.
ముందేమో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కాల్సిన సినిమా ఆలస్యం అవుతోందని దాన్నుంచి తప్పుకుంది పూజా. ఆ తర్వాతేమో ఆమెను మహేష్ బాబు మూవీ ‘గుంటూరు కారం’ నుంచి తప్పించేశారు. కొత్తగా ఏ పెద్ద సినిమాలోనూ ఆమె అవకాశం దక్కించుకోలేకపోతోంది. కొత్త ప్రాజెక్టుల గురించి వార్తలు కూడా ఏమీ రావట్లేదు. ఇలాంటి టైంలో ఆమెకు బాలీవుడ్లో ఒక క్రేజీ మూవీలో ఆఫర్ రావడం ఊరటనిచ్చేదే.
బాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకరైన షాహిద్ కపూర్తో జట్టు కట్టబోతోంది పూజా హెగ్డే. వీరి కలయికలో రాబోతున్న సినిమా ‘కోయి షక్’. ఇదొక థ్రిల్లర్ మూవీ అట. ఇందులో పూజా పెర్ఫామెన్స్కు స్కోప్ ఉన్న పాత్రలో నటించబోతోందట. మలయాళంలో ‘కాసనోవా’, ‘ముంబయి పోలీస్’, ‘సెల్యూట్’ లాంటి థ్రిల్లర్ సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించిన రోషన్ ఆండ్రూస్ ఈ చిత్రంతో బాలీవుడ్లో అరంగేట్రం చేయబోతున్నాడు.
‘కబీర్ సింగ్’ బ్లాక్ బస్టర్ అయ్యాక షాహిద్కు సరైన విజయం దక్కలేదు. జెర్సీ, బ్లడీ డాడీ నిరాశపరిచాయి. ‘ఫర్జీ’ వెబ్ సిరీస్తో ఆకట్టుకున్నప్పటికీ.. థియేట్రికల్ రిలీజ్తో మంచి సక్సెస్ కోసం చూస్తున్నాడతను. ఇలాంటి సమయంలో రోషన్తో జట్టు కడుతున్నాడు. రాధేశ్యామ్, ఆచార్య, కిసీ కా భాయ్ కిసీ కా జాన్.. ఇలా ఓవైపు వరుసగా డిజాస్టర్లు చవిచూస్తూ.. కొత్త సినిమాలు చేజారుతున్న దశలో పూజాకు ఇది పెద్ద ఛాన్స్ అనే చెప్పాలి.
This post was last modified on September 25, 2023 6:13 pm
స్కూల్లో పాఠాలు నేర్చుకోవాల్సిన, పరీక్షలు రాయాల్సిన వయసులో ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ అనే కుర్రాడు ఎలా చెలరేగిపోతున్నాడో చూస్తున్నాం. సినీ…
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…