కెరీర్ ఆరంభంలో వరుసగా విజయాలు వచ్చాయంటే ఆ హీరోయిన్ని నెత్తిన పెట్టుకుంటుంది ఫిలిం ఇండస్ట్రీ. అందులోనూ తొలి సినిమాలో పెద్దగా కంటెంట్ లేకపోయినా.. హీరోయిన్ ప్లస్ కావడం వల్ల అది సక్సెస్ అయితే ఇంకేమైనా ఉందా? పెళ్లిసంద-డి చిత్రంతో కథానాయికగా పరిచయం అయిన శ్రీలీల ఈ కోవలోనే టాలీవుడ్లో డిమాండ్ తెచ్చుకుంది. తన రెండో సినిమా ధమాకా బ్లాక్బస్టర్ కావడంతో ఆమె స్టార్ స్టేటస్ సంపాదించింది.
అందం, అభినయంతో పాటు మంచి డ్యాన్సింగ్ స్కిల్స్ కూడా ఉండటంతో శ్రీలీల చూస్తుండగానే బిజీ హీరోయిన్ అయిపోయింది. రాబోయే నాలుగు నెలల్లో ఆమె సినిమాలు ఐదు దాకా రిలీజ్ కాబోతున్నాయంటే.. అందులో మహేష్ బాబు సరసన చేసిన గుంటూరు కారం కూడా ఉందంటే తన క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
ఐతే ఇప్పుడు శ్రీలీలకు ఒక ఊహించని కష్టం వచ్చిందట. ఆల్రెడీ ఒప్పుకున్న సినిమాలకే డేట్లు సర్దుబాటు చేయలేక.. కొత్తగా మంచి ఆఫర్లు వస్తున్నా ఒప్పుకోలేక శ్రీలీల బాగా ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. ఆల్రెడీ ఆమె విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాకు కథానాయికగా ఓకే అయిన సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ గురించి అందరూ ఎగ్జైట్ అయ్యారు.
కానీ ఈ సినిమాకు కాల్ షీట్స్ ఇవ్వలేక బయటికి వచ్చేసిందట శ్రీలీల. అంతే కాక ధమాకా తర్వాత రవితేజతో మళ్లీ జట్టు కట్టే అవకాశం వచ్చినా అంగీకరించలేకపోయిందట. గోపీచంద్ మలినేని సినిమాలో ముందు శ్రీలీలనే కథానాయికగా అనుకున్నా.. ఆమె ఈ సినిమాకు డేట్లు ఇవ్వలేకపోవడంతోనే రష్మిక మందన్నాను ఎంచుకున్నట్లు సమాచారం. ఇప్పుడు ఒప్పుకున్న సినిమాలకే డేట్లు క్లాష్ అవుతుండటంతో ఇప్పుడిప్పుడే ఆమె కొత్త సినిమాలేవీ ఒప్పుకునే పరిస్థితి లేదట.
This post was last modified on September 24, 2023 8:41 am
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
రాజకీయ పార్టీలకు ప్రముఖ సంస్థలు విరాళాలు ఇవ్వడం కొత్తకాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వడం(వాటి ఇష్టమే…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…