మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు మీద అభిమానులు చాలా ఆశలే పెట్టుకున్నారు. కరోనా వల్ల బయట పెద్దగా సంబరాలు చేసుకునే అవకాశం లేకపోయినా.. ఆయన కొత్త సినిమాల ముచ్చట్లతో సోషల్ మీడియా షేక్ అయిపోతుందని ఆశించారు. కానీ వాళ్లను చిరు నిరాశ పరిచాడనే చెప్పాలి. వాళ్లు టీజర్ వస్తుందనుకుంటే మోషన్ పోస్టర్తో సరిపెట్టారు. చిరు కొత్త సినిమా టైటిల్ ‘ఆచార్య’ అన్నది ఎప్పుడో ఖరారైపోయింది. టైటిల్ ప్రకటన కొత్త విషయం కాదు.
ఇక ఫస్ట్ లుక్ పోస్టర్లో విషయం ఉన్నప్పటికీ.. చిరును లాంగ్ షాట్లో, వెనుక నుంచి చూపించడం, ముఖం కూడా సరిగా కనిపించకపోవడం అభిమానులకు అంతగా రుచించలేదు. ఫస్ట్ లుక్ అభిమానులు ఆశించినట్లయితే లేదన్నది వాస్తవం. ‘ఆచార్య’ ముచ్చట పక్కన పెడితే.. చిరు పుట్టిన రోజు నాడు కొత్త సినిమాల ప్రకటనలు ఉంటాయని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతూ వచ్చింది.
‘లూసిఫర్’ రీమేక్ను ప్రకటిస్తారని.. బాబీతో సినిమా గురించి కూడా ప్రకటన ఉంటుందని.. మెహర్ రమేష్తో చేయనున్న ‘వేదాళం’ రీమేక్ గురించి కూడా అనౌన్స్మెంట్ ఉంటుందని.. ఇలా కొన్ని రోజులుగా అనేక ప్రచారాలు జరిగాయి. తన కొత్త సినిమాలు మూడు లైన్లో ఉన్నట్లు చిరంజీవి కూడా ఇంతకుముందే వెల్లడించాడు. అభిమానులు వీటిని దాటి చిరు కోసం లైన్లో ఉన్న త్రివిక్రమ్, హరీష్ శంకర్లతో సినిమాల ఊసులేమైనా వినిపిస్తాయా అని కూడా చూశారు. కానీ చిరు పుట్టిన రోజుకు కేవలం ‘ఆచార్య’ మోషన్ పోస్టర్తో సరిపెట్టేశారు. వేరే సినిమాల గురించి ఎక్కడా చప్పుడే లేదు.
మరి ఈ విషయంలో చిరు ఇప్పుడు సందర్భం కాదని ఉద్దేశపూర్వకంగా ఆ అనౌన్స్మెంట్లు చేయకుండా ఆపాడా.. లేక ఆ సినిమాల సంగతి ఇంకా ఏమీ ఖరారకపోవడం వల్ల, లేదా వేరే సందర్భం చూసి వెల్లడిద్దాం అనుకోవడం వల్ల ఆగారా అన్నది తెలియడం లేదు.
This post was last modified on August 24, 2020 10:13 am
బీఆర్ ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ సీఎం కేసీఆర్ తనయ, మాజీ ఎంపీ కవిత ఈ నెలలో…
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బ్యాటర్ల విధ్వంసం ముందు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తోకముడిచింది. ఆదివారం జరిగిన మ్యాచ్లో…
ఎంత పెద్ద స్టార్ హీరో నటించిన సినిమా అయినా సరైన రీతిలో ప్రేక్షకులకు దానిని చేరవేయడం చాలా అవసరం. కానీ…
ఉప్పెనతో డెబ్యూ చేసిన హీరోయిన్ కృతి శెట్టి వరసగా సినిమాలైతే చేస్తోంది కానీ విజయ లక్ష్మి మాత్రం రానని మొండికేస్తోంది.…
పెద్ది విషయంలో జరుగుతున్న జాప్యం ఇతర సినిమాలను అలర్ట్ చేస్తోంది. రెండుసార్లు రిలీజ్ డేట్ మార్చాక కూడా దానికి కట్టుబడలేని…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిజంగానే పట్టు వదలని విక్రమార్కుడి మాదిరిగా సాగుతున్నారు. గిరిజనుల సమస్యల…