చంద్రముఖి అనగానే అందరికీ ముందు గుర్తుకొచ్చేది రజినీ పేరే. జ్యోతిక కూడా అద్భుతమైన నటన కనబరిచినప్పటికీ రజినీ పెర్ఫామెన్స్ అంత సులువుగా మరిచిపోదగ్గది కాదు. సినిమాను వేరే లెవెల్కు తీసుకెళ్లింది రజినీనే అనడంలో సందేహం లేదు. ఐతే ఈ సినిమాకు రెండు సీక్వెల్స్ రాగా.. వాటిలో రజినీ నటించలేదు. చంద్రముఖికి కొనసాగింపుగా తెలుగులో నాగవల్లి తీసిన పి.వాసు.. వెంకటేష్ను హీరోగా ఎంచుకున్నాడు.
ఆ చిత్రం పెద్ద డిజాస్టర్ అయింది. ఇప్పుడాయన తమిళంలో వేరుగా సీక్వెల్ తీశారు. అందులో లారెన్స్ హీరోగా చేశాడు. ఐతే రజినీ లేకుండా చంద్రముఖి సీక్వెల్ ఏంటి అని పెదవి విరుస్తున్న వారే ఎక్కువ. కాగా రజినీకి ఈ కథ చెబితే ఆయన తిరస్కరించారని.. దీంతో లారెన్స్ను వాసు అప్రోచ్ అయ్యాడని ఒక ప్రచారం ఉంది.
చంద్రముఖి-2 తెలుగు ప్రమోషన్లలో భాగంగా ప్రెస్ మీట్లో పాల్గొన్న పి.వాసును విలేకరులు ఇదే విషయం అడిగారు. దీనికి ఆయన బదులిస్తూ.. అసలు చంద్రముఖి-2 స్టోరీ రజినీకి వినిపించనే లేదని.. ఒక్క లైన్ కూడా ఆయనకు చెప్పలేదని.. ఇక ఆయన రిజెక్ట్ చేయడం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు.
రజినీతో ఈ సినిమా తీయాలంటే ఆయన పాత్రనే కొనసాగించాలని.. ఐతే తాను వేరే పాత్రను సృష్టించి అందుకు తగ్గట్లు కథను అల్లామని.. అలాంటపుడు రజినీ ఈ సినిమా ఎలా చేస్తారని ఆయన అన్నాడు. కొత్త పాత్రను ఏ హీరో అయినా చేయొచ్చని.. కాబట్టే ఇందులోకి లారెన్స్ వచ్చాడని వాసు తెలిపాడు. ఇక చంద్రముఖి-2 చివర్లో మరో సీక్వెల్ కోసం హింట్ ఉంటుందని.. అవకాశాన్ని బట్టి చంద్రముఖి-2 కూడా చేస్తామని వాసు చెప్పాడు. ఈ సినిమాలో చివరి అరగంట ఎంతో ఉత్కంఠభరితంగా ఉంటుందని వాసు తెలిపాడు.
This post was last modified on September 24, 2023 8:38 am
గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…