చంద్రముఖి అనగానే అందరికీ ముందు గుర్తుకొచ్చేది రజినీ పేరే. జ్యోతిక కూడా అద్భుతమైన నటన కనబరిచినప్పటికీ రజినీ పెర్ఫామెన్స్ అంత సులువుగా మరిచిపోదగ్గది కాదు. సినిమాను వేరే లెవెల్కు తీసుకెళ్లింది రజినీనే అనడంలో సందేహం లేదు. ఐతే ఈ సినిమాకు రెండు సీక్వెల్స్ రాగా.. వాటిలో రజినీ నటించలేదు. చంద్రముఖికి కొనసాగింపుగా తెలుగులో నాగవల్లి తీసిన పి.వాసు.. వెంకటేష్ను హీరోగా ఎంచుకున్నాడు.
ఆ చిత్రం పెద్ద డిజాస్టర్ అయింది. ఇప్పుడాయన తమిళంలో వేరుగా సీక్వెల్ తీశారు. అందులో లారెన్స్ హీరోగా చేశాడు. ఐతే రజినీ లేకుండా చంద్రముఖి సీక్వెల్ ఏంటి అని పెదవి విరుస్తున్న వారే ఎక్కువ. కాగా రజినీకి ఈ కథ చెబితే ఆయన తిరస్కరించారని.. దీంతో లారెన్స్ను వాసు అప్రోచ్ అయ్యాడని ఒక ప్రచారం ఉంది.
చంద్రముఖి-2 తెలుగు ప్రమోషన్లలో భాగంగా ప్రెస్ మీట్లో పాల్గొన్న పి.వాసును విలేకరులు ఇదే విషయం అడిగారు. దీనికి ఆయన బదులిస్తూ.. అసలు చంద్రముఖి-2 స్టోరీ రజినీకి వినిపించనే లేదని.. ఒక్క లైన్ కూడా ఆయనకు చెప్పలేదని.. ఇక ఆయన రిజెక్ట్ చేయడం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు.
రజినీతో ఈ సినిమా తీయాలంటే ఆయన పాత్రనే కొనసాగించాలని.. ఐతే తాను వేరే పాత్రను సృష్టించి అందుకు తగ్గట్లు కథను అల్లామని.. అలాంటపుడు రజినీ ఈ సినిమా ఎలా చేస్తారని ఆయన అన్నాడు. కొత్త పాత్రను ఏ హీరో అయినా చేయొచ్చని.. కాబట్టే ఇందులోకి లారెన్స్ వచ్చాడని వాసు తెలిపాడు. ఇక చంద్రముఖి-2 చివర్లో మరో సీక్వెల్ కోసం హింట్ ఉంటుందని.. అవకాశాన్ని బట్టి చంద్రముఖి-2 కూడా చేస్తామని వాసు చెప్పాడు. ఈ సినిమాలో చివరి అరగంట ఎంతో ఉత్కంఠభరితంగా ఉంటుందని వాసు తెలిపాడు.
This post was last modified on September 24, 2023 8:38 am
ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…
అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…
చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే…
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత…
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…