కన్నడలో ఒకే ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోయిన అమ్మాయి రష్మిక మందన్నా. కథానాయికగా ఆమె తొలి చిత్రం ‘కిరిక్ పార్టీ’ అక్కడ బ్లాక్ బస్టర్ అయింది. ఆ సినిమా చేస్తున్న సమయంలోనే హీరో కమ్ ప్రొడ్యూసర్ రక్షిత్ శెట్టితో ఆమె ప్రేమలో పడింది. వెంటనే ఇద్దరూ నిశ్చితార్థం కూడా చేసేసుకున్నారు. కానీ పెళ్లి విషయంలో మాత్రం హడావుడి పడలేదు. రక్షిత్తో రిలేషన్షిప్లో ఉండగానే రష్మిక.. తెలుగులో అవకాశాలు అందుకుంది.
ఇక్కడికొచ్చి టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఎదిగింది. ఈ క్రమంలోనే ఆమె రక్షిత్ నుంచి విడిపోయింది. ఈ విషయంలో కన్నడిగులు ఆమెను తీవ్రంగా ట్రోల్ చేశారు. తెలుగు సినిమాల్లో ప్రయారిటీ పెరిగేసరికి కన్నడ ఇండస్ట్రీని, అలాగే రక్షిత్ను ఆమె మరిచిపోయిందని, అతణ్ని మోసం చేసిందని తనపై విరుచుకుపడ్డారు. అంతే కాక బ్రేకప్ తర్వాత రక్షిత్, రష్మిక ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదని కూడా వార్తలొచ్చాయి.
ఐతే రష్మికతో ఇప్పటికీ తనకు మంచి స్నేహమే ఉందని అంటున్నాడు రక్షిత్. తామిద్దరం తరచుగా మాట్లాడుకుంటామని.. మెసేజ్లు కూడా చేసుకుంటామని అతను తెలిపాడు. కానీ తమ కామన్ ఫ్రెండ్ అయిన రిషబ్కు, రష్మికకు మధ్య మాత్రం ఏం జరుగుతోందో తనకు తెలియదని అతనన్నాడు. ‘‘రిషబ్ సంగతి నాకు తెలియదు. నేను, రష్మిక మాత్రం మాట్లాడుకుంటున్నాం.
నా సినిమా రిలీజైతే తను విష్ చేస్తుంది. అలాగే తన చిత్రం ఏదైనా విడుదలైతే నేను విష్ చేస్తా. కెరీర్ విషయంలో తను ఎన్నో కలలు కంది. వాటిని నిజం చేసుకుంటూ ముందుకు సాగుతున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది” అని రక్షిత్ తెలిపాడు. ‘కాంతార’ రిలీజ్ టైంలో రిషబ్, రష్మికల మధ్య ఒక కోల్డ్ వార్ నడిచింది. ఆమె ఆ సినిమా చూడలేదని వ్యాఖ్యానించగా.. ఓ ఇంటర్వ్యూలో రష్మిక ప్రస్తావన వస్తే వేరే ప్రశ్న అడగాలని రిషబ్ కోపంగా మాట్లాడటం చర్చనీయాంశం అయింది.
This post was last modified on September 24, 2023 3:41 pm
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…