ఏడాది కాలంగా తెలుగు ప్రేక్షకులను రీ రిలీజులు ఎంతగా ముంచెత్తుతున్నాయో చూస్తున్నాం. ఆరంజ్, సూర్య సన్ అఫ్ కృష్ణన్, 3 లాంటివి ఒరిజినల్ టైం కన్నా భారీ వసూళ్లు దక్కించుకోవడం ట్రేడ్ ని సైతం విస్మయపరిచింది. అయితే అన్ని ఇదే బాటలో కనకవర్షం కురిపిస్తాయనుకుంటే పప్పులో కాలేసినట్టే. దానికి ఉదాహరణగా నిలుస్తోంది కల్ట్ క్లాసిక్ 7జి బృందావన కాలనీ. మొన్న శుక్రవారం ఎలాంటి పోటీ లేకుండా మంచి టైమింగ్ చూసుకుని విడుదల ప్లాన్ చేయడంతో హౌస్ ఫుల్ కలెక్షన్లతో థియేటర్లు హోరెత్తిపోవడం ఖాయమని అందరూ భావించారు. అయితే జరిగింది వేరు.
హైదరాబాద్ లాంటి మెయిన్ సెంటర్స్ మినహాయించి ఈ సినిమాకు ఆశించిన స్పందన రాలేదని వసూళ్లు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా జిల్లా కేంద్రాలు, పట్టణాలు చాలా చోట్ల సగం ఆక్యుపెన్సీ లేక బయ్యర్లు డీలా పడ్డారు. కాంపిటీషన్ లేదు కాబట్టి యూత్ దీని కోసం ఎగబడతారని వేసిన అంచనా పూర్తిగా తప్పింది. ఫస్ట్ డే కోటి రూపాయలకు పైగా వచ్చిందని నిర్మాతలు ప్రకటించుకున్నారు కానీ అందులో వాస్తవమెంతో చెప్పలేం. ఆర్టిసి క్రాస్ రోడ్స్, వైజాగ్, విజయవాడ లాంటి ప్రధాన కేంద్రాల్లో మాత్రమే సందడి కనిపించింది తప్ప మిగిలిన చోట్ల రెస్పాన్స్ సోసోనే.
ఆలా అని 7జి బృందావన కాలనీకి కాలదోషం పట్టిందని కాదు కానీ అసలు జనం పండగ వాతావరణంలో థియేటర్లకు వెళ్లే మూడ్ లో పెద్దగా లేరు. ముఖ్యంగా కుర్రకారు టికెట్లకు ఖర్చు పెట్టే డబ్బులు మిగిలించుకుంటే నిమజ్జనం రోజు ఎంజాయ్ చేయొచ్చనే ఆలోచనతో సినిమా ఆప్షన్ ని లైట్ తీసుకున్నారు. దీంతో ఆ ప్రభావం నేరుగా కలెక్షన్ల మీద పడింది. దీనికి తోడు గత మూడు నెలల్లో రీ రిలీజులు విపరీతంగా వచ్చేసి ఆడియెన్సు జేబులకు గట్టిగానే చిల్లులు పెట్టాయి. దాంతో సహజంగానే నెలాఖరు దగ్గరగా ఉన్న టైంలో సైలెంటైపోయారు. ఇలా ఒక క్లాసిక్ కి దక్కాల్సిన గౌరవమైతే రాలేదు.
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాకా సినిమా మేజర్ షెడ్యూల్ ఈ జూన్ మధ్యలో ప్రారంభం కాబోతున్నట్లు…
ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బడ్జెట్ ఎంత అయినా సరే.. ప్రభుత్వం నిర్ణయించిన…
కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…
వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…