ఏడాది కాలంగా తెలుగు ప్రేక్షకులను రీ రిలీజులు ఎంతగా ముంచెత్తుతున్నాయో చూస్తున్నాం. ఆరంజ్, సూర్య సన్ అఫ్ కృష్ణన్, 3 లాంటివి ఒరిజినల్ టైం కన్నా భారీ వసూళ్లు దక్కించుకోవడం ట్రేడ్ ని సైతం విస్మయపరిచింది. అయితే అన్ని ఇదే బాటలో కనకవర్షం కురిపిస్తాయనుకుంటే పప్పులో కాలేసినట్టే. దానికి ఉదాహరణగా నిలుస్తోంది కల్ట్ క్లాసిక్ 7జి బృందావన కాలనీ. మొన్న శుక్రవారం ఎలాంటి పోటీ లేకుండా మంచి టైమింగ్ చూసుకుని విడుదల ప్లాన్ చేయడంతో హౌస్ ఫుల్ కలెక్షన్లతో థియేటర్లు హోరెత్తిపోవడం ఖాయమని అందరూ భావించారు. అయితే జరిగింది వేరు.
హైదరాబాద్ లాంటి మెయిన్ సెంటర్స్ మినహాయించి ఈ సినిమాకు ఆశించిన స్పందన రాలేదని వసూళ్లు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా జిల్లా కేంద్రాలు, పట్టణాలు చాలా చోట్ల సగం ఆక్యుపెన్సీ లేక బయ్యర్లు డీలా పడ్డారు. కాంపిటీషన్ లేదు కాబట్టి యూత్ దీని కోసం ఎగబడతారని వేసిన అంచనా పూర్తిగా తప్పింది. ఫస్ట్ డే కోటి రూపాయలకు పైగా వచ్చిందని నిర్మాతలు ప్రకటించుకున్నారు కానీ అందులో వాస్తవమెంతో చెప్పలేం. ఆర్టిసి క్రాస్ రోడ్స్, వైజాగ్, విజయవాడ లాంటి ప్రధాన కేంద్రాల్లో మాత్రమే సందడి కనిపించింది తప్ప మిగిలిన చోట్ల రెస్పాన్స్ సోసోనే.
ఆలా అని 7జి బృందావన కాలనీకి కాలదోషం పట్టిందని కాదు కానీ అసలు జనం పండగ వాతావరణంలో థియేటర్లకు వెళ్లే మూడ్ లో పెద్దగా లేరు. ముఖ్యంగా కుర్రకారు టికెట్లకు ఖర్చు పెట్టే డబ్బులు మిగిలించుకుంటే నిమజ్జనం రోజు ఎంజాయ్ చేయొచ్చనే ఆలోచనతో సినిమా ఆప్షన్ ని లైట్ తీసుకున్నారు. దీంతో ఆ ప్రభావం నేరుగా కలెక్షన్ల మీద పడింది. దీనికి తోడు గత మూడు నెలల్లో రీ రిలీజులు విపరీతంగా వచ్చేసి ఆడియెన్సు జేబులకు గట్టిగానే చిల్లులు పెట్టాయి. దాంతో సహజంగానే నెలాఖరు దగ్గరగా ఉన్న టైంలో సైలెంటైపోయారు. ఇలా ఒక క్లాసిక్ కి దక్కాల్సిన గౌరవమైతే రాలేదు.
This post was last modified on September 24, 2023 3:21 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…