చంద్రముఖి అనగానే అందరికీ ముందు గుర్తుకొచ్చేది రజినీ పేరే. జ్యోతిక కూడా అద్భుతమైన నటన కనబరిచినప్పటికీ రజినీ పెర్ఫామెన్స్ అంత సులువుగా మరిచిపోదగ్గది కాదు. సినిమాను వేరే లెవెల్కు తీసుకెళ్లింది రజినీనే అనడంలో సందేహం లేదు. ఐతే ఈ సినిమాకు రెండు సీక్వెల్స్ రాగా.. వాటిలో రజినీ నటించలేదు. చంద్రముఖికి కొనసాగింపుగా తెలుగులో నాగవల్లి తీసిన పి.వాసు.. వెంకటేష్ను హీరోగా ఎంచుకున్నాడు.
ఆ చిత్రం పెద్ద డిజాస్టర్ అయింది. ఇప్పుడాయన తమిళంలో వేరుగా సీక్వెల్ తీశారు. అందులో లారెన్స్ హీరోగా చేశాడు. ఐతే రజినీ లేకుండా చంద్రముఖి సీక్వెల్ ఏంటి అని పెదవి విరుస్తున్న వారే ఎక్కువ. కాగా రజినీకి ఈ కథ చెబితే ఆయన తిరస్కరించారని.. దీంతో లారెన్స్ను వాసు అప్రోచ్ అయ్యాడని ఒక ప్రచారం ఉంది.
చంద్రముఖి-2 తెలుగు ప్రమోషన్లలో భాగంగా ప్రెస్ మీట్లో పాల్గొన్న పి.వాసును విలేకరులు ఇదే విషయం అడిగారు. దీనికి ఆయన బదులిస్తూ.. అసలు చంద్రముఖి-2 స్టోరీ రజినీకి వినిపించనే లేదని.. ఒక్క లైన్ కూడా ఆయనకు చెప్పలేదని.. ఇక ఆయన రిజెక్ట్ చేయడం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు.
రజినీతో ఈ సినిమా తీయాలంటే ఆయన పాత్రనే కొనసాగించాలని.. ఐతే తాను వేరే పాత్రను సృష్టించి అందుకు తగ్గట్లు కథను అల్లామని.. అలాంటపుడు రజినీ ఈ సినిమా ఎలా చేస్తారని ఆయన అన్నాడు. కొత్త పాత్రను ఏ హీరో అయినా చేయొచ్చని.. కాబట్టే ఇందులోకి లారెన్స్ వచ్చాడని వాసు తెలిపాడు. ఇక చంద్రముఖి-2 చివర్లో మరో సీక్వెల్ కోసం హింట్ ఉంటుందని.. అవకాశాన్ని బట్టి చంద్రముఖి-2 కూడా చేస్తామని వాసు చెప్పాడు. ఈ సినిమాలో చివరి అరగంట ఎంతో ఉత్కంఠభరితంగా ఉంటుందని వాసు తెలిపాడు.
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…