కెరీర్ ఆరంభంలో వరుసగా విజయాలు వచ్చాయంటే ఆ హీరోయిన్ని నెత్తిన పెట్టుకుంటుంది ఫిలిం ఇండస్ట్రీ. అందులోనూ తొలి సినిమాలో పెద్దగా కంటెంట్ లేకపోయినా.. హీరోయిన్ ప్లస్ కావడం వల్ల అది సక్సెస్ అయితే ఇంకేమైనా ఉందా? పెళ్లిసంద-డి చిత్రంతో కథానాయికగా పరిచయం అయిన శ్రీలీల ఈ కోవలోనే టాలీవుడ్లో డిమాండ్ తెచ్చుకుంది. తన రెండో సినిమా ధమాకా బ్లాక్బస్టర్ కావడంతో ఆమె స్టార్ స్టేటస్ సంపాదించింది.
అందం, అభినయంతో పాటు మంచి డ్యాన్సింగ్ స్కిల్స్ కూడా ఉండటంతో శ్రీలీల చూస్తుండగానే బిజీ హీరోయిన్ అయిపోయింది. రాబోయే నాలుగు నెలల్లో ఆమె సినిమాలు ఐదు దాకా రిలీజ్ కాబోతున్నాయంటే.. అందులో మహేష్ బాబు సరసన చేసిన గుంటూరు కారం కూడా ఉందంటే తన క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
ఐతే ఇప్పుడు శ్రీలీలకు ఒక ఊహించని కష్టం వచ్చిందట. ఆల్రెడీ ఒప్పుకున్న సినిమాలకే డేట్లు సర్దుబాటు చేయలేక.. కొత్తగా మంచి ఆఫర్లు వస్తున్నా ఒప్పుకోలేక శ్రీలీల బాగా ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. ఆల్రెడీ ఆమె విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాకు కథానాయికగా ఓకే అయిన సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ గురించి అందరూ ఎగ్జైట్ అయ్యారు.
కానీ ఈ సినిమాకు కాల్ షీట్స్ ఇవ్వలేక బయటికి వచ్చేసిందట శ్రీలీల. అంతే కాక ధమాకా తర్వాత రవితేజతో మళ్లీ జట్టు కట్టే అవకాశం వచ్చినా అంగీకరించలేకపోయిందట. గోపీచంద్ మలినేని సినిమాలో ముందు శ్రీలీలనే కథానాయికగా అనుకున్నా.. ఆమె ఈ సినిమాకు డేట్లు ఇవ్వలేకపోవడంతోనే రష్మిక మందన్నాను ఎంచుకున్నట్లు సమాచారం. ఇప్పుడు ఒప్పుకున్న సినిమాలకే డేట్లు క్లాష్ అవుతుండటంతో ఇప్పుడిప్పుడే ఆమె కొత్త సినిమాలేవీ ఒప్పుకునే పరిస్థితి లేదట.
This post was last modified on September 24, 2023 8:41 am
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…