ఏడాది కాలంగా తెలుగు ప్రేక్షకులను రీ రిలీజులు ఎంతగా ముంచెత్తుతున్నాయో చూస్తున్నాం. ఆరంజ్, సూర్య సన్ అఫ్ కృష్ణన్, 3 లాంటివి ఒరిజినల్ టైం కన్నా భారీ వసూళ్లు దక్కించుకోవడం ట్రేడ్ ని సైతం విస్మయపరిచింది. అయితే అన్ని ఇదే బాటలో కనకవర్షం కురిపిస్తాయనుకుంటే పప్పులో కాలేసినట్టే. దానికి ఉదాహరణగా నిలుస్తోంది కల్ట్ క్లాసిక్ 7జి బృందావన కాలనీ. మొన్న శుక్రవారం ఎలాంటి పోటీ లేకుండా మంచి టైమింగ్ చూసుకుని విడుదల ప్లాన్ చేయడంతో హౌస్ ఫుల్ కలెక్షన్లతో థియేటర్లు హోరెత్తిపోవడం ఖాయమని అందరూ భావించారు. అయితే జరిగింది వేరు.
హైదరాబాద్ లాంటి మెయిన్ సెంటర్స్ మినహాయించి ఈ సినిమాకు ఆశించిన స్పందన రాలేదని వసూళ్లు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా జిల్లా కేంద్రాలు, పట్టణాలు చాలా చోట్ల సగం ఆక్యుపెన్సీ లేక బయ్యర్లు డీలా పడ్డారు. కాంపిటీషన్ లేదు కాబట్టి యూత్ దీని కోసం ఎగబడతారని వేసిన అంచనా పూర్తిగా తప్పింది. ఫస్ట్ డే కోటి రూపాయలకు పైగా వచ్చిందని నిర్మాతలు ప్రకటించుకున్నారు కానీ అందులో వాస్తవమెంతో చెప్పలేం. ఆర్టిసి క్రాస్ రోడ్స్, వైజాగ్, విజయవాడ లాంటి ప్రధాన కేంద్రాల్లో మాత్రమే సందడి కనిపించింది తప్ప మిగిలిన చోట్ల రెస్పాన్స్ సోసోనే.
ఆలా అని 7జి బృందావన కాలనీకి కాలదోషం పట్టిందని కాదు కానీ అసలు జనం పండగ వాతావరణంలో థియేటర్లకు వెళ్లే మూడ్ లో పెద్దగా లేరు. ముఖ్యంగా కుర్రకారు టికెట్లకు ఖర్చు పెట్టే డబ్బులు మిగిలించుకుంటే నిమజ్జనం రోజు ఎంజాయ్ చేయొచ్చనే ఆలోచనతో సినిమా ఆప్షన్ ని లైట్ తీసుకున్నారు. దీంతో ఆ ప్రభావం నేరుగా కలెక్షన్ల మీద పడింది. దీనికి తోడు గత మూడు నెలల్లో రీ రిలీజులు విపరీతంగా వచ్చేసి ఆడియెన్సు జేబులకు గట్టిగానే చిల్లులు పెట్టాయి. దాంతో సహజంగానే నెలాఖరు దగ్గరగా ఉన్న టైంలో సైలెంటైపోయారు. ఇలా ఒక క్లాసిక్ కి దక్కాల్సిన గౌరవమైతే రాలేదు.
This post was last modified on September 24, 2023 3:21 pm
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ప్రమాదానికి గురయ్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్.. కొద్ద దూరం పైకి వెళ్లి…
కుళ్లిపోయిన చికెన్ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో…
బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…
మహారాష్ట్రలో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండగా, నిమిషాల వ్యవధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇప్పుడు సోషల్…
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోనూ మతమార్పిడులను ప్రోత్సహించారని, హిందువులకు ఆయన చేసిందేమీ లేదని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…
సరిగ్గా ఇంకొక్క నెల రోజుల్లో ప్యారడైజ్ రిలీజ్ ఉంది. నాని అభిమానులు కౌంట్ డౌన్ మొదలుపెట్టుకున్నారు. జూన్ నుంచి వరసగా…