కన్నడలో ఒకే ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోయిన అమ్మాయి రష్మిక మందన్నా. కథానాయికగా ఆమె తొలి చిత్రం ‘కిరిక్ పార్టీ’ అక్కడ బ్లాక్ బస్టర్ అయింది. ఆ సినిమా చేస్తున్న సమయంలోనే హీరో కమ్ ప్రొడ్యూసర్ రక్షిత్ శెట్టితో ఆమె ప్రేమలో పడింది. వెంటనే ఇద్దరూ నిశ్చితార్థం కూడా చేసేసుకున్నారు. కానీ పెళ్లి విషయంలో మాత్రం హడావుడి పడలేదు. రక్షిత్తో రిలేషన్షిప్లో ఉండగానే రష్మిక.. తెలుగులో అవకాశాలు అందుకుంది.
ఇక్కడికొచ్చి టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఎదిగింది. ఈ క్రమంలోనే ఆమె రక్షిత్ నుంచి విడిపోయింది. ఈ విషయంలో కన్నడిగులు ఆమెను తీవ్రంగా ట్రోల్ చేశారు. తెలుగు సినిమాల్లో ప్రయారిటీ పెరిగేసరికి కన్నడ ఇండస్ట్రీని, అలాగే రక్షిత్ను ఆమె మరిచిపోయిందని, అతణ్ని మోసం చేసిందని తనపై విరుచుకుపడ్డారు. అంతే కాక బ్రేకప్ తర్వాత రక్షిత్, రష్మిక ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదని కూడా వార్తలొచ్చాయి.
ఐతే రష్మికతో ఇప్పటికీ తనకు మంచి స్నేహమే ఉందని అంటున్నాడు రక్షిత్. తామిద్దరం తరచుగా మాట్లాడుకుంటామని.. మెసేజ్లు కూడా చేసుకుంటామని అతను తెలిపాడు. కానీ తమ కామన్ ఫ్రెండ్ అయిన రిషబ్కు, రష్మికకు మధ్య మాత్రం ఏం జరుగుతోందో తనకు తెలియదని అతనన్నాడు. ‘‘రిషబ్ సంగతి నాకు తెలియదు. నేను, రష్మిక మాత్రం మాట్లాడుకుంటున్నాం.
నా సినిమా రిలీజైతే తను విష్ చేస్తుంది. అలాగే తన చిత్రం ఏదైనా విడుదలైతే నేను విష్ చేస్తా. కెరీర్ విషయంలో తను ఎన్నో కలలు కంది. వాటిని నిజం చేసుకుంటూ ముందుకు సాగుతున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది” అని రక్షిత్ తెలిపాడు. ‘కాంతార’ రిలీజ్ టైంలో రిషబ్, రష్మికల మధ్య ఒక కోల్డ్ వార్ నడిచింది. ఆమె ఆ సినిమా చూడలేదని వ్యాఖ్యానించగా.. ఓ ఇంటర్వ్యూలో రష్మిక ప్రస్తావన వస్తే వేరే ప్రశ్న అడగాలని రిషబ్ కోపంగా మాట్లాడటం చర్చనీయాంశం అయింది.
This post was last modified on September 24, 2023 3:41 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…