మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు మీద అభిమానులు చాలా ఆశలే పెట్టుకున్నారు. కరోనా వల్ల బయట పెద్దగా సంబరాలు చేసుకునే అవకాశం లేకపోయినా.. ఆయన కొత్త సినిమాల ముచ్చట్లతో సోషల్ మీడియా షేక్ అయిపోతుందని ఆశించారు. కానీ వాళ్లను చిరు నిరాశ పరిచాడనే చెప్పాలి. వాళ్లు టీజర్ వస్తుందనుకుంటే మోషన్ పోస్టర్తో సరిపెట్టారు. చిరు కొత్త సినిమా టైటిల్ ‘ఆచార్య’ అన్నది ఎప్పుడో ఖరారైపోయింది. టైటిల్ ప్రకటన కొత్త విషయం కాదు.
ఇక ఫస్ట్ లుక్ పోస్టర్లో విషయం ఉన్నప్పటికీ.. చిరును లాంగ్ షాట్లో, వెనుక నుంచి చూపించడం, ముఖం కూడా సరిగా కనిపించకపోవడం అభిమానులకు అంతగా రుచించలేదు. ఫస్ట్ లుక్ అభిమానులు ఆశించినట్లయితే లేదన్నది వాస్తవం. ‘ఆచార్య’ ముచ్చట పక్కన పెడితే.. చిరు పుట్టిన రోజు నాడు కొత్త సినిమాల ప్రకటనలు ఉంటాయని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతూ వచ్చింది.
‘లూసిఫర్’ రీమేక్ను ప్రకటిస్తారని.. బాబీతో సినిమా గురించి కూడా ప్రకటన ఉంటుందని.. మెహర్ రమేష్తో చేయనున్న ‘వేదాళం’ రీమేక్ గురించి కూడా అనౌన్స్మెంట్ ఉంటుందని.. ఇలా కొన్ని రోజులుగా అనేక ప్రచారాలు జరిగాయి. తన కొత్త సినిమాలు మూడు లైన్లో ఉన్నట్లు చిరంజీవి కూడా ఇంతకుముందే వెల్లడించాడు. అభిమానులు వీటిని దాటి చిరు కోసం లైన్లో ఉన్న త్రివిక్రమ్, హరీష్ శంకర్లతో సినిమాల ఊసులేమైనా వినిపిస్తాయా అని కూడా చూశారు. కానీ చిరు పుట్టిన రోజుకు కేవలం ‘ఆచార్య’ మోషన్ పోస్టర్తో సరిపెట్టేశారు. వేరే సినిమాల గురించి ఎక్కడా చప్పుడే లేదు.
మరి ఈ విషయంలో చిరు ఇప్పుడు సందర్భం కాదని ఉద్దేశపూర్వకంగా ఆ అనౌన్స్మెంట్లు చేయకుండా ఆపాడా.. లేక ఆ సినిమాల సంగతి ఇంకా ఏమీ ఖరారకపోవడం వల్ల, లేదా వేరే సందర్భం చూసి వెల్లడిద్దాం అనుకోవడం వల్ల ఆగారా అన్నది తెలియడం లేదు.
స్టార్ హీరోలు లేని బాక్సాఫీస్ క్లాష్ మాములుగా అయితే అంత ఆసక్తికరంగా ఉండదు. కానీ జూలై మొదటి మూడో తేదీ…
దురంధర్ ది రివెంజ్ తర్వాత మళ్ళీ ఆ స్థాయి బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్న బాలీవుడ్ బాక్సాఫీస్ కు…
అరవింద సమేత వీరరాఘవ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయిక కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.…
మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతున్న ఇరుముడి ఆగస్ట్ 21 విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఒక టీజర్ రూపంలో…
ఎప్పుడో గజిని తర్వాత అంత పెద్ద బ్లాక్ బస్టర్ మళ్ళీ చూడలేకపోయాననే సూర్య కొరతని కరుప్పు మూడు వందల కోట్లు…
అమరావతి రాజధానిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. రాజధానికి కేంద్రం నుంచి భారీగా…