చంద్రముఖి అనగానే అందరికీ ముందు గుర్తుకొచ్చేది రజినీ పేరే. జ్యోతిక కూడా అద్భుతమైన నటన కనబరిచినప్పటికీ రజినీ పెర్ఫామెన్స్ అంత సులువుగా మరిచిపోదగ్గది కాదు. సినిమాను వేరే లెవెల్కు తీసుకెళ్లింది రజినీనే అనడంలో సందేహం లేదు. ఐతే ఈ సినిమాకు రెండు సీక్వెల్స్ రాగా.. వాటిలో రజినీ నటించలేదు. చంద్రముఖికి కొనసాగింపుగా తెలుగులో నాగవల్లి తీసిన పి.వాసు.. వెంకటేష్ను హీరోగా ఎంచుకున్నాడు.
ఆ చిత్రం పెద్ద డిజాస్టర్ అయింది. ఇప్పుడాయన తమిళంలో వేరుగా సీక్వెల్ తీశారు. అందులో లారెన్స్ హీరోగా చేశాడు. ఐతే రజినీ లేకుండా చంద్రముఖి సీక్వెల్ ఏంటి అని పెదవి విరుస్తున్న వారే ఎక్కువ. కాగా రజినీకి ఈ కథ చెబితే ఆయన తిరస్కరించారని.. దీంతో లారెన్స్ను వాసు అప్రోచ్ అయ్యాడని ఒక ప్రచారం ఉంది.
చంద్రముఖి-2 తెలుగు ప్రమోషన్లలో భాగంగా ప్రెస్ మీట్లో పాల్గొన్న పి.వాసును విలేకరులు ఇదే విషయం అడిగారు. దీనికి ఆయన బదులిస్తూ.. అసలు చంద్రముఖి-2 స్టోరీ రజినీకి వినిపించనే లేదని.. ఒక్క లైన్ కూడా ఆయనకు చెప్పలేదని.. ఇక ఆయన రిజెక్ట్ చేయడం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు.
రజినీతో ఈ సినిమా తీయాలంటే ఆయన పాత్రనే కొనసాగించాలని.. ఐతే తాను వేరే పాత్రను సృష్టించి అందుకు తగ్గట్లు కథను అల్లామని.. అలాంటపుడు రజినీ ఈ సినిమా ఎలా చేస్తారని ఆయన అన్నాడు. కొత్త పాత్రను ఏ హీరో అయినా చేయొచ్చని.. కాబట్టే ఇందులోకి లారెన్స్ వచ్చాడని వాసు తెలిపాడు. ఇక చంద్రముఖి-2 చివర్లో మరో సీక్వెల్ కోసం హింట్ ఉంటుందని.. అవకాశాన్ని బట్టి చంద్రముఖి-2 కూడా చేస్తామని వాసు చెప్పాడు. ఈ సినిమాలో చివరి అరగంట ఎంతో ఉత్కంఠభరితంగా ఉంటుందని వాసు తెలిపాడు.
This post was last modified on September 24, 2023 8:38 am
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…